సిద్ధు జొన్నలగడ్డ కెరీర్ను గొప్ప మలుపు తిప్పిన సినిమా.. డీజే టిల్లు. చిన్న సినిమాగా రిలీజై పెద్ద విజయం సాధించిన ఈ చిత్రం.. సీక్వెల్తో ఇంకా పెద్ద సంచలనమే రేపింది. గత ఏడాది వచ్చిన ‘టిల్లు స్క్వేర్’ ఏకంగా రూ.130 కోట్ల వసూళ్లు సాధించడం విశేషం. పార్ట్-3 ఇంకా పెద్ద సినిమా కాబోతోంది. టిల్లు అనే పాత్ర పెద్ద బ్రాండుగా మారిందంటే దానికి ‘డీజే టిల్లు’ వేసిన పునాదే కారణం. ఐతే ఇంత పాపులర్ సినిమాకు ముందు అనుకున్న టైటిల్ అది కాదట. ‘నరుడి బ్రతుకు నటన’ అనే పేరు పెట్టి స్క్రిప్టు రాసిందట సిద్ధు అండ్ టీం. కానీ ఆ టైటిల్ తమకు అసలు వర్కవుట్ కాలేదని.. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో టైటిల్ మార్చాల్సి వచ్చిందని సిద్ధు తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
‘‘డీజే టిల్లు సినిమాకు ముందు మేం ‘నరుడి బ్రతుకు నటన’ అనే టైటిల్ పెట్టాం. ఆ టైటిల్ వేరే వాళ్లు రిజిస్టర్ చేసుకుని ఉంటే.. 4 లక్షల డబ్బు చెల్లించి మరీ ఆ టైటిల్ కొన్నాం. కానీ మా స్నేహితులతో స్క్రిప్టు చర్చలు జరుపుతున్నపుడు ఆ టైటిల్ చెప్పగానే ఇదొక మామూలు సినిమా అనుకుని వినడానికి ఆసక్తి చూపించేవారు కాదు. త్రివిక్రమ్ గారికి ఈ టైటిల్ చెబితే.. ఇదొక మధ్యతరగతి వ్యక్తి జీవిత కథ అనుకున్నారు. దీంతో మేం టైటిల్ మార్చాలని నిర్ణయించుకున్నాం.
ఇందులో హీరో పేరు.. డీజే టిల్లు. దాన్నే టైటిల్గా పెట్టాని నిర్ణయించుకున్నాం. అది బాగా వర్కవుట్ అయింది’’ అని సిద్ధు వెల్లడించాడు. తాను కూడా అందరిలాగే బీటెక్ అయ్యాక యుఎస్ వెళ్లాల్సిన వాడినని.. ఒక కన్సల్టన్సీ రూ.20 లక్షలు కడితే యుఎస్ పంపుతామని, అక్కడ చదువుకుంటూ అప్పు తీర్చడానికి బర్గర్ షాప్లో పని చేయాలని చెప్పారని.. ఇది నచ్చక తాను సినిమాల్లోనే ప్రయత్నం చేద్దామనుకున్నాని సిద్ధు ఈ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
This post was last modified on March 29, 2025 9:42 pm
కలిసి రాజకీయం చేయకపోయినా వైఎస్సార్సీపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య కొన్ని పోలికలు కనిపిస్తున్నాయి. అటు ఏపీలో, ఇటు తెలంగాణలో ఈ…
సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటూ.. తన సినిమాల ఈవెంట్లలో, ఇంటర్వ్యూల్లో హాట్ హాట్ కామెంట్లు చేస్తుంటాడు ప్రముఖ తెలుగు…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'తో ఇప్పుడు తప్పకుండా హిట్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో 'గద్దలకొండ గణేష్'…
ఆదివారం రోజు అందులోనూ ప్రత్యేకంగా సాయంత్రం షోలకు ఆక్యుపెన్సీలు బాగుండటం సహజమే కానీ ఈవారం మాత్రం బయ్యర్లు ఆనందంతో మునిగిపోయేలా…
తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలులో కీలక మార్పులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. కళాశాలలకు…
నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన ఢిల్లీ నిరసనలో ఉగ్రవాదుల కుట్ర కోణం బయట పడిందని ఢిల్లీ టాస్క్ఫోర్స్…