Movie News

‘మంచు’ గొడవలో తమ్మారెడ్డి రాయబారం

టాలీవుడ్లో ఎంతో అన్యోన్యంగా ఉండే కుటుంబాల్లో ఒకటిగా ‘మంచు’ ఫ్యామిలీకి పేరుండేది. కానీ గత కొన్ని నెలల్లో ఆ పేరు బాగా చెడిపోయింది. అన్నదమ్ములు మంచు విష్ణు, మంచు మనోజ్ మధ్య చిన్నగా మొదలైన గొడవ చాలా పెద్ద స్థాయికి వెళ్లిపోయింది. పరస్పరం కేసులు పెట్టుకోవడం.. తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేసుకోవడం.. ఇలా గొడవ చాలా దూరం వెళ్లిపోయింది. ఎంతకీ ఈ వివాదం సమసిపోవట్లేదు. దీనికి వీలైనంత త్వరగా తెరపడాలని మంచు ఫ్యామిలీ అభిమానులే కాక అందరూ కోరుకుంటున్నారు. కానీ ఈ తగువు తీర్చేదెవరన్నదే అర్థం కావడం లేదు.

ఐతే ఇండస్ట్రీ పెద్దల్లో ఒకరైన తమ్మారెడ్డి భరద్వాజ ఈ విషయంలో ఇప్పుడు చొరవ తీసుకుంటున్నారు. ‘కన్నప్ప’ సినిమా తర్వాత అందరూ కూర్చుని సమస్యను పరిష్కరించుకోవాలని ఆయన కోరారు. ఇందుకోసం తాను రాయబారం నడపడానికి రెడీ అయ్యారు.

‘కన్నప్ప’ సినిమా ప్రమోషన్లలో భాగంగా మంచు విష్ణు పాల్గొన్న ఓ ఇంటర్వ్యూకు తమ్మారెడ్డి కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారి కుటుంబ గొడవ గురించి ఆయన ప్రస్తావించారు. గొడవలు జరిగిన కొన్ని రోజులకే తమ్మారెడ్డి.. మంచు విష్ణుకు ఫోన్ చేసి ఇదంతా ఏంటి.. ఏం జరుగుతోందసలు అని అడిగారట.

మంచు కుటుంబంలో గొడవలు చూస్తుంటే తనకెంతో బాధగా అనిపిస్తోందని తమ్మారెడ్డి అన్నారు. ‘కన్నప్ప’ రిలీజ్ తర్వాత అందరూ కూర్చుని సమస్యను పరిష్కరించుకోవాలని.. కావాలంటే ఈ విషయంలో పెద్దరికం తీసుకోవడానికి సిద్ధమని చెప్పారు. ఈ మాటకు విష్ణు కూడా సరే అన్నాడు. తమ్మారెడ్డి సలహాలు తీసుకుంటానని.. ఆయన మాటలను ఫాలో అవుతానని చెప్పాడు. మరి తమ్మారెడ్డి అన్నట్లు ‘కన్నప్ప’ రిలీజయ్యాక మంచు కుటుంబం కలిసి కూర్చుని మాట్లాడుకుని వివాదాలకు తెరదించుతుందేమో చూద్దాం.

This post was last modified on May 25, 2025 1:56 pm

Share
Show comments

Recent Posts

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

19 minutes ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

55 minutes ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

2 hours ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

4 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

6 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

10 hours ago