ప్రభాస్ సినిమా అంటే చాలు.. వందల కోట్ల బడ్జెట్, అంతకుమించిన బిజినెస్ మామూలైపోయింది. ప్రభాస్ ఈ మధ్య చేసిన వాటిలో కొంచెం చిన్న స్థాయి సినిమా అనుకున్న ‘రాజా సాబ్’కు సైతం బడ్జెట్ రూ.400 కోట్లు దాటిపోవడం విశేషం. ప్రభాస్తో మిడ్ రేంజ్ సినిమా తీద్దామని మొదలుపెట్టినా.. అది పెద్ద బడ్జెట్ మూవీనే అవుతోంది. రెబల్ స్టార్ హీరోగా ‘సీతారామం’ దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో గత ఏడాది ఒక చిత్రం మొదలైన సంగతి తెలిసిందే. దీనికి ‘ఫౌజీ’ అనే వర్కింగ్ టైటిల్ అనుకున్నారు.
ఇందులో ఇమాన్వి అనే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ను కథానాయికగా ఎంచుకుని పెద్ద షాకిచ్చాడు హను. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి బడ్జెట్ కొంచెం తక్కువగానే ఉంటుందిలే అనుకున్నారంతా. కానీ ఈ చిత్రం మీద మైత్రీ వాళ్లు ఏకంగా రూ.600 కోట్లు ఖర్చు చేస్తున్నారట. పేరుకు ఇది లవ్ స్టోరీనే అయినప్పటికీ.. వార్ బ్యాక్ డ్రాప్ ఉంటుందని.. దేశ విదేశాల్లో భారీ లొకేషన్లలో చిత్రీకరణ జరుగుతోందని.. ప్రొడక్షణ్ కాస్ట్ బాగానే అవుతోందని సమాచారం.
ఇక ప్రభాస్కు భారీగా పారితోషకం ఇవ్వాల్సి ఉంటుంది. మిగతా రెమ్యూనరేషన్లు ఉండనే ఉన్నాయి. అన్నీ కలిపితే బడ్జెట్ రూ.600 కోట్లు దాటిపోతున్నట్లు సమాచారం. మైత్రీ వాళ్లు బడ్జెట్ విషయంలో అస్సలు రాజీ పడరనే పేరుంది. ‘పుష్ప’ రెండు భాగాల మీద భారీగా ఖర్చు పెట్టారు. అందుకు తగ్గ ఫలితాన్నందుకున్నారు. ఇప్పుడు ‘ఫౌజీ’ మీద తమ సంస్థ చరిత్రలోనే అత్యధిక బడ్జెట్ పెడుతున్నారు. ప్రభాస్కు ఉన్న తిరుగులేని మార్కెట్ దృష్ట్యా ఈ బడ్జెట్ను వర్కవుట్ చేయడం కష్టమేమీ కాదని మైత్రీ అధినేతలు భావిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది ద్వితీయార్దంలో విడుదలయ్యే అవకాశముంది.
This post was last modified on April 22, 2025 5:58 pm
ఇప్పుడు ఇండస్ట్రీలో వెలుగొందుతున్న చాలామంది దర్శకులు కెరీర్ ఆరంభంలో బాగా ఇబ్బంది పడ్డ వాళ్లే. సినీ పరిశ్రమలోకి వచ్చి అసిస్టెంట్…
తమిళంలో పెద్ద స్టార్గా ఎదిగిన శివ కార్తికేయన్ లాగే టీవీ రంగం నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన అమ్మాయి ప్రియ భవానీ…
తెలుగులో తెర మీద హీరోలకు ఎలివేషన్లు ఇవ్వడంలో చాలామంది దర్శకులు తమ నైపుణ్యాన్ని చూపిస్తుంటారు కానీ.. వేదికల మీద ఎలివేషన్లు…
ఒకప్పుడు తమిళ ప్రేక్షకుల అభిరుచి గురించి ఇతర భాషల వాళ్లు గొప్పగా చెప్పుకునేవాళ్లు. కొత్త తరహా సినిమాలను, ప్రయోగాత్మక చిత్రాలను…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ముహూర్తం రెడీ అవుతోంది. ప్రభుత్వం వైపు నుంచి ఈ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది.…
వైసీపీ ఓటు బ్యాంకు స్థిరమేనా? ఆ పార్టీ చెబుతున్నట్టు 40 శాతం ఓటు బ్యాంకు వచ్చే ఎన్నికల వరకు అలానే…