గత ఏడాది స్వాగ్ తో పలకరించిన శ్రీవిష్ణు తనను ప్రత్యేకంగా అభిమానించే ఫ్యాన్స్ ని మెప్పించాడు కానీ రెగ్యులర్ ఆడియన్స్ కి కనెక్ట్ కాలేకపోయాడు. తన బలమైన కామెడీ టైమింగ్ ని సామజవరగమన తరహాలో మళ్ళీ చూపించాలని ప్రేక్షకులు కోరుకుంటున్న టైంలో సింగిల్ గా రాబోతున్నాడు. మే 9 విడుదల కాబోతున్న ఈ ఎంటర్ టైనర్ గీత ఆర్ట్స్ అల్లు అరవింద్ సమర్పణలో రూపొందడం విశేషం. కార్తీక్ రాజ్ దర్శకత్వం వహించగా విశాల్ చంద్రశేఖర్ సంగీతం సమకూర్చారు. రిలీజ్ ఇంకో పదకొండు రోజులే ఉన్న నేపథ్యంలో ప్రమోషన్ల స్పీడ్ పెంచారు. ఇవాళ ట్రైలర్ లాంచ్ ద్వారా కాన్సెప్ట్ ఏంటో చెప్పేశారు.
అనగనగా ఒక అబ్బాయి (శ్రీవిష్ణు). సింగిల్ గా ఉంటూ జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అమ్మాయిలను పడేసే విషయంలో తనకంటూ స్వంత ఫిలాసఫీ ఉంటుంది. ఓ మంచి ముహూర్తంలో పూర్వ (కేతిక శర్మ) ని ప్రేమిస్తాడు. కానీ ఆ అమ్మాయికి ఇతనంటే ఇష్టం ఉండదు. ఇంకోవైపు హరిణి (ఇవానా) ఈ సింగిల్ మీద మనసు పారేసుకుకుంటుంది. తనొకరిని లవ్ చేస్తే వేరొకరు తనను లైక్ చేయడం సింగిల్ కి అంతు చిక్కదు. తర్వాత ఏమయ్యిందో తెరమీద చూడమంటున్నారు. లైన్ గా చూస్తే ఇది పాత కథలా అనిపించినా బోలెడు ఫన్, కామెడీ, లవ్, రొమాన్స్, ఎమోషన్స్ తో కార్తీక్ రాజ్ ఫ్రెష్ గా చెప్పే ప్రయత్నం కనిపించింది.
ముఖ్యంగా సోషల్ మీడియా ట్రెండ్ ని ఫాలో అవుతూ అల్ఫా మేల్ అంటూ యానిమల్ రిఫరెన్స్, శివయ్యా అంటూ కన్నప్పలో మంచి విష్ణు ఇమిటేషన్ అన్నీ నవ్వు తెప్పించేలా ఉన్నాయి. తుమ్మితే ఎంత రిచ్ అయినా హాచ్ అంటాడని వెన్నెల కిషోర్ తో చెప్పించిన డైలాగులు బాగా పేలాయి. యూత్ కామెడీతో శ్రీవిష్ణు తన మార్కు మళ్ళీ చూపించాడు. ఇంతే మోతాదులో పూర్తి సినిమా ఉంటే మాత్రం థియేటర్లకు కుర్రాళ్ళు క్యూ కట్టడం ఖాయం. మే 9 రిలీజవుతున్న సింగిల్ మీద మంచి అంచనాలు నెలకొనేలా ట్రైలర్ దోహదం చేసింది. మిగిలిన బాధ్యతని ఇంతే స్థాయిలో అసలు సినిమా నెరవేరిస్తే హిట్టు పడ్డట్టే.
This post was last modified on April 28, 2025 4:59 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…