సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ ఈ సంక్రాంతికి ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంలో సెన్సేషనల్ హిట్ కొట్టారు. మిడ్ రేంజ్ బడ్జెట్లో తెరకెక్కిన ఈ ఫ్యామిలీ మూవీ ఏకంగా రూ.300 కోట్ల వసూళ్లు రాబట్టి ట్రేడ్ వర్గాలను షాక్కు గురి చేసింది. చాలా ఏళ్లుగా నంబర్స్ గేమ్లో బాగా వెనుకబడిపోయిన వెంకీ.. ఈ చిత్రంతో తన సత్తాను చూపించారు. దీంతో ఆయన తర్వాత చేయబోయే సినిమా పట్ల అభిమానుల్లో అమితాసక్తి నెలకొంది. ఐతే వెంకీ ఒక ఫామ్లో లేని దర్శకుడితో జట్టు కట్టబోతున్నట్లు వార్తలు రావడంతో ఫ్యాన్స్ కొంచెం షాకయ్యారు. ఆ దర్శకుడే సురేందర్ రెడ్డి.
ఒకప్పుడు అతనొక్కడే, కిక్, రేసు గుర్రం లాంటి బ్లాక్ బస్టర్లు ఇచ్చిన సురేందర్కు చాలా ఏళ్లుగా సరైన విజయం లేదు. చివరి చిత్రం ‘ఏజెంట్’ పెద్ద డిజాస్టర్ అయింది. దాని కంటే ముందు చేసిన ‘సైరా’ ఓ మోస్తరుగా ఆడింది. అంతకుముందు తీసిన ‘కిక్-2’ కూడా డిజాస్టరే. ‘ఏజెంట్’ తర్వాత అడ్రస్ లేకుండా పోయిన సురేందర్.. వెంకీ కోసం ఒక యాక్షన్ ఎంటర్టైనర్ కథ రెడీ చేశాడని.. వెంకీ కూడా ఈ సినిమా చేయడానికి సుముఖంగానే ఉన్నాడని వార్తలు వచ్చాయి. ఐతే ‘సంక్రాంతికి వస్తున్నాం’తో మంచి ఊపుమీదున్న వెంకీ.. ఫాంలో లేని సూరితో జట్టు కట్టడం అవసరమా.. అయినా తన శైలిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్లు చేసుకోక, యాక్షన్ సినిమాలు ఎందుకు అనే ప్రశ్నలు తలెత్తాయి.
ఐతే ఇంకా ఆ ప్రాజెక్టు కన్ఫమ్ కాకముందే.. ఇప్పుడు వెంకీ అభిమానులను కంగారు పెట్టే మరో న్యూస్ తెరపైకి వచ్చింది. గతంలో వెంకీతో ‘లక్ష్మీ’ సినిమా తీసిన సీనియర్ దర్శకుడు వి.వి.వినాయక్ మళ్లీ ఆయనకో కథ చెప్పారని.. సంప్రదింపులు జరుగుతున్నాయని ప్రచారం జరుగుతోంది. వినాయక్ ఒకప్పుడు టాప్ డైరెక్టరే కానీ.. గత దశాబ్ద కాలంలో ఆయన ట్రాక్ రికార్డు ఘోరంగా. రీమేక్ అయిన ‘ఖైదీ నంబర్ 150’ని మినహాయిస్తే.. ‘ఛత్రపతి’ హిందీ రీమేక్, ఇంటిలిజెంట్ చిత్రాలతో దారుణంగా దెబ్బ తిన్నాడు. దీంతో ఆయనతో సినిమా చేయడానికి హీరోలు, నిర్మాతలు కొంచం ఆలోచిస్తున్నారు. ఇలాంటి స్థితిలో వెంకీతో ఆయన పేరు ముడిపడేసరికి ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు.
This post was last modified on March 11, 2025 5:25 am
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…