సిరివెన్నెల సీతారామశాస్త్రి అంటే త్రివిక్రమ్కు ఎంత అభిమానమో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఒక సినీ వేడుకలో ఆయన సిరివెన్నెల గురించి ఇచ్చిన స్పీచ్ ఎన్నో ఏళ్ల నుంచి యూట్యూబ్లో కోట్ల కొద్దీ వ్యూస్ తెచ్చుకుంటోంది. సిరివెన్నెల గురించి అంతకంటే గొప్పగా ఇంకెవరూ మాట్లాడలేరు అనిపిస్తుంది ఆ స్పీచ్ చూస్తే. అందులోని మాటలు కల్ట్ స్టేటస్ తెచ్చుకున్నాయి. ఇప్పటికీ మీమ్స్లో, సినిమా డైలాగుల్లో త్రివిక్రమ్ మాటల్ని విరివిగా వాడుతుంటారు. కాగా సిరివెన్నెల మరణానంతరం ఓ టీవీ ఛానెల్ నిర్వహిస్తున్న ‘నా ఉచ్ఛ్వాసం కవనం’ కార్యక్రమానికి తాజాగా అతిథిగా వచ్చిన త్రివిక్రమ్.. మరోసారి తన అభిమాన గేయ రచయిత గురించి గొప్పగా మాట్లాడారు.
సిరివెన్నెల రాసిన అనేక పాటల గురించి విశ్లేషించే ప్రయత్నం చేసిన త్రివిక్రమ్.. ఆయన సాహిత్యానికి చాలామంది దర్శకులు న్యాయం చేయలేకపోయారని.. అందులో తాను కూడా ఒకడినని చెప్పారు. ‘జల్సా’లో బాగా పాపులర్ అయిన ‘ఛలోరే..’ పాట కోసం సిరివెన్నెల 30 వెర్షన్లు రాసినట్లు ఆయన గుర్తు చేసుకున్నారు.
‘‘నువ్వే కావాలి సినిమాలో అనగనగా ఆకాశం.. పాట రాసేటపుడు శాస్త్రి గారితో నా అనుబంధం బలపడింది. ఆయన రాసిన పాటలకు చాలామంది దర్శకులు న్యాయం చేయలేకపోయారు. నేను అయితే కచ్చితంగా న్యాయం చేయలేదనిపిస్తుంది. ఆయన పదాలకు సరిపడేలా చిత్రీకరించడం కుదరదు. అంత గొప్పగా ఉంటాయి. ఆయనకు సన్నివేశాన్ని వినిపించడానికి నాకు సిగ్గేసేది. ఆయన బాధ పడుతూ వినేవారు. కష్టంగా రాసేవారు. కానీ అందరూ ఆయన కంటే తెలివైన వారే అనుకుంటారు. ప్రేక్షకులకు అన్నీ తెలుసని వాళ్లను ఒప్పించాలి అనే భావనలో ఉండేవారు. ‘జల్సా’లో ‘ఛలోరే..’ పాటకు 30 వెర్షన్లు రాసి ఇచ్చారు. అందులో రెండు వెర్షన్లే తీసుకున్నాం. ఈ జనరేషన్ కూడా ఆయన పాటలు వింటున్నారంటే వాటికి ముగింపు ఉండదు’’ అని త్రివిక్రమ్ అన్నారు.
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…