ఏడాది పొడవునా ఎన్ని సీజన్లు ఉన్నా సంక్రాంతికి తలపడే సినిమాల యుద్ధం వేరే లెవెల్ లో ఉంటుంది. ముఖ్యంగా స్టార్ హీరోల కమర్షియల్ క్లాష్ సృష్టించే వసూళ్ల సునామి బయ్యర్ల గల్లాపెట్టెలు నింపేలా చేస్తుంది. అందుకే సంవత్సరం ముందే డేట్లు లాక్ చేసుకునే సంప్రదాయం గత కొన్నేళ్లుగా బాగా పెరిగింది. 2026 కూడా దానికి వేదిక కానుంది. ఇప్పటిదాకా కన్ఫర్మ్ అయిన వాటిలో చిరంజీవి – అనిల్ రావిపూడి మొదటిది కాగా విజయ్ ‘జన నాయగన్’ అఫీషియల్ గా ఆ మధ్యే ప్రకటించేసుకుంది. జూనియర్ ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ డ్రాగన్ రావడం కొంచెం అనుమానంగానే ఉంది కాబట్టి నిర్ధారణగా చెప్పలేని పరిస్థితి.
తాజాగా ‘అఖండ 2 తాండవం’ కూడా సంక్రాంతికి రావాలనే ఆలోచన చేస్తున్నట్టు లేటెస్ట్ అప్డేట్. ఈ ఏడాది దసరాకు రిలీజ్ చేయాలని సెప్టెంబర్ 25 రిలీజ్ డేట్ గతంలోనే అనౌన్స్ చేసినప్పటికీ ఇంకా షూటింగ్ చాలా పెండింగ్ ఉండటంతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కి ఎక్కువ సమయం అవసరం కావడంతో హడావిడిగా పరుగులు పెట్టడం వద్దని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. అయితే టీమ్ చెప్పేదాకా నిర్ధారణ చేయలేం కానీ దాదాపు పక్కానే. ఇదే నిజమైతే బాలకృష్ణ అభిమానులకు పండగే. తమ హీరోకు బాగా ఇష్టమైన కలిసొచ్చిన పండగకు అఖండ 2 తాండవం వస్తే అంతకన్నా కావాల్సింది ఏముంటుంది.
ఇక కొంచెం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే 2023లో ఇదే తరహా క్లాష్ జరగడం గుర్తు చేసుకోవాలి. వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి నువ్వా నేనాని తలపడ్డాయి. రెండూ బ్లాక్ బస్టర్స్ అయ్యాయి కానీ వసూళ్ల పరంగా చిరంజీవిది పై చేయి అయ్యింది. వీటిని నిర్మించిన మైత్రికి లాభాల పంట పండింది. అదే సమయంలో విజయ్ వారసుడు కూడా వచ్చింది. తమిళ వెర్షన్ కన్నా రెండు రోజులు ఆలస్యంగా రిలీజైన ఈ సినిమా ఇక్కడేం అద్భుతాలు చేయలేదు కానీ ఉన్నంతలో డీసెంట్ గా రాబట్టింది. కోలీవుడ్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మళ్ళీ మూడేళ్ళ తర్వాత చిరంజీవి, బాలయ్య, విజయ్ ఈ ముగ్గురూ సంక్రాంతి బరిలో నిలవడం విశేషమే.
This post was last modified on April 19, 2025 5:33 pm
నిన్న విడుదలైన ది రాజా సాబ్ అభిమానుల అంచనాలకు తగ్గట్టే సెంచరీతో ఓపెనింగ్స్ మొదలుపెట్టింది. నిర్మాత విశ్వప్రసాద్ సక్సెస్ మీట్…
సెన్సార్ ఇష్యూతో పాటు థియేటర్ల కొరత కారణంగా తమిళ మూవీ పరాశక్తి మన దగ్గర విడుదల కాలేదు. ఒక వారం…
రేపు రాత్రి ప్రీమియర్లతో విడుదల కాబోతున్న మన శంకరవరప్రసాద్ గారు మీద ఆల్రెడీ ఉన్న బజ్ మరింత పెరిగే దిశగా…
పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…
తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…
ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…