మురుగదాస్ అనే పేరు ఒకప్పుడు ఒక బ్రాండ్. హీరోలు ఎవరన్నది సంబంధం లేకుండా ఆయన పేరు మీదే సినిమాలకు బిజినెస్ అయిపోయేది. రమణ (తెలుగులో ఠాగూర్), గజిని, తుపాకి, కత్తి లాంటి బ్లాక్బస్టర్లు అందించిన దర్శకుడతను. ఐతే గత కొన్నేళ్లలో మురుగదాస్ నుంచి స్థాయికి తగ్గ సినిమాలు రాలేదు. మన మహేష్ బాబుతో చేసిన ‘స్పైడర్’తో ఆయన పతనం మొదలైంది.
ఆ తర్వాత సర్కార్, దర్బార్ లాంటి మామూలు సినిమాలొచ్చాయి మురుగదాస్ నుంచి. ఐతే మళ్లీ విజయ్తో మురుగదాస్ జట్టు కడుతుండటంతో ఈసారి ఆయన్నుంచి బ్లాక్బస్టర్ ఖాయమన్న అంచనాలతో ఉన్నారు అభిమానులు. ఈ చిత్రం ‘తుపాకి’కి సీక్వెల్ అని కూడా ప్రచారం జరిగింది. విజయ్, మురుగదాస్ కాంబినేషన్ నుంచి ఇంతకుముందే అధికారిక సమాచారం కూడా బయటికి వచ్చింది. ఇక సినిమా పట్టాలెక్కడమే తరువాయి అనుకుంటున్నారంతా.
కానీ ఇప్పుడు అనూహ్యంగా మురుగదాస్ ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ చిత్రాన్ని నిర్మించనున్న సన్ పిక్చర్స్ అధినేతల్ని మురుగదాస్ కథ మెప్పించలేకపోయిందట. విజయ్ సైతం అంత సంతృప్తిగా లేకపోవడంతో మురుగదాస్ తనకు తానుగా ఈ సినిమా నుంచి తప్పుకున్నాడట. విజయ్ డేట్లు తమ దగ్గరుండటంతో మురుగదాస్ స్థానంలో మరో దర్శకుడిని తీసుకొచ్చి సినిమా చేయించడానికి సన్ పిక్చర్స్ ప్రయత్నిస్తోంది.
వెట్రిమారన్ కోసం ట్రై చేయగా.. ఆయన ఖాళీ లేడని తెలిసింది. దీంతో గత ఏడాది ‘తడమ్’ సినిమాతో ఆకట్టుకున్న మగిల్ తిరుమణిని సంప్రదిస్తున్నారట. మగిల్ ఇప్పటిదాకా చిన్న, మీడియం రేంజ్ సినిమాలే చేశాడు. ఐతే ‘తడమ్’ చాలా పెద్ద హిట్టయింది. ఈ చిత్రం తెలుగులో ‘రెడ్’ పేరుతో రీమేక్ అయ్యింది కూడా. ‘మాస్టర్’ను పూర్తి చేసి ఖాళీగా ఉన్న విజయ్ మన తెలుగమ్మాయే అయిన ‘ఆకాశం నీ హద్దురా’ దర్శకురాలు సుధ కొంగరతోనూ ఓ సినిమాకు కమిట్మెంట్ ఇచ్చాడు.
This post was last modified on October 28, 2020 8:28 am
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…