ఆ మధ్య ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నిర్మాత ఎస్కెఎన్ మాట్లాడుతూ తెలుగమ్మాయిలకు అవకాశాలు ఇవ్వడం పెద్ద పొరపాటనే తరహాలో కామెంట్ చేయడం సోషల్ మీడియాలో చిన్నపాటి దుమారం రేపింది. అయన అన్నది వైష్ణవి చైతన్యనని రకరకాల అర్థాలు తీసేశారు నెటిజెన్లు. దానికి కారణం లేకపోలేదు. బేబీ కాంబినేషన్ ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా ఎస్కెఎన్ ఒక సినిమా ప్లాన్ చేసుకుంటే తర్వాత అదే కాంబో వేరే బ్యానర్ కు వెళ్ళిపోయింది. దీంతో ఆయన హర్ట్ అయిపోయి అలా అన్నాడనే కోణంలో అనాలిసిస్ చేశారు. తర్వాత ఆ ఉద్దేశంతో అనలేదని ఎస్కెఎన్ క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
తాజాగా జాక్ సాంగ్ లాంచ్ ఈవెంట్ లో వైష్ణవి చైతన్య ఈ వివాదం గురించి మాట్లాడింది. బేబీ టీమ్ తో పని చేయడం గొప్ప ఎక్స్ పీరియన్స్ అని, దురదృష్టవశాత్తు ఆ ప్రాజెక్టు ముందుకెళ్లలేదు తప్పించి ఎస్కెఎన్ ఎవరిని అన్నారో తెలియదని, ఆ మాటకొస్తే దాని గురించి వివరణ ఇస్తూ ఆయన వీడియో విడుదల చేసింది గుర్తు చేసింది. ఏదైతేనేం మొత్తానికి కాంట్రావర్సి ఇక్కడితో ఆగిందని చెప్పాలి. అయినా ఇండస్ట్రీలో తరచుగా ఇలాంటి మార్పులు చేర్పులు సహజమే. ఒక జంట సంస్థ మారడానికి రకరకాల కారణాలు ఉండొచ్చు. అవన్నీ బయటికి రావు. రానప్పుడే ఊహాజనిత కథనాలు చక్కర్లు కొడతాయి.
ఇక వైష్ణవి చైతన్యకు జాక్ సక్సెస్ చాలా ముఖ్యం. ఎందుకంటే బేబీ తీసుకొచ్చిన ఇమేజ్ నిలబెట్టుకోవాలంటే హిట్లు పడాలి. ఆశిష్ తో చేసిన లవ్ మీ ఇఫ్ యు డేర్ దారుణంగా పోయింది. తర్వాత చేస్తున్న సినిమా జాకే. సిద్దు జొన్నలగడ్డ లాంటి క్రేజీ హీరోతో డ్యూయల్ రోల్ చేసే ఛాన్స్ దక్కడం మాములు విషయం కాదు. వర్కౌట్ అయితే మంచి ఆఫర్లు తలుపు తడతాయి. ఇంకా టయర్ 1, 2 హీరోల దృష్టిలో పడని ఈ బేబీ భామకు జాక్ ఇవ్వబోయే బ్రేక్ ఎలా ఉంటుందో చూడాలి. తన డెబ్యూకి భిన్నంగా మంచి లవబుల్ పాత్ర దక్కిందని చెబుతున్న వైష్ణవి చైతన్య ఇందులోనూ పెర్ఫార్మన్స్ డిమాండ్ చేసే క్యారెక్టరే దక్కిందట.
This post was last modified on March 20, 2025 5:19 pm
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…
మలయాళంలో దృశ్యం 3 షూటింగ్ అయిపోయింది. మోహన్ లాల్ సహకారంతో దర్శకుడు జీతూ జోసెఫ్ చాలా వేగంగా పూర్తి చేసి…