మోహన్ లాల్ హీరోగా పృథ్వీరాజ్ సుకుమారన్ రూపొందించిన ‘ఎల్2: ఎంపురాన్’ సినిమా మీద ఏ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయో తెలిసిందే. మలయాళంలో కొన్నేళ్ల కిందట ఇండస్ట్రీ హిట్గా నిలిచిన ‘లూసిఫర్’కు ఇది సీక్వెల్ కావడం. ప్రోమోలు ఒక రేంజిలో ఉండడంతో సినిమాకు మామూలు హైప్ రాలేదు. కానీ ఈ హైప్కు తగ్గట్లు సినిమా లేకపోవడంతో ప్రేక్షకులు నిరాశ చెందారు. సినిమా బాగా లేకపోవడం పక్కనపెడితే.. ఇందులో కొన్ని సీన్లు ఒక వర్గానికి తీవ్ర ఆగ్రహం తెప్పించేలా సాగాయి. ముఖ్యంగా ఆరంభంలో ముస్లిం కుటుంబం మీద హిందూ అతివాదులు దాడి చేసే సన్నివేశం తీవ్ర వివాదాస్పదం అయింది.
2002 నాటి గోద్రా అల్లర్లను ప్రతిబింబించేలా ఈ సీన్స్ తీశాడు పృథ్వీరాజ్. అందులో నిండు గర్భిణి అయిన ముస్లిం మహిళ మీద హిందూ అతివాది అత్యాచారం జరిపినట్లు చూపించడం మీద తీవ్ర విమర్శలు వస్తున్నాయి. సినిమాలో మరి కొన్ని సీన్లు కూడా హిందూ వ్యతిరేక భావజాలంతో సాగడం, మోడీ సర్కారును టార్గెట్ చేసేలా ఉండడంతో బీజేపీ మద్దతుదారులు ఈ సినిమాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ‘ఎంపురాన్’ను టార్గెట్ చేస్తున్నారు. మోహన్ లాల్ ఇలాంటి సన్నివేశాలను ఎలా ఓకే చేశాడని ప్రశ్నిస్తున్నారు.
ఐతే కేరళకు చెందిన కాంగ్రెస్, వామపక్షాల పార్టీల వాళ్లు అదే స్థాయిలో వారికి బదులిస్తున్నారు. కశ్మీర్ ఫైల్స్, కేరళ స్టోరీ లాంటి ప్రాపగండా సినిమాలు తీసి ప్రయోజనం పొందిన పార్టీ.. ఇప్పుడు ‘ఎంపురాన్’ను ఎలా తప్పుబడుతుందని ప్రశ్నిస్తున్నారు. ‘ఛావా’ సినిమాను సైతం వాళ్లు ప్రస్తావిస్తున్నారు. అందులో చూపించిన ముస్లిం హేట్ సంగతేంటి అని అంటున్నారు. మొత్తంగా కేరళలో ఈ సినిమా రాజకీయంగా రచ్చకు దారి తీస్తోంది. ఐతే ఈ కాంట్రవర్శీలు ఎలా ఉన్నప్పటికీ మిక్స్డ్ టాక్తోనే ‘ఎంపురాన్’ భారీ వసూళ్లు సాధిస్తోంది.
This post was last modified on March 29, 2025 2:21 pm
విద్యాబాలన్.. బాలీవుడ్లో మంచి స్థాయి ఉన్న కథానాయిక. ఆమె కథానాయికగా మంచి ఫాంలో ఉన్న టైంలో తెలుగులో నటింపజేయడానికి ప్రయత్నాలు…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ఈ ఏడాది సెప్టెంబరు 17తో 75 ఏళ్లు వస్తాయి. ప్రస్తుతం ఆయన వయసు 74…
రాబిన్ హుడ్ అంటే పెద్దోళ్లను దోచుకుని పేదోళ్లకు పెట్టేవాడు. ఈ పేరుతో ఓ తెలుగు సినిమా తెరకెక్కింది. రెండుసార్లు వాయిదా…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక వేత్తల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అరకు కాఫీని ప్రపంచానికి పరిచయం…
గత దశాబ్ద కాలంలో బహు భాషల్లో విజయాలు అందుకుని ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో పెద్ద రేంజికి ఎదిగిన కథానాయిక రష్మిక…
కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఏది చేసినా వైరల్ అయిపోతోంది. ఉమ్మడి అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గం కేంద్రంగా రాజకీయం చేస్తున్న కేతిరెడ్డి..…