ఉగాది, రంజాన్ పండగల లాంగ్ వీకెండ్ మొదటి అంకానికి తెరలేచింది. మార్చిలో కోర్ట్ తప్పించి చెప్పుకోదగ్గ విజయం సాధించిన సినిమాలేవీ లేకపోవడంతో అందరి దృష్టి కొత్త రిలీజుల మీదుంది. సాంప్రదాయ శుక్రవారానికి భిన్నంగా ఒక రోజు ముందే రెండు డబ్బింగ్ రిలీజులు రావడం ఆసక్తి రేపింది. ఇవాళ రెండు అనువాదాలు టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద తలపడుతున్నాయి. వాటిలో మొదటిది ఎల్2 ఎంపురాన్. లూసిఫర్ కొనసాగింపుగా రూపొందిన ఈ గ్యాంగ్ స్టర్ డ్రామా కోసం జరిగిన తెలుగు ప్రమోషన్లు మంచి బజ్ తీసుకొచ్చాయి. అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా కోటి దాకా గ్రాస్ వచ్చినట్టు ట్రేడ్ టాక్.
పాజిటివ్ టాక్ వస్తే ఆటోమేటిక్ గా మన ప్రేక్షకులు ఆదరిస్తారని చెప్పడంలో డౌట్ లేదు. ప్రీమియర్స్ నుంచి వినిపిస్తున్న మాట సానుకూలంగానే ఉంది కానీ మధ్యాన్నంకి ఒక స్పష్టత వస్తుంది. ఇక విక్రమ్ వీరధీరశూర పార్ట్ 2కి చివరి నిమిషం ఆర్థిక చిక్కుల వల్ల వ్యవహారం కోర్టుకు వెళ్లడంతో ఉదయం 11 గంటల లోపు షోలు పడే పరిస్థితి లేదు. ఇది ఓపెనింగ్స్ మీద ప్రభావం చూపనుంది. అదేం దురదృష్టమో కానీ గత ఏడాది తంగలాన్ కూడా ఇలాంటి సమస్యల్లోనే ఇరుక్కుని ఆలస్యంగా రిలీజైన సంగతి తెలిసిందే. విక్రమ్ కే ఎందుకు ఇలా జరుగుతోందని అభిమానులు తెగ బాధ పడుతున్నారు.
బజ్ విషయానికి వస్తే ఎల్2 ఎంపురాన్ ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది. తమిళనాడులో మినహాయించి మిగిలిన చోట పూర్తి డామినేషన్ చూపిస్తున్నాడు. కాకపోతే మన దగ్గర రేపు రిలీజయ్యే మ్యాడ్ స్క్వేర్, రాబిన్ హుడ్ టాక్ ని బట్టి ఎల్2 వసూళ్లు రాబట్టడం ఆధారపడి ఉంది. ఒక రోజు అడ్వాంటేజ్ వాడుకుంటూ ఏపీ తెలంగాణలో ఈ ఒక్క రోజే భారీ ఎత్తున స్క్రీన్లు దక్కించుకున్న మోహన్ లాల్ టాక్, రివ్యూస్ కోసం ఎదురు చూడాలి. ఇక ఆదివారం సల్మాన్ ఖాన్ సికందర్ కూడా వస్తోంది. మొత్తానికి సంక్రాంతి తర్వాత ఒకేసారి నాలుగైదు సినిమాలు తెస్తున్న సీజన్ గా మార్చి చివరి వారం ఎలాంటి ముగింపు ఇస్తుందో చూడాలి.
ఏపీ సీఎం చంద్రబాబు.. మరోసారి వైసీపీపై నిప్పులు చెరిగారు. గత ఐదేళ్ల కాలంలో గొడ్డలి పార్టీ(వైసీపీ) రాష్ట్రాన్ని ధ్వంసం చేయడం..…
ఏపీలో అంతకంతకూ పెరిగిపోతున్న కుల భావనపైనా, విపక్షాలు నిత్యం ఆరోపణలు గుప్పిస్తున్న శాంతి భద్రతల మీద జనసేన అధినేత, డిప్యూటీ…
వందల కోట్లతో తీసినా, తక్కువ బడ్జెట్ లో పూర్తి చేసినా ఏదైనా సినిమానే. వేసేది ప్రొజెక్టర్ వాడే తెరపైనే. చిన్నాపెద్దా…
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే రాశీ సింగ్ లేటెస్ట్ గా షేర్ చేసిన ఫోటోలు భలే ఆకట్టుకుంటున్నాయి.…
తమ సినిమాల మీద, దాని కోసం పనిచేసిన ఆర్టిస్టులు, టెక్నీషియన్ల మీద ఆయా చిత్ర బృందాలకు అపారమైన నమ్మకం ఉండొచ్చు.…
ఇరాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. తమ పరిధిలో ప్రపంచ వాణిజ్య నౌకారవాణాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధిని మూసి వేస్తున్నట్టు…