సూపర్ స్టార్ రజనీకాంత్ కెరీర్ లో అతి పెద్ద బ్లాక్ బస్టర్స్ గా చెప్పుకునే సినిమాల్లో బాషా స్థానం చాలా ప్రత్యేకం. తెలుగులో ఆయన మార్కెట్ ని అమాంతం పెంచింది కూడా ఈ మాస్ క్లాసిక్కే. 1995లో వచ్చిన బాషా సాధించిన సంచలన విజయం వెనుక కొన్ని తెలియని రాజకీయ విశేషాలున్నాయి. ముప్పై సంవత్సరాల తర్వాత తలైవర్ స్వయంగా వాటి గురించి నోరు విప్పారు. అవేంటో చూద్దాం. బాషా వంద రోజుల వేడుక చెన్నైలో జరిగింది. ఈ సందర్భంగా రజనీకాంత్ తన ప్రసంగంలో భాగంగా రాష్ట్రంలో బాంబుల సంస్కృతి బాగా పెరిగిపోయిందని అన్నారు. ఆ సమయంలో అధికారంలో ఉన్నది జయలలిత పార్టీ.
బాషా నిర్మాత ఆర్ ఎం వీరప్పన్ అప్పటి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. రజని అంత పెద్ద మాట అనడం జయలలితకు కోపం తెప్పించింది. స్టేజి మీద ఉండి దాన్ని ఖండించకపోవడానికి నిరసనగా వీరప్పన్ మినిస్టర్ పదవిని పీకేశారు. దీంతో బాధపడిన రజనీకాంత్ వెంటనే ఆయనకు ఫోన్ చేసి సిఎంతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తానని అన్నారు. దానికి వీరప్పన్ బదులిస్తూ నా కోసం మీ గౌరవం పోగొట్టుకోవద్దని, పదవుల మీద నాకు మోజు లేదని అక్కడితో ముగించేశారు. ఈ కారణంగానే రజినీకాంత్ కు జయలలిత రాజకీయ విధానాల పట్ల వ్యతిరేకత వచ్చింది. ఇదంతా వీరప్పన్ డాక్యుమెంటరీలో చెప్పుకొచ్చారు.
చూసారుగా రాజకీయాలు, సినిమాలు ఎంత దగ్గరగా ముడిపడి ఉంటాయో. ఒక హీరో యథాలాపంగా అన్న మాట ఒక మంత్రి రాజకీయ జీవితాన్ని మార్చేసింది. ఏకంగా ముఖ్యమంత్రితో కయ్యం తెచ్చుకునేలా సూపర్ స్టార్ ని ప్రేరేపించింది. ఇదంతా జరిగిన తర్వాత వీరప్పన్ పాలిటిక్స్ కి స్వస్తి చెప్పి వ్యాపారాలు, సినిమాల్లో బిజీ కావడం వేరే పరిణామం. అప్పటి నుంచి రజనీకాంత్ తో ఆయన బంధం మరింత బలపడింది. ఆర్ ఎం వీరప్పన్ 97 వయసులో గత ఏడాదే అనారోగ్యం కారణంగా కన్నుమూశారు. దానికి నివాళిగానే ఆర్విఎం ది కింగ్ మేకర్ పేరుతో డాక్యుమెంటరీ రూపొందించారు. అందులోనే రజని ఈ విశేషాలు పంచుకున్నారు.
This post was last modified on April 10, 2025 10:12 am
త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు కీలక కసరత్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…
ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…
తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…
చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్లో మంచి క్రేజ్తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…