గత దశాబ్ద కాలంలో బహు భాషల్లో విజయాలు అందుకుని ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో పెద్ద రేంజికి ఎదిగిన కథానాయిక రష్మిక మందన్నా. ‘యానిమల్’ తర్వాత ఆమె ఫోకస్ బాలీవుడ్ మీద పడింది. ఈ క్రమంలో కొన్ని సౌత్ సినిమాలను సైతం వదులుకుంది. అలా ఆమె ఓకే చేశాక బయటికి వచ్చిన ప్రాజెక్టుల్లో ‘రాబిన్ హుడ్’ ఒకటి.
‘భీష్మ’ లాంటి హిట్ తర్వాత నితిన్-వెంకీ కాంబినేషన్లో చేయాల్సిన సినిమా నుంచి ఆమె బయటికి వచ్చినపుడు అందరూ ఆశ్చర్యపోయారు. కానీ తన నిర్ణయం కరెక్టే అని ఇటీవల ఈ సినిమా ఫలితం చూశాక అర్థమైంది. ‘రాబిన్ హుడ్’ బాక్సాఫీస్ దగ్గర చేదు అనుభవాన్ని ఎదుర్కొంది. ఇందులో హీరోయిన్ పాత్రను చూస్తే రష్మిక ఈ సినిమా వదలిలేయడం మంచి నిర్ణయమే అనిపించింది. కానీ ఈ సినిమా నుంచి లక్కీగా బయటపడ్డ రష్మిక.. ఇదే సమయంలో రిలీజైన మరో చిత్రంతో ఎదురు దెబ్బ తింది.
రష్మిక హిందీలో నటించిన భారీ చిత్రం ‘సికందర్’ బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా కొట్టింది. ఫామ్లో లేని మురుగదాస్, సల్మాన్ ఖాన్ కలిసి ఈ సినిమా చేయడంతో ముందే దీని మీద అనుమానాలున్నాయి. ఆ అనుమానాలకు తగ్గట్లే సినిమా దారుణంగా బోల్తా కొట్టింది. ఈ చిత్రంలో రష్మికది కీలక పాత్రే అయినా.. దాని ఇంపాక్ట్ ఏమీ లేదు. రష్మిక లుక్స్, నటన పట్ల అందరూ విమర్శలే చేస్తున్నారు. ఈ సినిమా వల్ల రష్మికకు ఏమాత్రం ప్రయోజనం లేదనే చెప్పాలి.
‘యానిమల్’ తర్వాత రష్మిక నటించిన హిందీ మూవీ ‘ఛావా’ భారీ హిట్ అయినా.. ఆమెకు పెద్దగా పేరు రాలేదు. ఇప్పుడు ‘సికందర్’ అన్ని రకాలుగా నిరాశపరిచింది. ఇక ఆమె ఆశలన్నీ సౌత్ సినిమాలైన ‘కుబేర’, ‘ది గర్ల్ ఫ్రెండ్’ మీదే ఉన్నాయి. అవి పెద్ద సినిమాలు కాకపోయినా రష్మికకు మంచి పేరు, బ్రేక్ అందించేలా కనిపిస్తున్నాయి.
This post was last modified on March 31, 2025 9:05 pm
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం.. తిరుపతిలోని కుప్పంలో ఆయన సతీమణి నారా భువనేశ్వరి సైలెంట్గా చుట్టేస్తున్నారు. ప్రతి రెండు…
అయోధ్య రామాలయం ఎక్కడో ఉత్తర ప్రదేశ్ లో ఉంది కదా. మరి ఈ రామాలయం.. అది కూడా ఓ ముస్లిం కట్టిన…
తిరువీర్ అంటే రెగ్యులర్ సినిమాలు చూసే ప్రేక్షకులకు సుపరిచితుడే కానీ సెలెక్టివ్ గా థియేటర్లకు వెళ్లే వాళ్లకు మాత్రం కొంచెం…
తెలుగు నేల విభజన తర్వాత రాజధాని లేకుండానే ఆంధ్ర ప్రదేశ్ తన ప్రస్థానాన్ని మొదలుపెట్టాల్సి వచ్చింది. ఓ వైపు రాజధాని లేమి,…
మార్కాపురం జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం తీరని విషాదాన్ని మిగిల్చిన విషయం తెలిసిందే. అయితే ఇదే ప్రమాదంలో మరోవైపు…
పశ్చిమ ఆసియాలో యుద్ధం ముదురుతున్న కొద్దీ భారత్ తన ఇంధన అవసరాల కోసం వ్యూహాలను వేగవంతం చేస్తోంది. చమురు, గ్యాస్…