రెండేళ్లుగా సిల్వర్ స్క్రీన్ కు దూరమైపోయిన సమంతా ఎట్టకేలకు వెండితెర మీద కనిపించబోతోంది. అది కూడా డ్యూయల్ రోల్ లో. అంటే నటిగా కాదు లెండి. నిర్మాతగా ప్లస్ క్యామియో చేసిన యాక్టర్ గా. ఆమె ప్రొడక్షన్ లో నిర్మాణమైన మొదటి సినిమా శుభం మే 9 విడుదల కానుంది. హరిహర వీరమల్లు తప్పుకోవడంతో ఆ స్లాట్ పట్టేసిన సామ్ తన అభిరుచిని కంటెంట్ లోనూ చూపిస్తోంది. ఇవాళ ట్రైలర్ లాంఛ్ చేశారు. నోటెడ్ క్యాస్టింగ్ లేకుండా దాదాపు అందరూ కొత్తగా వాళ్ళతో తెరకెక్కిన ఈ కామెడీ ఎంటర్ టైనర్ లో వెరైటీ పాయింట్ తీసుకున్నారు. ప్రవీణ కండ్రేగుల దర్శకత్వం వహించిన ఈ చిత్రం కథేంటో చెప్పేశారు.
ముగ్గురు కుర్రాళ్లు కొత్తగా పెళ్లి చేసుకుంటారు. ఆ భార్యలకేమో టీవీ సీరియళ్ళు అంటే మహా పిచ్చి. రాత్రి తొమ్మిది కావడం ఆలస్యం పిడుగులు పడుతున్నా సరే చూడటం మిస్ చేసుకోరు. ఆఖరికి శోభనం రోజు కూడా. అయితే ఇది కేవలం అక్కడితో ఆగిపోదు. ఆ సీరియల్ మహత్యమో ఇంకేదైనా బ్రహ్మ రహస్యమో ఏమో కానీ ఈ ఆడాళ్ళకు దెయ్యం పూనుతుంది. మొగుళ్లను కొట్టడం మొదలెడతారు. ఇది తమ సమస్య అనుకుంటే ఊళ్ళో చాలా మందికి ఉందని తెలుస్తుంది. అప్పుడు ఎంట్రీ ఇస్తుంది ఒక లేడీ బాబా (సమంత). ఇంతకీ ఈ భూతాల గోలేంటి, ఆ సీరియల్ చూడటం వల్ల వాళ్లు ఎందుకిలా అయ్యారనేది తెరమీద చూడాలి.
చూస్తుంటే సమంతది ప్రాధాన్యం కలిగిన గెస్టు రోల్ గా కనిపిస్తోంది. సస్పెన్స్ లో పెట్టకుండా ఆమె క్యారెక్టర్ ని రివీల్ చేయడం ద్వారా ఫ్యాన్స్ కు ముందే హింట్ ఇచ్చారు. షోర్ పోలీస్ సంగీతం సమకూరుస్తున్న శుభంకు మొత్తం యూత్ టాలెంట్ పని చేశారు. నటీనటులు, టెక్నీషియన్లు అంతా వాళ్లే. హిట్ 3 విడుదల కాగానే దీనికి సంబంధించిన ప్రమోషన్లు స్పీడప్ చేసేందుకు సమంత పక్కా ప్లానింగ్ తో ఉందట. అదే రోజు శ్రీవిష్ణు సింగల్ తో పాటు జగదేకవీరుడు అతిలోకసుందరి 3డి రీ రిలీజ్ ఉన్నాయి. టైటిల్ దగ్గరి నుంచి కాన్సెప్ట్ దాకా విభిన్నంగా అనిపిస్తున్న శుభం ఆడియన్స్ ని మెప్పిస్తే ప్రొడ్యూసర్ గా సామ్ కి హిట్టు పడ్డట్టే
This post was last modified on April 27, 2025 10:46 am
దేవర బ్లాక్ బస్టర్ తర్వాత వార్ 2 విపరీతంగా నిరాశ పరచడంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల ఆశలన్నీ ప్యాన్ ఇండియా…
తమిళనాడు ముఖ్యమంత్రి, టీవీకే అధిపతి విజయ్ రాజకీయ విమర్శలకు కేంద్రంగా మారారు. ఆయనను కార్నర్ చేస్తూ.. బీజేపీసహా ఇతర పార్టీలు…
ఇంకో రెండు రోజుల్లో దృశ్యం 3 విడుదల కానుంది. ఒరిజినల్ వెర్షన్ తో పాటు తెలుగు డబ్బింగ్ రిలీజ్ కానుండటంతో…
వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి జోగి రమేష్ తన దూకుడును ఏమాత్రం తగ్గించడం లేదు. వాస్తవానికి ఆయన అగ్రిగోల్డ్ కేసులోను…
ఏపీ సీఎం చంద్రబాబు మత్స్యకారుల మనసు దోచుకున్నారు. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో పర్యటించిన ఆయన మత్సకార సేవలో కార్యక్రమంలో…
దేశ రాజకీయాల్లో జాతీయ పార్టీలదే ఆధిపత్యం కనిపిస్తున్నా.. రాష్ట్రాల రాజకీయాలను ప్రభావితం చేసేది మాత్రం ఇప్పటికీ ప్రాంతీయ పార్టీలేనని తాజా…