మోహన్ లాల్ హీరోగా పృథ్వీరాజ్ సుకుమారన్ రూపొందించిన ‘ఎల్2: ఎంపురాన్’ సినిమా మీద ఏ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయో తెలిసిందే. మలయాళంలో కొన్నేళ్ల కిందట ఇండస్ట్రీ హిట్గా నిలిచిన ‘లూసిఫర్’కు ఇది సీక్వెల్ కావడం. ప్రోమోలు ఒక రేంజిలో ఉండడంతో సినిమాకు మామూలు హైప్ రాలేదు. కానీ ఈ హైప్కు తగ్గట్లు సినిమా లేకపోవడంతో ప్రేక్షకులు నిరాశ చెందారు. సినిమా బాగా లేకపోవడం పక్కనపెడితే.. ఇందులో కొన్ని సీన్లు ఒక వర్గానికి తీవ్ర ఆగ్రహం తెప్పించేలా సాగాయి. ముఖ్యంగా ఆరంభంలో ముస్లిం కుటుంబం మీద హిందూ అతివాదులు దాడి చేసే సన్నివేశం తీవ్ర వివాదాస్పదం అయింది.
2002 నాటి గోద్రా అల్లర్లను ప్రతిబింబించేలా ఈ సీన్స్ తీశాడు పృథ్వీరాజ్. అందులో నిండు గర్భిణి అయిన ముస్లిం మహిళ మీద హిందూ అతివాది అత్యాచారం జరిపినట్లు చూపించడం మీద తీవ్ర విమర్శలు వస్తున్నాయి. సినిమాలో మరి కొన్ని సీన్లు కూడా హిందూ వ్యతిరేక భావజాలంతో సాగడం, మోడీ సర్కారును టార్గెట్ చేసేలా ఉండడంతో బీజేపీ మద్దతుదారులు ఈ సినిమాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ‘ఎంపురాన్’ను టార్గెట్ చేస్తున్నారు. మోహన్ లాల్ ఇలాంటి సన్నివేశాలను ఎలా ఓకే చేశాడని ప్రశ్నిస్తున్నారు.
ఐతే కేరళకు చెందిన కాంగ్రెస్, వామపక్షాల పార్టీల వాళ్లు అదే స్థాయిలో వారికి బదులిస్తున్నారు. కశ్మీర్ ఫైల్స్, కేరళ స్టోరీ లాంటి ప్రాపగండా సినిమాలు తీసి ప్రయోజనం పొందిన పార్టీ.. ఇప్పుడు ‘ఎంపురాన్’ను ఎలా తప్పుబడుతుందని ప్రశ్నిస్తున్నారు. ‘ఛావా’ సినిమాను సైతం వాళ్లు ప్రస్తావిస్తున్నారు. అందులో చూపించిన ముస్లిం హేట్ సంగతేంటి అని అంటున్నారు. మొత్తంగా కేరళలో ఈ సినిమా రాజకీయంగా రచ్చకు దారి తీస్తోంది. ఐతే ఈ కాంట్రవర్శీలు ఎలా ఉన్నప్పటికీ మిక్స్డ్ టాక్తోనే ‘ఎంపురాన్’ భారీ వసూళ్లు సాధిస్తోంది.
This post was last modified on March 29, 2025 2:21 pm
చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేసే సాయిపల్లవి కాంబోల కన్నా ఎక్కువగా కంటెంట్ కి ప్రాధాన్యం ఇవ్వడం అందరికీ తెలిసిన…
గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే గళ్లా మాధవి తీసుకున్న వినూత్న నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. బీకాం చదువుకున్న ఓ…
ఒక హీరో చేయాల్సిన సినిమా ఇంకో హీరో చేతికి వెళ్లడం సినీ పరిశ్రమలో కామన్ వ్యవహారం. ఇలా మిస్ అయిన…
ఇరవై ఏడు సంవత్సరాల క్రితం వచ్చిన దేవి సినిమాకు టాలీవుడ్ లో ఒక ప్రత్యేక స్థానం ఉంది. అమ్మోరు లాంటి…
ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ మాజీముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై అదే పార్టీ నుంచి ఎంపీగా విజయం దక్కించుకుని.. ప్రస్తుతం…
తాము నిర్మించే సినిమాలు ఎంత నష్టం తెచ్చిపెట్టినా… తమను ఎంతగా కుదేలు చేసినా.. వాటి గురించి ఓపెన్ అవ్వడానికి నిర్మాతలు…