మహానటి ఫేమ్ కీర్తి సురేష్ హీరోయిన్ అంటే ఫాన్స్ ఖుష్ అయిపోవాలి. అంత టాలెంటెడ్ హీరోయిన్ లీడ్ రోల్ చేస్తే సినిమాకి ఖచ్చితంగా ప్లస్ అవుతుంది. అయితే ‘సర్కారు వారి పాట’లో కీర్తి సురేష్ నటించడం పట్ల మహేష్ ఫాన్స్ ఆనందంగా లేరు. ఆమెను మార్చేసి ఎవరినైనా పెడితే బాగుంటుందని సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. పెంగ్విన్ ఏదో మిస్ఫైర్ అనుకుని సర్దుకుపోయినా కానీ మిస్ ఇండియా సినిమాలో కీర్తి సురేష్ లుక్స్, తన పర్ఫార్మెన్స్ మాత్రం ఎవరికీ నచ్చడం లేదు.
గతంలో కాస్త బొద్దుగా వుండే ఫిజిక్ను మెయింటైన్ చేసిన కీర్తి సురేష్ అదే లుక్తో పలు తమిళ చిత్రాల్లో నటించి అక్కడి వారిని కూడా మెప్పించింది. మరేమయిందో సడన్గా జీరో సైజ్కి మారిపోయి తన ముఖంలోని కళ కోల్పోయింది. మిస్ ఇండియా సినిమా కోసం సన్నబడ్డానని చెప్పినా కానీ అందులో ఆమె అలా కనిపించాల్సిన అవసరమయితే లేదు మరి.
ఇదిలావుంటే ఆమె సినిమాలు గుడ్లక్ సఖి, రంగ్ దే కూడా ఓటిటి ద్వారా రిలీజ్ అవుతాయనే టాక్ వుంది. దీంతో ఆమెకి వున్న మహానటి ఇమేజ్ కరిగిపోయి మామూలు హీరోయిన్ అయిపోతుందని, కనీసం మహేష్ సినిమా కోసమయినా ఆమె కాస్త బరువు పెరిగి ‘నేను లోకల్’ లుక్ సంతరించుకుంటే బాగుంటుందని సూపర్స్టార్ అభిమానులు కోరుకుంటున్నారు. సాధారణంగా కష్టపడి బరువు తగ్గిన వాళ్లు అంత తేలిగ్గా బరువు పెరగడానికి ఇష్టపడరు. మరి ఈ ఫీడ్బ్యాక్ కీర్తి చెవిన వడుతోందో లేదో తెలీదు.
తెలుగులో ప్రస్తుతం నంబర్ వన్ హీరోయిన్ పొజిషన్కు గట్టి పోటీదారుగా మారిన అమ్మాయి.. భాగ్యశ్రీ బోర్సే. రెండు రోజుల ముందు…
ఒకప్పుడు సౌత్ ఇండియాలో నంబర్ వన్ ఫిలిం ఇండస్ట్రీగా ఉండేది కోలీవుడ్. తమిళ సినిమాల్లో కంటెంట్ అంత బలంగా ఉండేది.…
సమంత అసాధ్యం అనుకున్నది చేసి చూపించేసింది. ఈ రోజుతో మా ఇంటి బంగారం వంద కోట్ల గ్రాస్ క్లబ్బులో అడుగు…
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…