టాలీవుడ్ అగ్ర దర్శకుడు సుకుమార్ కెరీర్లో మిగతా చిత్రాలన్నీ ఒకెత్తయితే.. పుష్ప, పుష్ప-2 మరో ఎత్తు. ఈ రెండు చిత్రాలు పాన్ ఇండియా స్థాయిలో సంచలన విజయం సాధించి ఆయన స్థాయిని అమాంతం పెంచేశాయి. ముఖ్యంగా పుష్ప-2కు వచ్చిన హైప్.. ఆ సినిమా సాధించిన వసూళ్లు ఒక చరిత్ర. ఈ సినిమాలో అల్లు అర్జున్ పాత్రను సుకుమార్ మలిచిన తీరు.. ఆ పాత్రలో బన్నీ పెర్ఫామెన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆ పాత్రలో మరొకరిని ఊహించుకోవడం కష్టమే. మరి సుకుమార్కు ఛాయిస్ ఇచ్చి.. తమిళ సినీ పరిశ్రమ నుంచి పుష్ప పాత్ర కోసం ఒకరిని ఎంచుకోమంటే ఆయన ఏం సమాధానం చెప్పారన్నది ఆసక్తికరం.
చెన్నైలో జరిగిన ఒక అవార్డుల కార్యక్రమంలో ఉత్తమ దర్శకుడిగా పురస్కారం అందుకున్న సందర్భంగా సుకుమార్ ఈ ప్రశ్నకు సమాధానం ఇచ్చాడు. విజయ్, అజిత్ లాంటి టాప్ స్టార్లలో పుష్ప పాత్ర కోసం ఎవరిని ఎంచుకుంటారు అని అడిగితే.. ఈ ఇద్దరు హీరోల చిత్రాలు తాను చాలా తక్కువగా చూశానని సుకుమార్ చెప్పాడు. వీరి కంటే తాను కార్తిని పుష్ప పాత్ర కోసం ఎంచుకుంటానని చెప్పి ఆశ్చర్యపరిచారు సుకుమార్. కార్తి ముఖంలో హావభావాలు ఎప్పుడూ కదులుతూ ఉంటాయంటూ అతడికి కితాబిచ్చాడు సుకుమార్. ఇక పుష్ప టైటిల్ వెనుక కథను కూడా సుకుమార్ ఈ వేదికలో పంచుకున్నాడు.
నిజానికి పుష్ప కథతో సినిమా తీయాలనుకోలేదని… ఎర్రచందనం స్మగ్లింగ్ మీద వెబ్ సిరీస్ చేయాలనుకున్నానని.. దీనికి సంబంధించిన రీసెర్చ్లో భాగంగా అనేకమంది స్మగ్లర్లను కూడా కలిశానని.. అందులో ఒక స్మగ్లర్ పేరు పుష్ప రాజ్ అని.. తనను అందరూ పుష్ప అని పిలుస్తారని.. ఈ కథతో సినిమా తీయాలనుకున్నాక తన పేరునే సినిమాకు టైటిల్గా పెట్టామని సుకుమార్ వెల్లడించాడు.
ఈ కార్యక్రమంలో తనకు దర్శకుడిగా ఎంతో స్ఫూర్తినిచ్చిన మణిరత్నం గురించి సుకుమార్ మాట్లాడాడు. ఆయన తీసిన గీతాంజలి సినిమా చూసే తాను సినీ రంగంలోకి వచ్చానని.. తాను దర్శకుడు కావడానికి కారణమైన ఆయనకు ఈ వేదిక మీది నుంచి కృతజ్ఞతలు చెబుతున్నానని సుకుమార్ అన్నాడు.
This post was last modified on April 3, 2025 10:13 am
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…