ఒక పెద్ద నటుడి కుటుంబం నుంచి ఒకరు నటనలోకి వస్తే.. ఆటోమేటిగ్గా వాళ్లు ఫేమస్ అయిపోతారు. కానీ కొందరు మాత్రం ఇలాంటి గుర్తింపు కోరుకోకుండా సొంతంగా ఎదగాలని చూస్తారు. బాలీవుడ్లో పెద్ద సూపర్ స్టార్ అయినప్పటికీ సింప్లిసిటీకి మారు పేరుగా ఉండే ఆమిర్ ఖాన్.. తన సోదరిని కూడా నటనలోకి తీసుకొచ్చిన విషయం చాలా మందికి తెలియదు. ఆమె పేరు నిఖత్ ఖాన్. సంతోష్ హెగ్డే అనే హిందును పెళ్లాడిన ఆమె నిఖత్ హెగ్డేగా మారారు. 90వ దశకంలో ఆమె నిర్మాతగా ఇండస్ట్రీలోకి రంగప్రవేశం చేశారు. తర్వాత మోడలింగ్ చేశారు. పదుల సంఖ్యలో బ్రాండ్స్కు ప్రచారం చేశారు. కొన్నేళ్ల నుంచి ఆమె నటిగా సినిమాలు చేస్తున్నారు.
‘పఠాన్’ సహా పలు చిత్రాల్లో నటించారు. ఈ క్రమంలోనే మోహన్ లాల్ సినిమా ‘ఎల్-2: ఎంపురాన్’లో కూడా నటించారు. ఐతే నిఖత్.. ఆమిర్ ఖాన్ సోదరి అనే విషయం ఆడిషన్లో ఈ సినిమా కోసం ఎంపికయ్యే వరకు తనకు తెలియదని దర్శకుడు, నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ వెల్లడించడం విశేషం. నిఖిత్ తనెవరో చెప్పకుండానే ఆడిషన్కు హాజరైందని పృథ్వీరాజ్ తెలిపాడు.
ఆడిషన్స్ అయ్యాక ఆమె పెర్ఫామెన్స్ నచ్చి తనను సినిమాలోకి తీసుకోవాలని తన కాస్టింగ్ డైరెక్టర్కు చెప్పానని.. అప్పుడే ఆమె ఆమిర్ సోదరి అనే విషయం తనకు చెప్పిందని పృథ్వీరాజ్ వెల్లడించాడు. ఆమిర్ తనకు బాగానే పరిచయం అని.. కానీ ఆయన చెల్లెలు నటి అని, తన సినిమాలో నటించడానికి ఆడిషన్ చేసిందని మాత్రం తెలియదని.. అప్పుడు షాకయ్యానని పృథ్వీరాజ్ చెప్పాడు. వెంటనే ఆమిర్కు ఫోన్ చేసి మాట్లాడానని.. నా సోదరి బాగానే చేస్తోందా అని అడిగితే.. ఆమె బెస్ట్ అని చెప్పినట్లు పృథ్వీరాజ్ వెల్లడించాడు. బ్లాక్ బస్టర్ మూవీ ‘లూసిఫర్’కు సీక్వెల్గా తెరకెక్కిన ‘ఎల్-2: ఎంపురాన్’ ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.
This post was last modified on March 21, 2025 7:50 pm
గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…
కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…
బీఆర్ ఎస్ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్రావు.. తన ఇంటిని తాకట్టు పెట్టారు. బ్యాంకు అధికారుల వద్దుకు…
పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…