మోహన్ లాల్ హీరోగా పృథ్వీరాజ్ సుకుమారన్ రూపొందించిన ‘ఎల్2: ఎంపురాన్’ సినిమా మీద ఏ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయో తెలిసిందే. మలయాళంలో కొన్నేళ్ల కిందట ఇండస్ట్రీ హిట్గా నిలిచిన ‘లూసిఫర్’కు ఇది సీక్వెల్ కావడం. ప్రోమోలు ఒక రేంజిలో ఉండడంతో సినిమాకు మామూలు హైప్ రాలేదు. కానీ ఈ హైప్కు తగ్గట్లు సినిమా లేకపోవడంతో ప్రేక్షకులు నిరాశ చెందారు. సినిమా బాగా లేకపోవడం పక్కనపెడితే.. ఇందులో కొన్ని సీన్లు ఒక వర్గానికి తీవ్ర ఆగ్రహం తెప్పించేలా సాగాయి. ముఖ్యంగా ఆరంభంలో ముస్లిం కుటుంబం మీద హిందూ అతివాదులు దాడి చేసే సన్నివేశం తీవ్ర వివాదాస్పదం అయింది.
2002 నాటి గోద్రా అల్లర్లను ప్రతిబింబించేలా ఈ సీన్స్ తీశాడు పృథ్వీరాజ్. అందులో నిండు గర్భిణి అయిన ముస్లిం మహిళ మీద హిందూ అతివాది అత్యాచారం జరిపినట్లు చూపించడం మీద తీవ్ర విమర్శలు వస్తున్నాయి. సినిమాలో మరి కొన్ని సీన్లు కూడా హిందూ వ్యతిరేక భావజాలంతో సాగడం, మోడీ సర్కారును టార్గెట్ చేసేలా ఉండడంతో బీజేపీ మద్దతుదారులు ఈ సినిమాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ‘ఎంపురాన్’ను టార్గెట్ చేస్తున్నారు. మోహన్ లాల్ ఇలాంటి సన్నివేశాలను ఎలా ఓకే చేశాడని ప్రశ్నిస్తున్నారు.
ఐతే కేరళకు చెందిన కాంగ్రెస్, వామపక్షాల పార్టీల వాళ్లు అదే స్థాయిలో వారికి బదులిస్తున్నారు. కశ్మీర్ ఫైల్స్, కేరళ స్టోరీ లాంటి ప్రాపగండా సినిమాలు తీసి ప్రయోజనం పొందిన పార్టీ.. ఇప్పుడు ‘ఎంపురాన్’ను ఎలా తప్పుబడుతుందని ప్రశ్నిస్తున్నారు. ‘ఛావా’ సినిమాను సైతం వాళ్లు ప్రస్తావిస్తున్నారు. అందులో చూపించిన ముస్లిం హేట్ సంగతేంటి అని అంటున్నారు. మొత్తంగా కేరళలో ఈ సినిమా రాజకీయంగా రచ్చకు దారి తీస్తోంది. ఐతే ఈ కాంట్రవర్శీలు ఎలా ఉన్నప్పటికీ మిక్స్డ్ టాక్తోనే ‘ఎంపురాన్’ భారీ వసూళ్లు సాధిస్తోంది.
పోలీసు స్టేషన్లకు వెళ్లి ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేకుండా.. ఇక నుంచి వాయిస్ మెసేజ్ల ద్వారా కూడా ఫిర్యాదులు చేసే…
ఏపీలో వైసీపీ అదికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోని పాత జిల్లాలతో పాటుగా వైసీపీ సర్కారే కొత్తగా ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల్లోనూ…
పవన్ కళ్యాణ్ భుజాల లోపల కలిగిన గాయం ఊహించిన దానికంటే తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్…
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును వేధింపులకు గురిచేసి.. కస్టడీలో టార్చర్ చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ సునీల్ కుమార్…
రాజకీయాలంటే చాలా మంది చెడిపోయాయని అనుకుంటారు. కానీ, రాజకీయాలు అంతగా ఏమీ చెడిపోలేదు. ఒక పార్టీ కారణంగానే ఈ పేరు…
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేసింది. నిజానికి…