గత కొన్నేళ్లలో ఇండియన్ బాక్సాఫీస్లో అతి పెద్ద సంచలనం అంటే.. కాంతార మూవీనే అని చెప్పాలి. కేవలం రూ.16 కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన చిత్రమిది. కన్నడలో చిన్న స్థాయిలో రిలీజైన ఈ సినిమా అక్కడ అద్భుత స్పందన తెచ్చుకుని.. తర్వాత తెలుగు, హిందీ, తమిళ భాషల్లోకి కూడా అనువాదమైంది. ప్రతి చోటా సంచలన వసూళ్లతో దూసుకెళ్లింది. ఏకంగా రూ.400 కోట్ల క్లబ్బులో అడుగు పెట్టింది. ఈ సినిమాతో హీరో కమ్ డైరెక్టర్ రిషబ్ శెట్టి రేంజే మారిపోయింది. పాన్ ఇండియా స్థాయిలో మోస్ట్ వాంటెడ్ హీరో కమ్ డైరెక్టర్ అయిపోయాడు. తెలుగు, హిందీ భాషల్లో భారీ చిత్రాలు ఒప్పుకున్న అతను.. ప్రస్తుతం కాంతార ప్రీక్వెల్ చిత్రీకరణలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.
ఈ సినిమా ఈ ఏడాది దసరాకు రిలీజ్ కావాల్సి ఉంది. ఐతే చత్రీకరణ ఆలస్యం అవుతుండడంతో కాంతార చాప్టర్ 1ను వచ్చే ఏడాదికి వాయిదా వేస్తున్నట్లు కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. ఈ ప్రచారంపై చిత్ర బృందం స్పందించింది. కాంతార చాప్టర్ 1 షూటింగ్ సజావుగానే సాగుతోందని.. ముందు ప్రకటించిన ప్రకారమే ఈ ఏడాది అక్టోబరు 2న ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ స్పష్టం చేసింది. ఈ సినిమా మీద పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలున్న నేపథ్యంలో ఈసారి చాలా పెద్ద బడ్జెట్లో, భారీస్థాయిలో సినిమాను తీర్చిదిద్దుతోంది రిషబ్ బృందం.
కాంతార కథ ఎక్కడి నుంచి మొదలైందో అక్కడ్నుంచి వెనక్కి వెళ్లి.. కాంతార బ్యాక్ స్టోరీని చూపించబోతున్నారు. కాంతారలో హైలైట్ అయిన డివైన్ ఎలిమెంట్స్ను కాంతార చాప్టర్ 1 లో మరింత ఎలివేట్ చేసి చూపించనున్నారు. ఇందులో తారాగణం కూడా భారీగానే ఉంటుందట. ఐతే ఇందులో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్లు వార్తలు రాగా.. వాటిని ఆయన ఖండించారు. ఐదారు భారతీయ భాషల్లో కాంతార ప్రీక్వెల్ ఒకేసారి విడుదల కానుంది. ఈ చిత్రానికి రూ.500 కోట్ల మేర బిజినెస్ అవుతుందని అంచనా వేస్తున్నారు.
This post was last modified on April 3, 2025 10:17 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…