అదేమీ పాతిక కోట్లు రెమ్యునరేషన్ తీసుకునే హీరో నటించిన సినిమా కాదు. పోనీ దర్శకుడికి ప్యాన్ ఇండియాలు తీసిన అనుభవం ఉందా అంటే అదీ లేదు. పట్టుమని పాతికేళ్ళు లేని కుర్రాడు. క్యాస్టింగ్ లో రకరకాల భాషలకు చెందిన ఆర్టిస్టులతో కలర్ ఫుల్ గా ఉందాని అడిగితే సమాధానం నో. మొత్తం అరవ నటీనటులే. అయినా సరే టూరిస్ట్ ఫ్యామిలీ ఈ పరిమితులన్నీ దాటుకుని వసూళ్ల రచ్చ చేస్తోంది. మొన్న శుక్రవారం సూర్య రెట్రో, నాని హిట్ 3 ది థర్డ్ కేస్ తో పాటు విడుదలైన ఈ చోటా ఎంటర్ టైనర్ కేవలం తమిళంలో మాత్రమే రిలీజైనప్పటికీ కలెక్షన్ల పరంగా వీక్ డేస్ లో మిగిలిన వాటిని డామినేట్ చేస్తోంది.
సోమవారం బుక్ మై షో ట్రెండ్స్ గమనిస్తే టూరిస్ట్ ఫ్యామిలీకి నిన్న 66 వేల టికెట్లు అమ్ముడుపోగా, హిట్ త్రీకి 59 వేలు, రెట్రోకి 35 వేల టికెట్లు సేలయ్యాయి. కేవలం ఒక భాషలోనే రిలీజ్ చేసిన చిన్న చిత్రం ఇంత రచ్చ చేస్తే మల్టీ లాంగ్వేజెస్ లో వచ్చిన మిగిలిన రెండూ దానికన్నా కింది స్థాయిలో ఉండటం గమనార్హం. ఇటీవలి కాలంలో నిర్మాతలు తమ సినిమాలు బాగా ఆడకపోతే ఆ నెపాన్ని సీజన్, రివ్యూలు, క్రికెట్, ఎండల మీదకు తోసేస్తున్నారు తప్ప తమ లోటుపాట్లని విశ్లేషించుకోవడానికి ఇష్టపడటం లేదు. కానీ ప్రేక్షకులు ఏం కోరుకుంటున్నారో చాలా స్పష్టంగా టూరిస్ట్ ఫ్యామిలీ, హిట్ 3 నిరూపిస్తున్నాయి.
ఇప్పుడీ స్మాల్ సెన్సేషన్ ని కొనేందుకు టాలీవుడ్ నుంచి పోటీ ఏర్పడిందని సమాచారం. కొందరు డబ్బింగ్ హక్కుల కోసం సంప్రదిస్తుండగా మరికొందరు రీమేక్ రైట్స్ అడుగుతున్నారట. ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని వినికిడి. ఒకవేళ అలా చేసే పనైతే అనువాదం చేయడమే ఉత్తమం. ఎందుకంటే ఒరిజినల్ వెర్షన్ లో ఉన్న సోల్ ని తెలుగులో మళ్ళీ పునఃసృష్టించడం కష్టం. పైగా శ్రీలంక వలసవాదుల ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ కాబట్టి అంత ఈజీగా కనెక్ట్ కాదు. కామెడీ, ఎమోషన్స్ సరైన రీతిలో బ్యాలన్స్ చేయగలిగితే ఎంత గొప్ప ఆదరణ దక్కుతుందో టూరిస్ట్ ఫ్యామిలీ గొప్ప ఉదాహరణగా నిలుస్తోంది. అందుకే కంటెంటే కింగు.
This post was last modified on May 6, 2025 11:51 am
నిన్న విడుదలైన ది రాజా సాబ్ అభిమానుల అంచనాలకు తగ్గట్టే సెంచరీతో ఓపెనింగ్స్ మొదలుపెట్టింది. నిర్మాత విశ్వప్రసాద్ సక్సెస్ మీట్…
సెన్సార్ ఇష్యూతో పాటు థియేటర్ల కొరత కారణంగా తమిళ మూవీ పరాశక్తి మన దగ్గర విడుదల కాలేదు. ఒక వారం…
రేపు రాత్రి ప్రీమియర్లతో విడుదల కాబోతున్న మన శంకరవరప్రసాద్ గారు మీద ఆల్రెడీ ఉన్న బజ్ మరింత పెరిగే దిశగా…
పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…
తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…
ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…