రేపు, ఎల్లుండి బాక్సాఫీస్ కు నాలుగు కొత్త రిలీజులు ఉన్నాయి. మాములుగా అయితే సందడి ఓ రేంజ్ లో ఉండాలి. కానీ ప్రస్తుతానికి అలాంటి సూచనలు లేవు. ముఖ్యంగా టిల్లు తర్వాత సిద్ధూ జొన్నలగడ్డ చేసిన సినిమాగా ‘జాక్’ మీద భారీ స్థాయిలో బజ్ లేకపోవడం అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది. ఇంకో ఇరవై నాలుగు గంటల లోపే షోలు పడబోతున్నా ఇప్పటిదాకా బుక్ మై షో ట్రెండింగ్ లోకి రాకపోవడం విచిత్రం. గత ఏడాది టిల్లు స్క్వేర్ కి పూర్తి భిన్నమైన పరిస్థితి ఇది. అడ్వాన్స్ బుకింగ్స్ ఆశించిన స్థాయిలో లేకపోయినా పాజిటివ్ టాక్ తో ఊపందుకుంటుందనే నమ్మకం జాక్ బృందంలో కనిపిస్తోంది.
ఇక ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’కి తమిళంలో టికెట్ అమ్మకాలు అదిరిపోతున్నాయి కానీ తెలుగులో రెస్పాన్స్ సోసోగానే ఉంది. గత కొన్నేళ్లుగా అజిత్ మార్కెట్ ఇక్కడ పడిపోతూ వస్తోంది. వలిమై, తెగింపు, పట్టుదల ఇవేవి కనీస స్థాయిలో ఆడలేదు. అందుకే గుడ్ బ్యాడ్ అగ్లీ మీద మన ప్రేక్షకుల్లో ఎగ్జైట్ మెంట్ లేదు. మైత్రి నిర్మాణం కావడంతో మంచి థియేటర్లలో వేస్తున్నా ఇదీ టాక్ మీద ఆధారపడాల్సిందే. గంటకు అయిదు వేల టికెట్లకు పైగా సేలవుతున్నాయి. కాకపోతే అవన్నీ తమిళనాడుకు సంబంధించినవే. ఇక సన్నీ డియోల్ ‘జాట్’ని కేవలం హిందీ వెర్షన్ కే పరిమితం చేయడం ఆడియన్స్ ని కొంత దూరం చేస్తోంది.
గోపీచంద్ మలినేని, జగపతిబాబు, రమ్యకృష్ణ, రెజీనా, తమన్ లాంటి తెలుగు టీమే జాట్ కు పని చేసినా సమయాభావం వల్లనో లేక ఇంకేదైనా కారణం వల్లనో అనువాదం జరగలేదు. ఒకవేళ హిట్ టాక్ వస్తే ఛావా లాగా ఆలస్యంగా చేస్తారేమో తెలియదు కానీ ఇలాంటి కమర్షియల్ సినిమాలకు ఎక్కువ లేట్ చేయడం అంత సేఫ్ కాదు. ఇవి కాకుండా ఎల్లుండి యాంకర్ ప్రదీప్ హీరోగా నటించిన ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ సైతం బజ్ కోసం పోరాడుతోంది. కామెడీ పండిందనే టాక్ వినిపిస్తోంది కానీ ఎక్స్ ట్రాడినరి టాక్ వస్తేనే ప్రదీప్ థియేటర్ జనాన్ని ఫుల్ చేయగలడు. మరి ఎవరు నెగ్గుతారో ఎవరు తగ్గుతారో చూడాలి.
This post was last modified on April 9, 2025 10:51 am
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…