మల్లీశ్వరి సినిమాలో వెంకటేష్ డైలాగు ఒకటుంటుంది. బ్రహ్మానందంతో డిన్నర్ హాలుకు వెళ్తూ అక్కడికి చేరగానే ఏడు కొండలు ఎక్కినప్పుడు కూడా ఇంత సంతోషం కలగలేదని అంటాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానులు అచ్చం ఇదే మాట అనుకుంటున్నారు. ఎందుకంటే హరిహర వీరమల్లు పార్ట్ 1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్ విడుదల తేదీ వచ్చేసింది కాబట్టి. ముందుగా లీకైనట్టే జూన్ 12 ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నట్టు నిర్మాణ సంస్థ మెగా సూర్య ప్రొడక్షన్స్ ప్రకటించింది. కత్తి పట్టిన పవన్ కళ్యాణ్ కొత్త స్టిల్ వదిలి ఫ్యాన్స్ లో ఉన్న అనుమానాలన్నీ అఫీషియల్ గా తీర్చేసింది.
ఇవాళ్టిని మినహాయిస్తే హరిహర వీరమల్లు రాకకు కేవలం 27 రోజులు మాత్రమే ఉన్నాయి. ఈ నిడివిలోనే ట్రైలర్ లాంచ్, బాలన్స్ పాటల విడుదల, ప్రీ రిలీజ్ ఈవెంట్, మీడియా ఇంటర్వ్యూలు, ప్రమోషన్లు అన్నీ చేసుకోవాలి. ఏపీ డిప్యూటీ సిఎంగా పవన్ బిజీగా ఉన్న నేపథ్యంలో ప్రతిచోటా ఆయన్ని ఆశించలేం కానీ వీలైనంత వరకు పబ్లిసిటీలో భాగమవుతానని నిర్మాత ఏఎం రత్నంకు మాట ఇచ్చినట్టు సన్నిహిత వర్గాల సమాచారం. జూన్ 5 వచ్చే కమల్ హాసన్ తగ్ లైఫ్ మినహాయించి హరిహర వీరమల్లు చెప్పుకోదగ్గ పోటీ లేదు కాబట్టి ఓపెనింగ్స్ పరంగా భారీ నెంబర్లు వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
ఇక ఇప్పటి నుంచి అభిమానులు, సినిమా టీమ్ పరుగులు పెట్టాల్సిందే. పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ. మల్టీ లాంగ్వేజెస్ లో రిలీజవుతున్న తొలి సినిమా కూడా ఇదే. అందుకే ఫ్యాన్స్ గంపెడాశలు పెట్టుకున్నారు. విపరీతమైన జాప్యం వల్ల హైప్ కొంచెం హెచ్చుతగ్గులకు గురైనా జూన్ 12 నాటికి వాతావరణంలో మార్పు వచ్చేలా ఉంది. ముఖ్యంగా ట్రైలర్ గురించి టీమ్ ఓ రేంజ్ లో ఊరిస్తోంది. క్రిష్, జ్యోతికృష్ణ దర్శకత్వం వహించిన ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాకు ఎంఎం కీరవాణి అందించిన సంగీతం హైలైట్స్ లో ఒకటిగా చెబుతున్నారు. చూడాలి వీరమల్లు ఏం అద్భుతాలు చేస్తాడో
This post was last modified on May 16, 2025 1:41 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…