ఈ మధ్య అమీర్ ఖాన్ ఇంటర్వ్యూలలో మహాభారతం ప్రస్తావన ఎక్కువగా వస్తోంది. ఇది తన డ్రీం ప్రాజెక్ట్ అంటూ త్వరలోనే స్క్రిప్ట్ పనులు మొదలుపెడతానంటూ పదే పదే చెప్పుకోవడం మీడియాలో హైలైట్ అవుతోంది. ముందు కర్ణుడి పాత్రను ఆధారంగా చేసుకుని దాన్ని హైలైట్ చేస్తామని అన్నారు. తాజాగా కృష్ణుడి క్యారెక్టర్ తనకు ఎంతో ఇష్టమని, ఎంతో స్ఫూర్తినిస్తుందని మరో చోట చెప్పారు. ఇలా తరచు మాటలు మారుస్తున్న అమీర్ భాయ్ నిజంగా అంత గ్రాండ్ స్కేల్ మీద భారతాన్ని తెరకెక్కిస్తాడా అనేది వేయి డాలర్ల ప్రశ్న. కొంచెం లోతుగా ఆలోచిస్తే ఇతరత్రా కారణాలు కనిపిస్తున్నాయి.
జూన్ 20 విడుదల కాబోతున్న సితారే జమీన్ పర్ మీద అమీర్ ఖాన్ కు బోలెడు ఆశలున్నాయి. తన పూర్వ వైభవాన్ని తీసుకొచ్చే సినిమా అవుతుందని గంపెడు నమ్మకంతో ఉన్నాడు. ఆర్ఎస్ ప్రసన్న దర్శకత్వం వహించిన ఈ యూత్ ఎమోషనల్ ఎంటర్ టైనర్ కి మంచి బజ్ ఉంది కానీ మరీ భీభత్సంగా అయితే లేదు. లాల్ సింగ్ చద్దా కొట్టిన దెబ్బకు అమీర్ ఇమేజ్ ప్లస్ మార్కెట్ లెక్కల్లో కొన్ని మార్పులు వచ్చాయి. అందులోనూ సితారే జమీన్ పర్ మాస్ ఆడియన్స్ ని ఆకర్షించే కమర్షియల్ సబ్జెక్టు కాదు. సో ఓపెనింగ్స్ తో మొదలుపెట్టి టాక్ దాకా ఎన్నో అంశాలు బాక్సాఫీస్ రన్ ని ప్రభావితం చేయబోతున్నాయి.
ఇదంతా దృష్టిలో పెట్టుకునే మహాభారతం టాపిక్ తీసుకురావడం ద్వారా జనాల అటెన్షన్ తనమీదకు వచ్చేలా అమీర్ ఖాన్ చేసుకుంటున్నాడనేది ఒక బాలీవుడ్ వర్గం విశ్లేషణ. దీన్ని పూర్తిగా కొట్టిపారేయలేం. రన్బీర్ కపూర్ రామాయణం ఒకపక్క భారీగా తెరకెక్కుతూ హాట్ టాపిక్ గా మారిన తరుణంలో ఇప్పుడీ మహాభారతాన్ని తాను తీస్తానని అమీర్ ఖాన్ నొక్కి చెప్పడం పలు రకాల అనుమానాలకు తెరతీస్తోంది. అంత రాజమౌళి వల్లే ఎప్పటి నుంచో అనుకుంటున్న మహాభారతం సాధ్యపడలేదు. మరి చెప్పినంత తేలిగ్గా అమీర్ ఖాన్ తన కలల ప్యాన్ ఇండియా మూవీని తెరకెక్కిస్తాడా. ఏమో డౌటే.
This post was last modified on May 9, 2025 9:31 pm
ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…
దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…
ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…
వివేకా హత్య కేసు విచారణ ఏళ్ల తరబడి కొనసాగుతున్న వైనంపై వివేకా తనయురాలు సునీత అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి…
విదేశాంగ శాఖ అనుమతి నిరాకరించడంతో తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దయ్యింది. ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం…
సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…