గత దశాబ్ద కాలంలో బహు భాషల్లో విజయాలు అందుకుని ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో పెద్ద రేంజికి ఎదిగిన కథానాయిక రష్మిక మందన్నా. ‘యానిమల్’ తర్వాత ఆమె ఫోకస్ బాలీవుడ్ మీద పడింది. ఈ క్రమంలో కొన్ని సౌత్ సినిమాలను సైతం వదులుకుంది. అలా ఆమె ఓకే చేశాక బయటికి వచ్చిన ప్రాజెక్టుల్లో ‘రాబిన్ హుడ్’ ఒకటి.
‘భీష్మ’ లాంటి హిట్ తర్వాత నితిన్-వెంకీ కాంబినేషన్లో చేయాల్సిన సినిమా నుంచి ఆమె బయటికి వచ్చినపుడు అందరూ ఆశ్చర్యపోయారు. కానీ తన నిర్ణయం కరెక్టే అని ఇటీవల ఈ సినిమా ఫలితం చూశాక అర్థమైంది. ‘రాబిన్ హుడ్’ బాక్సాఫీస్ దగ్గర చేదు అనుభవాన్ని ఎదుర్కొంది. ఇందులో హీరోయిన్ పాత్రను చూస్తే రష్మిక ఈ సినిమా వదలిలేయడం మంచి నిర్ణయమే అనిపించింది. కానీ ఈ సినిమా నుంచి లక్కీగా బయటపడ్డ రష్మిక.. ఇదే సమయంలో రిలీజైన మరో చిత్రంతో ఎదురు దెబ్బ తింది.
రష్మిక హిందీలో నటించిన భారీ చిత్రం ‘సికందర్’ బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా కొట్టింది. ఫామ్లో లేని మురుగదాస్, సల్మాన్ ఖాన్ కలిసి ఈ సినిమా చేయడంతో ముందే దీని మీద అనుమానాలున్నాయి. ఆ అనుమానాలకు తగ్గట్లే సినిమా దారుణంగా బోల్తా కొట్టింది. ఈ చిత్రంలో రష్మికది కీలక పాత్రే అయినా.. దాని ఇంపాక్ట్ ఏమీ లేదు. రష్మిక లుక్స్, నటన పట్ల అందరూ విమర్శలే చేస్తున్నారు. ఈ సినిమా వల్ల రష్మికకు ఏమాత్రం ప్రయోజనం లేదనే చెప్పాలి.
‘యానిమల్’ తర్వాత రష్మిక నటించిన హిందీ మూవీ ‘ఛావా’ భారీ హిట్ అయినా.. ఆమెకు పెద్దగా పేరు రాలేదు. ఇప్పుడు ‘సికందర్’ అన్ని రకాలుగా నిరాశపరిచింది. ఇక ఆమె ఆశలన్నీ సౌత్ సినిమాలైన ‘కుబేర’, ‘ది గర్ల్ ఫ్రెండ్’ మీదే ఉన్నాయి. అవి పెద్ద సినిమాలు కాకపోయినా రష్మికకు మంచి పేరు, బ్రేక్ అందించేలా కనిపిస్తున్నాయి.
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…