సిద్ధు జొన్నలగడ్డ కెరీర్ను గొప్ప మలుపు తిప్పిన సినిమా.. డీజే టిల్లు. చిన్న సినిమాగా రిలీజై పెద్ద విజయం సాధించిన ఈ చిత్రం.. సీక్వెల్తో ఇంకా పెద్ద సంచలనమే రేపింది. గత ఏడాది వచ్చిన ‘టిల్లు స్క్వేర్’ ఏకంగా రూ.130 కోట్ల వసూళ్లు సాధించడం విశేషం. పార్ట్-3 ఇంకా పెద్ద సినిమా కాబోతోంది. టిల్లు అనే పాత్ర పెద్ద బ్రాండుగా మారిందంటే దానికి ‘డీజే టిల్లు’ వేసిన పునాదే కారణం. ఐతే ఇంత పాపులర్ సినిమాకు ముందు అనుకున్న టైటిల్ అది కాదట. ‘నరుడి బ్రతుకు నటన’ అనే పేరు పెట్టి స్క్రిప్టు రాసిందట సిద్ధు అండ్ టీం. కానీ ఆ టైటిల్ తమకు అసలు వర్కవుట్ కాలేదని.. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో టైటిల్ మార్చాల్సి వచ్చిందని సిద్ధు తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
‘‘డీజే టిల్లు సినిమాకు ముందు మేం ‘నరుడి బ్రతుకు నటన’ అనే టైటిల్ పెట్టాం. ఆ టైటిల్ వేరే వాళ్లు రిజిస్టర్ చేసుకుని ఉంటే.. 4 లక్షల డబ్బు చెల్లించి మరీ ఆ టైటిల్ కొన్నాం. కానీ మా స్నేహితులతో స్క్రిప్టు చర్చలు జరుపుతున్నపుడు ఆ టైటిల్ చెప్పగానే ఇదొక మామూలు సినిమా అనుకుని వినడానికి ఆసక్తి చూపించేవారు కాదు. త్రివిక్రమ్ గారికి ఈ టైటిల్ చెబితే.. ఇదొక మధ్యతరగతి వ్యక్తి జీవిత కథ అనుకున్నారు. దీంతో మేం టైటిల్ మార్చాలని నిర్ణయించుకున్నాం.
ఇందులో హీరో పేరు.. డీజే టిల్లు. దాన్నే టైటిల్గా పెట్టాని నిర్ణయించుకున్నాం. అది బాగా వర్కవుట్ అయింది’’ అని సిద్ధు వెల్లడించాడు. తాను కూడా అందరిలాగే బీటెక్ అయ్యాక యుఎస్ వెళ్లాల్సిన వాడినని.. ఒక కన్సల్టన్సీ రూ.20 లక్షలు కడితే యుఎస్ పంపుతామని, అక్కడ చదువుకుంటూ అప్పు తీర్చడానికి బర్గర్ షాప్లో పని చేయాలని చెప్పారని.. ఇది నచ్చక తాను సినిమాల్లోనే ప్రయత్నం చేద్దామనుకున్నాని సిద్ధు ఈ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
This post was last modified on March 29, 2025 9:42 pm
హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…
నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…
ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…
నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…
ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…