మూడేళ్ళ క్రితం వచ్చి వెళ్లిపోయిన గాడ్ ఫాదర్ ప్రస్తావన ఇప్పుడెందుకు అనుకుంటున్నారా. ఎల్2 ఎంపురాన్ రిలీజ్ వేళ మోహన్ లాల్ కు దీనికి సంబంధించిన ప్రశ్నలు ఎదురవుతున్నాయి. 2022లో లూసిఫర్ రీమేక్ గా రూపొందిన గాడ్ ఫాదర్ మీద చిరంజీవి ఎన్నో ఆశలు పెట్టుకుని దర్శకులను మార్చుకుంటూ వచ్చారు. ముందు సుజిత్ తో ఒక వెర్షన్ రాయించారు. తర్వాత సుకుమార్ సలహాలు తీసుకున్నారు. ఒక దశ దాటాక వివి వినాయక్ వచ్చాడని ప్రచారం జరిగింది. తర్వాత బాబీని స్వయంగా మెగాస్టారే అడిగారు. ఫైనల్ గా మోహన్ రాజా చేతికొచ్చింది. ఎంతో ఊహించుకుంటే యావరేజ్ దగ్గర ఆగిపోయింది.
లూసిఫర్ ఫలితం రిపీట్ కాకపోవడానికి ప్రధాన కారణం కొన్ని పాత్రలను తీసేసి మార్పులు చేయడమేనని మోహన్ లాల్ అభిప్రాయపడ్డారు. ఇది నిజమే. ఎందుకంటే ఒరిజినల్ వెర్షన్ సెకండాఫ్ లో హీరో తమ్ముడిగా సీఎం పాత్రలో ఎంట్రీ ఇచ్చే టోవినో థామస్ ఎపిసోడ్ చాలా బాగుంటుంది. దాన్ని రామ్ చరణ్ తోనో లేదా సాయిధరమ్ తేజ్ తోనో చేయించి ఉంటే నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళేది. కానీ అది పూర్తిగా తీసేసి చిరు, నయనతారల మీద ట్రాక్ నడపడంతో సోల్ పోయింది. దీంతో రెండో సగం భారంగా, ఎగ్జైట్ మెంట్ లేకుండా సాగుతుంది. ఇంటర్వెల్ దాకా ఉన్న గూస్ బంప్స్ తర్వాత ఆగిపోతాయి.
ఒకవేళ యధాతథంగా తీసి ఉంటే ఇప్పుడు ఎల్2 ఎంపురాన్ ని గాడ్ ఫాదర్ 2గా తీసే ఛాన్స్ దొరికేది. చిరంజీవి వయసుకు తగ్గట్టు ఇచ్చిన ఎలివేషన్లు, తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, డ్యూయెట్లు లేకుండా సీరియస్ టోన్ కు కట్టుబడిన విధానం గాడ్ ఫాదర్ ని బెస్ట్ మూవీగా మలచలేకపోయాయి. సో ఎల్2ని రీమేక్ చేయాలన్నా ఛాన్స్ లేకుండా పోయింది. మోహన్ లాల్ మాత్రం సీక్వెల్ తో తెలుగులోనూ పెద్ద హిట్టు కొడతాననే నమ్మకంతో ఉన్నారు. ఫస్ట్ పార్ట్ డబ్బింగ్ వెర్షన్ థియేటర్ వెర్షన్ లో జరిగిన నిర్లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రమోషన్ల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఎల్లుండికి బాక్సాఫీస్ తీర్పు వచ్చేస్తుంది.
This post was last modified on March 25, 2025 7:04 pm
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…