కూలీలో అమీర్ ఖాన్ ఎందుకు ప్రత్యేక పాత్ర పోషించాడనే అనుమానం ముందు నుంచి అభిమానుల్లో లేకపోలేదు. ఏనాడూ తమిళ తెలుగు సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపని అమీర్ హఠాత్తుగా లోకేష్ కనగరాజ్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎట్టకేలకు దానికి సమాధానం దొరికింది. లోకేష్ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో సూర్య హీరోగా ఒక పవర్ ఫుల్ సబ్జెక్టు రాసుకున్నాడు. అదే ఇరుంబు కై మాయావి. యాక్సిడెంట్ లో ఒక చేయి పోగొట్టుకున్న యువకుడు దాన్ని లోహాలతో చేసిన కృత్రిమ చేయిగా మార్చుకుంటాడు. దాని వల్ల అతనికి అద్వితీయ శక్తులు వస్తాయి.
అక్కడి నుంచి సూపర్ హీరో అవుతాడు. అక్కడి నుంచి అసలు కథ షురూ. దీనికి పెద్ద ఎత్తున స్పెషల్ ఎఫెక్ట్స్ అవసరం. అనుభవం లేని లోకేష్ మీద అంత బడ్జెట్ పెట్టేందుకు ఏ నిర్మాతా సాహసించలేదు. క్రమంగా సూర్య కూడా సైడ్ తీసుకున్నాడు. కట్ చేస్తే ఇప్పుడు లోకేష్ కనగరాజ్ మార్కెట్ కి ఏ స్టోరీ అయినా వందల కోట్లతో ప్రొడ్యూసర్లు సిద్ధంగా ఉన్నారు. అందుకే ఇప్పుడా ఇరుంబు కై మాయావిని బయటికి తెస్తున్నాడు. ఇదే సబ్జెక్టుని మరింత మెరుగ్గా రాసుకుని అమీర్ ఖాన్ కి గత ఏడాదే చెప్పి ఒప్పించినా సెట్స్ మీద వెళ్ళడానికి టైం పట్టింది. 2026 సెకండాఫ్ తర్వాత షూటింగ్ ప్రారంభం కాబోతోంది.
ఇది స్టార్టవుతున్న విషయం అమీర్ ఖాన్ స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పేశాడు. అంటే కూలి రిలీజయ్యాక ఖైదీ 2 మొదలుపెట్టే లోకేష్ కనగరాజ్ దాన్ని త్వరగా ఫినిష్ చేసి ఇరుంబు కై మాయావి మీదకోస్తాడు. అయితే టైటిల్ మారుతుంది లెండి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇప్పటిదాకా బాలీవుడ్ సూపర్ హీరో అంటే గుర్తొచ్చే పేరు క్రిష్ ఒకటే. ఇప్పుడు దాన్ని తలదన్నేలా లోకేష్ కనగరాజ్ స్క్రిప్ట్ తయారు చేస్తున్నట్టు సమాచారం. హీరోయిన్, సాంకేతిక బృందం తదితర వివరాలు ఇంకా తెలియలేదు. 2027 చివరిలో విడుదల చేసే లక్ష్యంతో త్వరలోనే మొదలుపెట్టబోతున్నట్టు టాక్.
This post was last modified on June 5, 2025 6:26 pm
ఇటీవలే టోవినో థామస్ 'పళ్ళి చట్టంబి' తెలుగు వెర్షన్ విడుదలయ్యింది. మార్నింగ్ షోనే డెఫిసిట్ తో మొదలై సాయంత్రానికే డిజాస్టర్…
కల్వకుంట్ల కవిత.. మాజీసీఎం కేసీఆర్ తనయగా.. రాజకీయాల్లోకి అడుగు పెట్టిన ఆమె.. ఎంపీగా, ఎమ్మెల్సీగా వ్యవహరించారు. ఇక, ఆ పార్టీతో…
టాలీవుడ్లో బిగ్గెస్ట్ సినీ ఫ్యామిలీ ఏది అంటే.. మెగా కుటుంబం గురించే ముందుగా చెప్పుకోవాలి. ఆ కుటుంబంలో ఉన్నంత మంది…
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మలయాళ పరిశ్రమను మినహాయిస్తే.. ప్రతి చోటా సినిమాల మేకింగ్ బాగా టైం తీసుకుంటోంది. కొంచెం స్టార్ ఇమేజ్…
టీడీపీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఏపీకి పలుమార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన దివంగత నందమూరి తారక రామారావుకు భారత దేశ అత్యున్నత పురస్కారం భారత రత్న ఇవ్వాలన్నమాట నిత్యం…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో కూటమి పార్టీలకు చెందిన నేతల మధ్య…