ఉగాది, రంజాన్ పండగల లాంగ్ వీకెండ్ మొదటి అంకానికి తెరలేచింది. మార్చిలో కోర్ట్ తప్పించి చెప్పుకోదగ్గ విజయం సాధించిన సినిమాలేవీ లేకపోవడంతో అందరి దృష్టి కొత్త రిలీజుల మీదుంది. సాంప్రదాయ శుక్రవారానికి భిన్నంగా ఒక రోజు ముందే రెండు డబ్బింగ్ రిలీజులు రావడం ఆసక్తి రేపింది. ఇవాళ రెండు అనువాదాలు టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద తలపడుతున్నాయి. వాటిలో మొదటిది ఎల్2 ఎంపురాన్. లూసిఫర్ కొనసాగింపుగా రూపొందిన ఈ గ్యాంగ్ స్టర్ డ్రామా కోసం జరిగిన తెలుగు ప్రమోషన్లు మంచి బజ్ తీసుకొచ్చాయి. అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా కోటి దాకా గ్రాస్ వచ్చినట్టు ట్రేడ్ టాక్.
పాజిటివ్ టాక్ వస్తే ఆటోమేటిక్ గా మన ప్రేక్షకులు ఆదరిస్తారని చెప్పడంలో డౌట్ లేదు. ప్రీమియర్స్ నుంచి వినిపిస్తున్న మాట సానుకూలంగానే ఉంది కానీ మధ్యాన్నంకి ఒక స్పష్టత వస్తుంది. ఇక విక్రమ్ వీరధీరశూర పార్ట్ 2కి చివరి నిమిషం ఆర్థిక చిక్కుల వల్ల వ్యవహారం కోర్టుకు వెళ్లడంతో ఉదయం 11 గంటల లోపు షోలు పడే పరిస్థితి లేదు. ఇది ఓపెనింగ్స్ మీద ప్రభావం చూపనుంది. అదేం దురదృష్టమో కానీ గత ఏడాది తంగలాన్ కూడా ఇలాంటి సమస్యల్లోనే ఇరుక్కుని ఆలస్యంగా రిలీజైన సంగతి తెలిసిందే. విక్రమ్ కే ఎందుకు ఇలా జరుగుతోందని అభిమానులు తెగ బాధ పడుతున్నారు.
బజ్ విషయానికి వస్తే ఎల్2 ఎంపురాన్ ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది. తమిళనాడులో మినహాయించి మిగిలిన చోట పూర్తి డామినేషన్ చూపిస్తున్నాడు. కాకపోతే మన దగ్గర రేపు రిలీజయ్యే మ్యాడ్ స్క్వేర్, రాబిన్ హుడ్ టాక్ ని బట్టి ఎల్2 వసూళ్లు రాబట్టడం ఆధారపడి ఉంది. ఒక రోజు అడ్వాంటేజ్ వాడుకుంటూ ఏపీ తెలంగాణలో ఈ ఒక్క రోజే భారీ ఎత్తున స్క్రీన్లు దక్కించుకున్న మోహన్ లాల్ టాక్, రివ్యూస్ కోసం ఎదురు చూడాలి. ఇక ఆదివారం సల్మాన్ ఖాన్ సికందర్ కూడా వస్తోంది. మొత్తానికి సంక్రాంతి తర్వాత ఒకేసారి నాలుగైదు సినిమాలు తెస్తున్న సీజన్ గా మార్చి చివరి వారం ఎలాంటి ముగింపు ఇస్తుందో చూడాలి.
This post was last modified on March 27, 2025 8:10 am
మాములుగా ఒక సినిమా రిలీజయ్యాక దాని ఫలితంతో సంబంధం లేకుండా సక్సెస్ మీట్ల పేరుతో బాణా సంచా కాల్చడం, మీడియా…
ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ మంత్రి నారా లోకేష్.. మంగళవారం మధ్యాహ్నం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో…
ఏపీలో అరటి పండ్ల ధర ఎంత..? ఎందుకీ రాద్దాంతం..? అరటి రైతులు కష్టాలు పడుతున్నారంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు చర్చకు…
ఉప ముఖ్యమంత్రి మాటలను వక్రీకరించ వద్దంటూ జనసేన ఓ పార్టీ ప్రకటన విడుదల చేసింది. కొద్దిరోజుల కిందట పవన్ కళ్యాణ్…
దేశంలో పురాతన, బ్రిటీష్ కాలం నాటి పేర్లను, ఊర్లను కూడా మారుస్తున్న కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వం…
ఏపీ రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి మహానగరంగా నిర్మించాలని నిర్ణయించుకున్న సీఎం చంద్రబాబు.. ఆదిశగా వడి వడిగా అడుగులు వేస్తున్నారు.…