గత దశాబ్ద కాలంలో బహు భాషల్లో విజయాలు అందుకుని ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో పెద్ద రేంజికి ఎదిగిన కథానాయిక రష్మిక మందన్నా. ‘యానిమల్’ తర్వాత ఆమె ఫోకస్ బాలీవుడ్ మీద పడింది. ఈ క్రమంలో కొన్ని సౌత్ సినిమాలను సైతం వదులుకుంది. అలా ఆమె ఓకే చేశాక బయటికి వచ్చిన ప్రాజెక్టుల్లో ‘రాబిన్ హుడ్’ ఒకటి.
‘భీష్మ’ లాంటి హిట్ తర్వాత నితిన్-వెంకీ కాంబినేషన్లో చేయాల్సిన సినిమా నుంచి ఆమె బయటికి వచ్చినపుడు అందరూ ఆశ్చర్యపోయారు. కానీ తన నిర్ణయం కరెక్టే అని ఇటీవల ఈ సినిమా ఫలితం చూశాక అర్థమైంది. ‘రాబిన్ హుడ్’ బాక్సాఫీస్ దగ్గర చేదు అనుభవాన్ని ఎదుర్కొంది. ఇందులో హీరోయిన్ పాత్రను చూస్తే రష్మిక ఈ సినిమా వదలిలేయడం మంచి నిర్ణయమే అనిపించింది. కానీ ఈ సినిమా నుంచి లక్కీగా బయటపడ్డ రష్మిక.. ఇదే సమయంలో రిలీజైన మరో చిత్రంతో ఎదురు దెబ్బ తింది.
రష్మిక హిందీలో నటించిన భారీ చిత్రం ‘సికందర్’ బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా కొట్టింది. ఫామ్లో లేని మురుగదాస్, సల్మాన్ ఖాన్ కలిసి ఈ సినిమా చేయడంతో ముందే దీని మీద అనుమానాలున్నాయి. ఆ అనుమానాలకు తగ్గట్లే సినిమా దారుణంగా బోల్తా కొట్టింది. ఈ చిత్రంలో రష్మికది కీలక పాత్రే అయినా.. దాని ఇంపాక్ట్ ఏమీ లేదు. రష్మిక లుక్స్, నటన పట్ల అందరూ విమర్శలే చేస్తున్నారు. ఈ సినిమా వల్ల రష్మికకు ఏమాత్రం ప్రయోజనం లేదనే చెప్పాలి.
‘యానిమల్’ తర్వాత రష్మిక నటించిన హిందీ మూవీ ‘ఛావా’ భారీ హిట్ అయినా.. ఆమెకు పెద్దగా పేరు రాలేదు. ఇప్పుడు ‘సికందర్’ అన్ని రకాలుగా నిరాశపరిచింది. ఇక ఆమె ఆశలన్నీ సౌత్ సినిమాలైన ‘కుబేర’, ‘ది గర్ల్ ఫ్రెండ్’ మీదే ఉన్నాయి. అవి పెద్ద సినిమాలు కాకపోయినా రష్మికకు మంచి పేరు, బ్రేక్ అందించేలా కనిపిస్తున్నాయి.
This post was last modified on March 31, 2025 9:05 pm
ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాలకు మన దేశంలో తెగ క్రేజ్ ఉండేది. జురాసిక్ పార్క్ నుంచి ఇది విపరీతంగా పెరిగిపోయింది. దానికి…
గత వారం విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ఫుల్ పాజిటివ్ టాకేమీ తెచ్చుకోలేదు. ప్రిమియర్స్ నుంచే డివైడ్ టాక్ మొదలైంది.…
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విష్ణుమూర్తి అవతారంగా ప్రముఖ బాలివుడ్ నటుడు సుదేష్ బెర్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో…
బలమైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆశలన్నీ కొరియన్ కనకరాజు మీదే ఉన్నాయి. ఆగస్ట్…
ఏపీ దశ దిశలను మార్చేసే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం శనివారం ఉదయం లాంఛనంగా ప్రారంబమైంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ అల్లూరి సీతారామరాజు…
జంతర్ మంతర్ ఆందోళనలో ప్రధాని మోదీపై విమర్శలు చేయడం కన్నీళ్లు తెప్పించిందని, పండ్లు కాసే చెట్టుపైకి రాళ్లేస్తారని, దేశం కోసం…