టాలీవుడ్లో ఎంతో అన్యోన్యంగా ఉండే కుటుంబాల్లో ఒకటిగా ‘మంచు’ ఫ్యామిలీకి పేరుండేది. కానీ గత కొన్ని నెలల్లో ఆ పేరు బాగా చెడిపోయింది. అన్నదమ్ములు మంచు విష్ణు, మంచు మనోజ్ మధ్య చిన్నగా మొదలైన గొడవ చాలా పెద్ద స్థాయికి వెళ్లిపోయింది. పరస్పరం కేసులు పెట్టుకోవడం.. తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేసుకోవడం.. ఇలా గొడవ చాలా దూరం వెళ్లిపోయింది. ఎంతకీ ఈ వివాదం సమసిపోవట్లేదు. దీనికి వీలైనంత త్వరగా తెరపడాలని మంచు ఫ్యామిలీ అభిమానులే కాక అందరూ కోరుకుంటున్నారు. కానీ ఈ తగువు తీర్చేదెవరన్నదే అర్థం కావడం లేదు.
ఐతే ఇండస్ట్రీ పెద్దల్లో ఒకరైన తమ్మారెడ్డి భరద్వాజ ఈ విషయంలో ఇప్పుడు చొరవ తీసుకుంటున్నారు. ‘కన్నప్ప’ సినిమా తర్వాత అందరూ కూర్చుని సమస్యను పరిష్కరించుకోవాలని ఆయన కోరారు. ఇందుకోసం తాను రాయబారం నడపడానికి రెడీ అయ్యారు.
‘కన్నప్ప’ సినిమా ప్రమోషన్లలో భాగంగా మంచు విష్ణు పాల్గొన్న ఓ ఇంటర్వ్యూకు తమ్మారెడ్డి కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారి కుటుంబ గొడవ గురించి ఆయన ప్రస్తావించారు. గొడవలు జరిగిన కొన్ని రోజులకే తమ్మారెడ్డి.. మంచు విష్ణుకు ఫోన్ చేసి ఇదంతా ఏంటి.. ఏం జరుగుతోందసలు అని అడిగారట.
మంచు కుటుంబంలో గొడవలు చూస్తుంటే తనకెంతో బాధగా అనిపిస్తోందని తమ్మారెడ్డి అన్నారు. ‘కన్నప్ప’ రిలీజ్ తర్వాత అందరూ కూర్చుని సమస్యను పరిష్కరించుకోవాలని.. కావాలంటే ఈ విషయంలో పెద్దరికం తీసుకోవడానికి సిద్ధమని చెప్పారు. ఈ మాటకు విష్ణు కూడా సరే అన్నాడు. తమ్మారెడ్డి సలహాలు తీసుకుంటానని.. ఆయన మాటలను ఫాలో అవుతానని చెప్పాడు. మరి తమ్మారెడ్డి అన్నట్లు ‘కన్నప్ప’ రిలీజయ్యాక మంచు కుటుంబం కలిసి కూర్చుని మాట్లాడుకుని వివాదాలకు తెరదించుతుందేమో చూద్దాం.
వైసీపీ సీనియర్ నాయకుడు, ఫైర్బ్రాండ్ కొడాలి నానిపై 2021లో నమోదైన కేసు విచారణకు తాజాగా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.…
హీరోయిన్ కంగనా రౌనత్ టైం ఏ మాత్రం బాలేదు. పట్టిందల్లా ప్లాస్టిక్ అన్న తరహాలో ఏ జానర్ సినిమా చేసినా…
ఏపీ సీఎం చంద్రబాబును విజయవాడలోని కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ కుటుంబ సభ్యులు కలిసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మీడియాతో…
విజువల్ ఎఫెక్ట్స్ మీద ఆధారపడి సినిమాలు తీయడం చాలా రిస్క్. కొన్నిసార్లు ఇవి తీసుకునే సమయం హీరోల కెరీర్ల మీద…
బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న NBK111 ప్రాజెక్టులో స్టార్ క్యాస్ట్ మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసేలా ఉంది.…
విజయవాడలో యువకుడి అదృశ్యం కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తిస్తోంది. రాజకీయ, కులం రంగు పులుముకున్న ఈ వ్యవహారం…