మూడేళ్ళ క్రితం వచ్చి వెళ్లిపోయిన గాడ్ ఫాదర్ ప్రస్తావన ఇప్పుడెందుకు అనుకుంటున్నారా. ఎల్2 ఎంపురాన్ రిలీజ్ వేళ మోహన్ లాల్ కు దీనికి సంబంధించిన ప్రశ్నలు ఎదురవుతున్నాయి. 2022లో లూసిఫర్ రీమేక్ గా రూపొందిన గాడ్ ఫాదర్ మీద చిరంజీవి ఎన్నో ఆశలు పెట్టుకుని దర్శకులను మార్చుకుంటూ వచ్చారు. ముందు సుజిత్ తో ఒక వెర్షన్ రాయించారు. తర్వాత సుకుమార్ సలహాలు తీసుకున్నారు. ఒక దశ దాటాక వివి వినాయక్ వచ్చాడని ప్రచారం జరిగింది. తర్వాత బాబీని స్వయంగా మెగాస్టారే అడిగారు. ఫైనల్ గా మోహన్ రాజా చేతికొచ్చింది. ఎంతో ఊహించుకుంటే యావరేజ్ దగ్గర ఆగిపోయింది.
లూసిఫర్ ఫలితం రిపీట్ కాకపోవడానికి ప్రధాన కారణం కొన్ని పాత్రలను తీసేసి మార్పులు చేయడమేనని మోహన్ లాల్ అభిప్రాయపడ్డారు. ఇది నిజమే. ఎందుకంటే ఒరిజినల్ వెర్షన్ సెకండాఫ్ లో హీరో తమ్ముడిగా సీఎం పాత్రలో ఎంట్రీ ఇచ్చే టోవినో థామస్ ఎపిసోడ్ చాలా బాగుంటుంది. దాన్ని రామ్ చరణ్ తోనో లేదా సాయిధరమ్ తేజ్ తోనో చేయించి ఉంటే నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళేది. కానీ అది పూర్తిగా తీసేసి చిరు, నయనతారల మీద ట్రాక్ నడపడంతో సోల్ పోయింది. దీంతో రెండో సగం భారంగా, ఎగ్జైట్ మెంట్ లేకుండా సాగుతుంది. ఇంటర్వెల్ దాకా ఉన్న గూస్ బంప్స్ తర్వాత ఆగిపోతాయి.
ఒకవేళ యధాతథంగా తీసి ఉంటే ఇప్పుడు ఎల్2 ఎంపురాన్ ని గాడ్ ఫాదర్ 2గా తీసే ఛాన్స్ దొరికేది. చిరంజీవి వయసుకు తగ్గట్టు ఇచ్చిన ఎలివేషన్లు, తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, డ్యూయెట్లు లేకుండా సీరియస్ టోన్ కు కట్టుబడిన విధానం గాడ్ ఫాదర్ ని బెస్ట్ మూవీగా మలచలేకపోయాయి. సో ఎల్2ని రీమేక్ చేయాలన్నా ఛాన్స్ లేకుండా పోయింది. మోహన్ లాల్ మాత్రం సీక్వెల్ తో తెలుగులోనూ పెద్ద హిట్టు కొడతాననే నమ్మకంతో ఉన్నారు. ఫస్ట్ పార్ట్ డబ్బింగ్ వెర్షన్ థియేటర్ వెర్షన్ లో జరిగిన నిర్లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రమోషన్ల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఎల్లుండికి బాక్సాఫీస్ తీర్పు వచ్చేస్తుంది.
This post was last modified on March 25, 2025 7:04 pm
బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్ల తర్వాత సూర్య సినిమాలు వరసగా రాబోతున్నాయి. వాటిలో మొదటిది వీరభద్రుడు. తమిళంలో కరుప్పుగా రూపొందిన…
సొంత పార్టీ నాయకుడు తప్పు చేస్తే ఒకవిధంగా.. ప్రత్యర్థి పార్టీ నేతలు తప్పులు చేస్తే మరో విధంగా మారి పోయిన…
మే 1 విడుదల కాబోతున్న గాయపడ్డ సింహం మీద టీమ్ కన్నా ఎక్కువగా బయ్యర్ వర్గాలు ఎదురు చూస్తున్నాయి. ఎందుకంటే…
వెనకటికి పాత కథ ఒకటుంది. ఒక రొట్టె కోసం రెండు పిల్లులు పోట్లాడుకుంటే తీర్పు చెప్పడానికి వచ్చిన కోతి దాన్ని…
చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేసే సాయిపల్లవి కాంబోల కన్నా ఎక్కువగా కంటెంట్ కి ప్రాధాన్యం ఇవ్వడం అందరికీ తెలిసిన…
గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే గళ్లా మాధవి తీసుకున్న వినూత్న నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. బీకాం చదువుకున్న ఓ…