అనూహ్యంగా రాజకీయ రంగు పులుముకున్న ఎల్2 ఎంపురాన్ కంటెంట్ గురించి అభ్యంతరాలు తలెత్తి దర్శకుడు పృథ్విరాజ్ సుకుమారన్, రచయిత గోపి మురళి మీద విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ఉద్దేశపూర్వకంగానే అభిమన్యు సింగ్ పోషించిన విలన్ పాత్రని హిందువుగా చూపించి ఇతర మతం బాధితులపై దారుణాలకు తెగబడినట్టు తప్పుడు సందేశం ఇచ్చారని పలువురు అభ్యంతరాలు లేవనెత్తారు. ఇది కాస్తా కోర్టుకి వెళ్లి లేనిపోని తలనెప్పులు తెస్తుందనిపించి టీమ్ రిపేర్లు చేసే పనిలో పడింది. తాజాగా అబ్జెక్షన్ అనిపించిన 17 కత్తిరింపులతో కొత్త వెర్షన్ రీ సెన్సార్ చేయించినట్టు మల్లువుడ్ సమాచారం.
కొన్ని పాత్రల పేరు మార్చడంతో పాటు కాంట్రవర్సీకి దారి తీసిన పృథ్విరాజ్ చైల్డ్ ఎపిసోడ్ లోని రేప్ సీన్ సైతం ట్రిమ్ చేసినట్టు వినికిడి. ఇవన్నీ బుధవారం నుంచి థియేటర్ స్క్రీనింగ్స్ లో అమలులోకి వస్తాయట. ఎల్2 ఎంపురాన్ బృందం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ నిజమేనని కేరళ రిపోర్ట్. దీని వల్ల తెలుగుతో పాటు ఇతర డబ్బింగ్ వెర్షన్లకు ఒరిగే ప్రయోజనం ఏమి లేదు. మలయాళంలో మాత్రం బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ఈ గ్యాంగ్ స్టర్ డ్రామా ఆల్రెడీ 100 కోట్ల గ్రాస్ దాటేయగా ఓవర్సీస్ లో ఫైనల్ రన్ లోపు పది మిలియన్ మార్క్ చేరుకుంటుందని అంచనా.
ఇంకో ట్విస్ట్ ఏంటంటే పోస్ట్ ప్రొడక్షన్ అయ్యాక పృథ్విరాజ్ మీద నమ్మకంతో మోహన్ లాల్ ఫైనల్ కాపీ చూడలేదట. ఒకవేళ ప్రివ్యూ వేసుకుని ఉంటే ముందే కొన్ని సన్నివేశాలను తీయించేవారని ఆయన సన్నిహితుల మాట. లూసిఫర్ సీక్వెల్ గా రూపొందిన ఎల్2 ఎంపురాన్ నెక్స్ట్ మూడో భాగంకు వెళ్తుందా లేదానే అనుమానాలు అభిమానుల్లో తలెత్తుతున్నాయి. బ్లాక్ బస్టర్ అయ్యుంటే డిస్కషన్ ఉండేది కాదు కానీ హిందీతో పాటు ఇతర లాంగ్వేజెస్ లో డిజాస్టర్ కావడంతో ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి. పృథ్విరాజ్ మాత్రం ఎల్3 ది బిగినింగ్ తీసే విషయంలో సీరియస్ గా ఉన్నట్టు తెలిసింది. చూడాలి ఏం చేస్తారో.
This post was last modified on March 30, 2025 1:42 pm
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…
ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…
తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…
చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్లో మంచి క్రేజ్తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…
దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కలిసి సినిమా చేయాలని వాళ్లిద్దరి అభిమానులు ఎన్నో ఏళ్ల ముందు…