ఈ నెల విడుదల కాబోతున్న నోటెడ్ సినిమాల్లో ఓదెల 2 బిజినెస్ పరంగా మంచి క్రేజ్ సంపాదించుకుంది. టీజర్ రాక ముందు వరకు దీని గురించి ప్రేక్షకుల్లో పెద్దగా అవగాహన లేదు. ఎందుకంటే ఓదెల రైల్వేస్టేషన్ గా వచ్చిన మొదటి భాగం నేరుగా ఓటిటి రిలీజ్ జరుపుకోవడం, కొంచెం ఏ సర్టిఫికెట్ కంటెంట్ వల్ల కామన్ ఆడియన్స్ కి ఎక్కువ రీచ్ కాలేదు. కానీ నిర్మాత కం రైటర్ సంపత్ నంది ఈసారి థియేటర్ ని టార్గెట్ చేసుకుని మిల్కీ బ్యూటీ తమన్నాని ఎంచుకోవడం సినిమా ఇమేజ్ పెంచడానికి బాగా ఉపయోగపడింది. రిలీజ్ కు ముందే మొత్తం రికవర్ అయిపోయి లాభాలు కూడా వచ్చాయన్న టాక్ ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
అంకెల సంగతి పక్కనపెడితే ఓదెల 2 మీద ఇంత బజ్ ఏర్పడడానికి కొన్ని కారణాలు కనిపిస్తున్నాయి. మొదటిది బాలయ్య అఖండలో అఘోరా క్యారెక్టర్ ని జనం రిసీవ్ చేసుకున్న తీరుని సంపత్ నంది బాగా స్టడీ చేశాడు. ఎలాంటి భీభత్స రూపం లేకుండా హుందాగా దాన్ని బోయపాటి శీను డిజైన్ చేసిన తీరుని స్ఫూర్తిగా తీసుకుని తమన్నా పాత్రకు రూపకల్పన చేసినట్టు కనిపిస్తోంది. వీటికి తోడు శివుడి సెంటిమెంట్, కాశి బ్యాక్ డ్రాప్, గ్రామ దేవతలు, దెయ్యాలు, ఊళ్ళో హత్యలు ఇలా కంప్లీట్ ప్యాకేజీగా రూపొందించిన వైనం మాస్ జనాల్లో ఆసక్తి రేపుతోంది. ఆ నమ్మకమే బయ్యర్లను ఎక్కువ రేట్లు పెట్టేందుకు పురికొల్పుతోంది.
కాంపిటేషన్ పరంగా చూసుకునే ఓదెల 2కి మరుసటి రోజు కళ్యాణ్ రామ్ అర్జున్ సన్నాఫ్ వైజయంతితో పాటు ప్రియదర్శి సారంగపాణి జాతకం వస్తున్నాయి. అయితే మూడు దేనికవే సంబంధం లేని జానర్లు కావడం వల్ల టాక్ పాజిటివ్ గా ఉంటే చాలు జనాలు వస్తారు. మండు వేసవిలో వినోదం కోసం ఎదురు చూస్తున్న ఆడియన్స్ కి ఈ నెలలో హరిహర వీరమల్లు, కన్నప్ప, ఘాటీ లాంటి ప్యాన్ ఇండియా సినిమాలు మిస్సయినప్పటికీ ఇప్పుడొచ్చేవి ఆ కొరత తీరుస్తాయనే నమ్మకమైతే నిర్మాతల్లో ఉంది. ఓదెల 2 మల్టీ లాంగ్వేజెస్ లో విడుదల చేస్తున్నారు. హిందీ వెర్షన్ సైతం బాగా పే చేస్తుందనే ధీమా మేకర్స్ లో ఉంది.
This post was last modified on April 7, 2025 5:45 pm
పశ్చిమ బెంగాల్లో అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తోంది. గత మూడు సార్లుగా ఇక్కడ అధికారంలో ఉన్న దీదీ..…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి కేవలం ఎనిమిది నెలల్లో మూడో సినిమా రాబోతోంది. గత ఏడాది రెండు నెలల…
కాదేది బూతుకు అనర్హం అన్నారో సినీ కవి. కొందరు దీన్ని నిజం చేసే పనిలో ఉన్నారు. ఇటీవలే కన్నడ ప్యాన్…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆ పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. దీనిపై ఇటీవలి…
తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు జిఓ కోసం ఎదురు చూసిన మైత్రి సంస్థకు చివరికి అది జరిగే సూచనలు లేకపోవడంతో…
'ద హండ్రెడ్' వేలంలో పాకిస్థాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ను సన్రైజర్స్ లీడ్స్ కొనుగోలు చేయడం ఊహించని వివాదానికి దారితీస్తోంది. ఈ…