ఎనర్జిటిక్ స్టార్ రామ్, మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ఫేమ్ మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ పరుగులు పెడుతోంది. ఇప్పటికే కొన్నిషెడ్యూల్స్ పూర్తి చేశారు. హీరోతో పాటు హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సేకు సంబంధించిన ఎపిసోడ్స్ ఆల్రెడీ అయిపోయాయని సమాచారం. దీనికి ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ టైటిల్ ఫిక్స్ చేసినట్టు గత వారం నుంచే ప్రచారం జరుగుతోంది. టీమ్ ఖండించడం కానీ యూనిట్ సమర్ధించడం కానీ చేయలేదు కానీ ఫిలిం ఛాంబర్ లో మైత్రి మూవీ మేకర్స్ సంస్థ రిజిస్టర్ చేసినట్టు తెలిసింది. ఇక్కడ అసలు పాయింట్ అది కాదు. ఆంధ్రా కింగ్ అంటే ఎవరు అని.
మాములుగా ఫ్యాన్స్ అది రామ్ ని ఉద్దేశించిందే అనుకుంటారు. కానీ ఇన్ సైడ్ టాక్ ప్రకారం ఇందులో ఆంధ్రా కింగ్ అంటే ఒక సీనియర్ హీరోని ఉద్దేశించినది. ఆయన తాలూకానే మన రామ్ అన్న మాట. అంటే మల్టీస్టారరని వేరే చెప్పనక్కర్లేదు. అయితే ఆ రెండో పాత్ర పోషించే నటుడు ఎవరో ఇప్పటి దాకా లీక్ కాలేదు. తాజా అప్డేట్ ప్రకారం దానికి మోహన్ లాల్ దాదాపుగా అంగీకారం తెలిపినట్టు వినికిడి. దర్శకుడు మహేష్ బాబు ముందు కమల్ హాసన్ ఆ తర్వాత బాలకృష్ణని చాలా ప్రయత్నించాడట. కానీ డేట్లతో పాటు ఇతరత్రా కారణాలతో చివరికి కంప్లీట్ యాక్టర్ లాలెట్టన్ మోహన్ లాల్ ని వరించింది.
అధికారికంగా ఇంకా ప్రకటించలేదు కానీ కాల్ షీట్లు నిర్ధారించుకున్నాక అనౌన్స్ మెంట్ చేసే ఛాన్స్ ఉంది. పల్లెటూరి నేపథ్యం, టౌన్ కాలేజీ, అభిమాన హీరో మీద పిచ్చి, క్యూట్ లవ్ స్టోరీ ఇలా రకరకాల అంశాల చుట్టూ మహేష్ బాబు ఎమోషన్స్, ఎంటర్ టైన్మెంట్ రెండూ మిక్స్ చేసి సబ్జెక్టు రాసుకున్నాడట. అవసరానికి మించిన మాస్ జోలికి వెళ్లి వరుస డిజాస్టర్లు చూసిన రామ్ తిరిగి తన పాత స్కూల్ కు వచ్చినట్టు ఆల్రెడీ వర్కింగ్ స్టిల్స్ చెప్పేశాయి. తనకు సూటయ్యే పక్కింటి అబ్బాయి పాత్రలో మెప్పిస్తాడని టీమ్ అంటోంది. ఈ ఏడాది ద్వితీయార్థంలోనే విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇంకా డిసైడ్ కాలేదు.
This post was last modified on March 21, 2025 12:09 pm
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…
సరైన భద్రత ఏర్పాట్లు చేయకుండా సినిమా, రాజకీయ ఈవెంట్లు పెడితే ఏం జరుగుతుందో.. ఎప్పటికప్పుడు ఉదాహరణలు చూస్తూనే ఉన్నాం. అయినా…