ఈ మధ్య అమీర్ ఖాన్ ఇంటర్వ్యూలలో మహాభారతం ప్రస్తావన ఎక్కువగా వస్తోంది. ఇది తన డ్రీం ప్రాజెక్ట్ అంటూ త్వరలోనే స్క్రిప్ట్ పనులు మొదలుపెడతానంటూ పదే పదే చెప్పుకోవడం మీడియాలో హైలైట్ అవుతోంది. ముందు కర్ణుడి పాత్రను ఆధారంగా చేసుకుని దాన్ని హైలైట్ చేస్తామని అన్నారు. తాజాగా కృష్ణుడి క్యారెక్టర్ తనకు ఎంతో ఇష్టమని, ఎంతో స్ఫూర్తినిస్తుందని మరో చోట చెప్పారు. ఇలా తరచు మాటలు మారుస్తున్న అమీర్ భాయ్ నిజంగా అంత గ్రాండ్ స్కేల్ మీద భారతాన్ని తెరకెక్కిస్తాడా అనేది వేయి డాలర్ల ప్రశ్న. కొంచెం లోతుగా ఆలోచిస్తే ఇతరత్రా కారణాలు కనిపిస్తున్నాయి.
జూన్ 20 విడుదల కాబోతున్న సితారే జమీన్ పర్ మీద అమీర్ ఖాన్ కు బోలెడు ఆశలున్నాయి. తన పూర్వ వైభవాన్ని తీసుకొచ్చే సినిమా అవుతుందని గంపెడు నమ్మకంతో ఉన్నాడు. ఆర్ఎస్ ప్రసన్న దర్శకత్వం వహించిన ఈ యూత్ ఎమోషనల్ ఎంటర్ టైనర్ కి మంచి బజ్ ఉంది కానీ మరీ భీభత్సంగా అయితే లేదు. లాల్ సింగ్ చద్దా కొట్టిన దెబ్బకు అమీర్ ఇమేజ్ ప్లస్ మార్కెట్ లెక్కల్లో కొన్ని మార్పులు వచ్చాయి. అందులోనూ సితారే జమీన్ పర్ మాస్ ఆడియన్స్ ని ఆకర్షించే కమర్షియల్ సబ్జెక్టు కాదు. సో ఓపెనింగ్స్ తో మొదలుపెట్టి టాక్ దాకా ఎన్నో అంశాలు బాక్సాఫీస్ రన్ ని ప్రభావితం చేయబోతున్నాయి.
ఇదంతా దృష్టిలో పెట్టుకునే మహాభారతం టాపిక్ తీసుకురావడం ద్వారా జనాల అటెన్షన్ తనమీదకు వచ్చేలా అమీర్ ఖాన్ చేసుకుంటున్నాడనేది ఒక బాలీవుడ్ వర్గం విశ్లేషణ. దీన్ని పూర్తిగా కొట్టిపారేయలేం. రన్బీర్ కపూర్ రామాయణం ఒకపక్క భారీగా తెరకెక్కుతూ హాట్ టాపిక్ గా మారిన తరుణంలో ఇప్పుడీ మహాభారతాన్ని తాను తీస్తానని అమీర్ ఖాన్ నొక్కి చెప్పడం పలు రకాల అనుమానాలకు తెరతీస్తోంది. అంత రాజమౌళి వల్లే ఎప్పటి నుంచో అనుకుంటున్న మహాభారతం సాధ్యపడలేదు. మరి చెప్పినంత తేలిగ్గా అమీర్ ఖాన్ తన కలల ప్యాన్ ఇండియా మూవీని తెరకెక్కిస్తాడా. ఏమో డౌటే.
This post was last modified on May 9, 2025 9:31 pm
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…