మోహన్ లాల్ హీరోగా పృథ్వీరాజ్ సుకుమారన్ రూపొందించిన ‘ఎల్2: ఎంపురాన్’ సినిమా మీద ఏ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయో తెలిసిందే. మలయాళంలో కొన్నేళ్ల కిందట ఇండస్ట్రీ హిట్గా నిలిచిన ‘లూసిఫర్’కు ఇది సీక్వెల్ కావడం. ప్రోమోలు ఒక రేంజిలో ఉండడంతో సినిమాకు మామూలు హైప్ రాలేదు. కానీ ఈ హైప్కు తగ్గట్లు సినిమా లేకపోవడంతో ప్రేక్షకులు నిరాశ చెందారు. సినిమా బాగా లేకపోవడం పక్కనపెడితే.. ఇందులో కొన్ని సీన్లు ఒక వర్గానికి తీవ్ర ఆగ్రహం తెప్పించేలా సాగాయి. ముఖ్యంగా ఆరంభంలో ముస్లిం కుటుంబం మీద హిందూ అతివాదులు దాడి చేసే సన్నివేశం తీవ్ర వివాదాస్పదం అయింది.
2002 నాటి గోద్రా అల్లర్లను ప్రతిబింబించేలా ఈ సీన్స్ తీశాడు పృథ్వీరాజ్. అందులో నిండు గర్భిణి అయిన ముస్లిం మహిళ మీద హిందూ అతివాది అత్యాచారం జరిపినట్లు చూపించడం మీద తీవ్ర విమర్శలు వస్తున్నాయి. సినిమాలో మరి కొన్ని సీన్లు కూడా హిందూ వ్యతిరేక భావజాలంతో సాగడం, మోడీ సర్కారును టార్గెట్ చేసేలా ఉండడంతో బీజేపీ మద్దతుదారులు ఈ సినిమాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ‘ఎంపురాన్’ను టార్గెట్ చేస్తున్నారు. మోహన్ లాల్ ఇలాంటి సన్నివేశాలను ఎలా ఓకే చేశాడని ప్రశ్నిస్తున్నారు.
ఐతే కేరళకు చెందిన కాంగ్రెస్, వామపక్షాల పార్టీల వాళ్లు అదే స్థాయిలో వారికి బదులిస్తున్నారు. కశ్మీర్ ఫైల్స్, కేరళ స్టోరీ లాంటి ప్రాపగండా సినిమాలు తీసి ప్రయోజనం పొందిన పార్టీ.. ఇప్పుడు ‘ఎంపురాన్’ను ఎలా తప్పుబడుతుందని ప్రశ్నిస్తున్నారు. ‘ఛావా’ సినిమాను సైతం వాళ్లు ప్రస్తావిస్తున్నారు. అందులో చూపించిన ముస్లిం హేట్ సంగతేంటి అని అంటున్నారు. మొత్తంగా కేరళలో ఈ సినిమా రాజకీయంగా రచ్చకు దారి తీస్తోంది. ఐతే ఈ కాంట్రవర్శీలు ఎలా ఉన్నప్పటికీ మిక్స్డ్ టాక్తోనే ‘ఎంపురాన్’ భారీ వసూళ్లు సాధిస్తోంది.
This post was last modified on March 29, 2025 2:21 pm
త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు కీలక కసరత్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…
ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…
తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…
చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్లో మంచి క్రేజ్తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…