థియేటర్లో వచ్చినప్పుడు ఎల్2 ఎంపురాన్ కు జరిగిన హడావుడి అంతా ఇంతా కాదు. వివాదాలు చుట్టుముట్టాయి. కేంద్ర అధికార పార్టీని ఇబ్బంది పెట్టేలా కొన్ని పాత్రలు, సన్నివేశాలు ఉన్నాయనే కాంట్రావర్సి రేగింది. ఒక మతాన్ని టార్గెట్ చేసుకున్నారని సామజిక కార్యకర్తలు భగ్గుమన్నారు. నిరసనలకు భయపడి మోహన్ లాల్ ఏకంగా క్షమాపణ చెప్పి, అబ్జెక్షన్ వచ్చిన వాటికి కత్తిరింపులు వేసి, క్యారెక్టర్ల పేరు మార్చారు. మూడు వందల కోట్లకు పైగా వసూలు చేసి మల్లువుడ్ టాప్ గ్రాసర్ గా నిలిచిందని ఇటీవలే ప్రకటన ఇచ్చారు. నెల రోజుల తర్వాత ఇటీవలే ఎల్2 ఎంపురాన్ ఓటిటి స్ట్రీమింగ్ కి తీసుకొచ్చారు.
ఇంత రచ్చ జరిగినప్పుడు సహజంగానే డిజిటల్ లో చూసే జనాలు అధికంగా ఉంటారు. కానీ ఎల్2 ఎంపురాన్ కు అలాంటి స్పందన కనిపించడం లేదు. దీనికా ఇంత బిల్డప్ ఇచ్చారనే కామెంట్స్ ఎక్కువగా వినిపించాయి. ఈ సినిమా మలయాళంలో మాత్రమే బాగా ఆడింది. తెలుగుతో సహా ఇతర డబ్బింగ్ వెర్షన్లు డిజాస్టరయ్యాయి. ఇక్కడ పంపిణి చేసిన దిల్ రాజుకి ఏం మిగల్లేదు. కానీ ఎల్2 టీమ్ మాత్రం ప్రతి చోటా గొప్ప విజయం సాధించిందనే తరహాలో ప్రచారం చేసుకున్నారు. సాధారణంగా కేరళలో ఉన్న లేట్ ఓటిటికి ట్రెండ్ కి భిన్నంగా ఎల్2 ఇంత త్వరగా డిజిటల్ లోకి రావడం ఆశ్చర్యం కలిగించింది.
ఇదంతా ఎలా ఉన్నా దర్శకుడు పృథ్విరాజ్ సుకుమారన్ మాత్రం ఎల్3 ది బిగినింగ్ తీస్తానని చెబుతున్నాడు. మోహన్ లాల్ కొడుకు ప్రణవ్ లాల్ ని హీరోగా పెట్టి లూసిఫర్ ఫ్లాష్ బ్యాక్ ని అందులో చూపించబోతున్నారు. ఎప్పుడు స్టార్ట్ అయ్యేది చెప్పలేదు కానీ వచ్చే ఏడాది ఉండొచ్చు. అయినా ప్రొడ్యూసర్లు ఎంత హంగామా చేసినా నిజమైన కంటెంట్ బాగుంటేనే థియేటర్, ఓటిటిలో ఆదరణకు నోచుకుంటుంది. అంతే తప్ప ఫలానా వివాదం వచ్చిందనో లేదా సెన్సార్ కత్తిరింపులు ఉంటాయనో ఎగబడి చూడరు. ఇంతా చేసి ఎల్2 ఎంపురాన్ ఓటిటి హక్కులు కింగ్ అఫ్ కోత కన్నా తక్కువకు అమ్ముడుపోవడం ఫైనల్ ట్విస్ట్.
This post was last modified on April 25, 2025 4:37 pm
బాక్సాఫీస్ యమా నీరసంగా ఉంది. సరైన కొత్త సినిమాలు లేక చాలా థియేటర్లలో సగం షోలు కూడా పడటం లేదు.…
ప్రస్తుతం వైసీపీకి ఉన్న 11 నియోజకవర్గాల్లో వచ్చే ఎన్నికల నాటికి 4 నియోజకవర్గాలు చేజారి పోవడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు.…
బాలకృష్ణ - కొరటాల శివ కాంబినేషన్ సినిమా ఫిక్సయిపోయింది. వచ్చే వారమే పూజా కార్యక్రమాలతో ఓపెనింగ్ జరగనుందని సమాచారం. అయితే…
వైసీపీ అధినేత జగన్ శుక్రవారం నుంచి యూరప్ పర్యటనకు వెళ్తున్నారు. దాదాపు 20 రోజులకు పైగానే ఆయన రాష్ట్రానికి దూరంగా…
తెలంగాణలో రెండు రోజుల క్రితం మొదలైన ఆర్టీసీ కార్మికుల సమ్మె అప్పుడే రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న ప్రధాన…
బాలకృష్ణ కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు అత్యంత భారీ బడ్జెట్ తో తీసిన సినిమా నిప్పురవ్వ. దానికైన ఖర్చు గురించి…