మురుగదాస్ అనే పేరు ఒకప్పుడు ఒక బ్రాండ్. హీరోలు ఎవరన్నది సంబంధం లేకుండా ఆయన పేరు మీదే సినిమాలకు బిజినెస్ అయిపోయేది. రమణ (తెలుగులో ఠాగూర్), గజిని, తుపాకి, కత్తి లాంటి బ్లాక్బస్టర్లు అందించిన దర్శకుడతను. ఐతే గత కొన్నేళ్లలో మురుగదాస్ నుంచి స్థాయికి తగ్గ సినిమాలు రాలేదు. మన మహేష్ బాబుతో చేసిన ‘స్పైడర్’తో ఆయన పతనం మొదలైంది.
ఆ తర్వాత సర్కార్, దర్బార్ లాంటి మామూలు సినిమాలొచ్చాయి మురుగదాస్ నుంచి. ఐతే మళ్లీ విజయ్తో మురుగదాస్ జట్టు కడుతుండటంతో ఈసారి ఆయన్నుంచి బ్లాక్బస్టర్ ఖాయమన్న అంచనాలతో ఉన్నారు అభిమానులు. ఈ చిత్రం ‘తుపాకి’కి సీక్వెల్ అని కూడా ప్రచారం జరిగింది. విజయ్, మురుగదాస్ కాంబినేషన్ నుంచి ఇంతకుముందే అధికారిక సమాచారం కూడా బయటికి వచ్చింది. ఇక సినిమా పట్టాలెక్కడమే తరువాయి అనుకుంటున్నారంతా.
కానీ ఇప్పుడు అనూహ్యంగా మురుగదాస్ ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ చిత్రాన్ని నిర్మించనున్న సన్ పిక్చర్స్ అధినేతల్ని మురుగదాస్ కథ మెప్పించలేకపోయిందట. విజయ్ సైతం అంత సంతృప్తిగా లేకపోవడంతో మురుగదాస్ తనకు తానుగా ఈ సినిమా నుంచి తప్పుకున్నాడట. విజయ్ డేట్లు తమ దగ్గరుండటంతో మురుగదాస్ స్థానంలో మరో దర్శకుడిని తీసుకొచ్చి సినిమా చేయించడానికి సన్ పిక్చర్స్ ప్రయత్నిస్తోంది.
వెట్రిమారన్ కోసం ట్రై చేయగా.. ఆయన ఖాళీ లేడని తెలిసింది. దీంతో గత ఏడాది ‘తడమ్’ సినిమాతో ఆకట్టుకున్న మగిల్ తిరుమణిని సంప్రదిస్తున్నారట. మగిల్ ఇప్పటిదాకా చిన్న, మీడియం రేంజ్ సినిమాలే చేశాడు. ఐతే ‘తడమ్’ చాలా పెద్ద హిట్టయింది. ఈ చిత్రం తెలుగులో ‘రెడ్’ పేరుతో రీమేక్ అయ్యింది కూడా. ‘మాస్టర్’ను పూర్తి చేసి ఖాళీగా ఉన్న విజయ్ మన తెలుగమ్మాయే అయిన ‘ఆకాశం నీ హద్దురా’ దర్శకురాలు సుధ కొంగరతోనూ ఓ సినిమాకు కమిట్మెంట్ ఇచ్చాడు.
This post was last modified on October 28, 2020 8:28 am
నిన్న విడుదలైన ది రాజా సాబ్ అభిమానుల అంచనాలకు తగ్గట్టే సెంచరీతో ఓపెనింగ్స్ మొదలుపెట్టింది. నిర్మాత విశ్వప్రసాద్ సక్సెస్ మీట్…
సెన్సార్ ఇష్యూతో పాటు థియేటర్ల కొరత కారణంగా తమిళ మూవీ పరాశక్తి మన దగ్గర విడుదల కాలేదు. ఒక వారం…
రేపు రాత్రి ప్రీమియర్లతో విడుదల కాబోతున్న మన శంకరవరప్రసాద్ గారు మీద ఆల్రెడీ ఉన్న బజ్ మరింత పెరిగే దిశగా…
పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…
తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…
ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…