Movie News

ఎస్ఎస్ఎంబి 29…రామాయణం లింక్ ?

మహేష్ బాబు 29 షూటింగ్ ప్రారంభమై నెలలు గడుస్తున్నా కనీసం పూజా కార్యక్రమం ఫోటోలు కూడా బయటకి ఇవ్వకుండా రాజమౌళి తీసుకుంటున్న జాగ్రత్తలు అన్ని ఇన్ని కావు. అయినా ఏదో ఒక రూపంలో లీకులు వస్తూనే ఉన్నాయి. పృథ్విరాజ్ సుకుమారన్ ఉన్న విషయం ఆయనగా చెప్పలేదు. కానీ బయటికి వచ్చేసింది. నానా పాటేకర్, విక్రమ్ నో చెప్పింది, మాధవన్ సానుకూలంగా ఉన్న న్యూసులు ఏదో ఒక రూపంలో తిరుగుతూనే ఉన్నాయి. ఆ మాటకొస్తే ప్రియాంకా చోప్రా ఉన్న సంగతి కూడా జక్కన్న అఫీషియల్ గా బయట పెట్టలేదు. ఇదిలా ఉండగా ఫ్యాన్స్ కి మంచి గూస్ బంప్స్ ఇచ్చే టాక్ ఒకటి ఎంట్రీ ఇచ్చింది.

ఈ ప్యాన్ ఇండియా మూవీ అడవి నేపథ్యంలో జరిగే సంగతి తెలిసిందే, ఇండియానా జోన్స్ స్పూర్తితో ఒక టెర్రిఫిక్ సబ్జెక్టు తయారు చేశామని రచయిత విజయేంద్ర ప్రసాద్ ఆ మధ్య పలు ఇంటర్వ్యూలో చెప్పడం గుర్తే. తాజా లీక్ ఏంటంటే దీనికి రామాయణంకి ముడిపెట్టారట. అదెలా అంటే మేరు పర్వతం గుర్తుందిగా. ఇంద్రజిత్ వేసిన బాణానికి లక్ష్మణుడికి ప్రాణాపాయం కలిగితే తనను బ్రతికించాడనికి సంజీవిని మూలికలు కావాలని సుశేణ వైద్యుడు చెబుతాడు. దాంతో అవి తేవడానికి వెళ్లిన హనుమంతుడు వాటిని గుర్తించలేక మొత్తం కొండను ఎత్తుకొచ్చి లక్ష్మణుడిని కాపాడుకుంటాడు.

ఇప్పుడీ సంజీవిని మూలికలే ఎస్ఎస్ఎంబి 29లో ఒక కీలక ట్విస్టుకి దారి తీస్తాయట. మహేష్ బాబు వాటిని తెచ్చేందుకు అడవిలోకి వెళ్లే ఎపిసోడ్ రాజమౌళి అద్భుతంగా చిత్రీకరించబోతున్నారని ఇన్ సైడ్ టాక్. ఇది నిజమో కాదో కానీ వింటేనే మంచి హై ఇచ్చేలా ఉంది. అసలు సాధ్యమే కానీ అల్లూరి సీతారామరాజు-కొమరం భీం కలయికని సాధ్యం చేసిన జక్కన్న ఇప్పుడీ సంజీవనిని ఫారెస్ట్ అడ్వెంచర్ లో చూపించడం పెద్ద కష్టమేమి కాదు. త్వరలో ఆఫ్రికా వెళ్ళబోతున్న మహేష్ రాజమౌళి టీమ్ అక్కడ చాలా కీలకమైన సన్నివేశాలను షూట్ చేసుకోనుంది. 2027లో సినిమా విడుదలను లక్ష్యంగా పెట్టుకున్నారు.

This post was last modified on June 10, 2025 4:34 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

2 hours ago

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

5 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

5 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

8 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

10 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

10 hours ago