Movie News

అనుష్క, త్రిష మాత్రమే మిగిలారు

ఇప్పుడంతా ఓటీటీల రాజ్యం నడుస్తోంది. ఐతే అవి కేవలం సినిమాలను నమ్ముకోవట్లేదు. సొంతంగా ఒరిజినల్స్ పెద్ద ఎత్తున ప్రొడ్యూస్ చేస్తున్నాయి. దీంతో వెబ్ సిరీస్‌లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఏ ఓటీటీ అయినా ఎన్ని సినిమాలు కొని రిలీజ్ చేసినా.. సబ్‌స్క్రైబర్లను నిలబెట్టుకోవడానికి, వాళ్లను నిరంతరం ఎంగేజ్ చేస్తూ ఉండటానికి తమదంటూ ఒరిజినల్ కంటెంట్ ఇవ్వాల్సిందే. పెద్ద ఎత్తున వెబ్ సిరీస్‌లు ప్రొడ్యూస్ చేయాల్సిందే.

నెట్ ఫ్లిక్స్ నుంచి ఆహా వరకు అన్నీ అదే పని చేస్తున్నాయి. ఇందుకోసం భారీగా బడ్జెట్లు పెడుతున్నాయి. దీంతో ఇంతకుముందు వెబ్ సిరీస్‌లను తక్కువగా చూసిన వాళ్లు కూడా ఇప్పుడు ఆలోచన మార్చుకుంటున్నారు. దక్షిణాదిన స్టార్ హీరోయిన్లు ఒకరి తర్వాత ఒకరు డిజిటల్ డెబ్యూకు రెడీ అయిపోతుండటం విశేషం.

ఇప్పటికే సమంత ‘ఫ్యామిలీ మ్యాన్-2’తో వెబ్ సిరీస్‌ అరంగేట్రం చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో ఆమెది టెర్రరిస్టు పాత్ర అంటున్నారు. ‘ఫ్యామిలీ మ్యాన్-2’పై ముందు నుంచే మంచి అంచనాలుండగా, సమంత రాకతో ఆ అంచనాలు ఇంకా పెరిగాయి. మరోవైపు కాజల్, తమన్నా ఒకేసారి డిజిటల్ డెబ్యూకు రెడీ అయిపోయారు. వీళ్లిద్దరూ హాట్ స్టార్ కోసం వేర్వేరుగా సిరీస్‌లు చేస్తున్నారు.

ఇక సామ్, కాజల్, తమ్మూల తరానికి చెందిన మిగతా స్టార్ హీరోయిన్లలో నయనతార తన కొత్త చిత్రం ‘మూకుత్తి అమ్మన్’ ద్వారా డిజిటల్ డెబ్యూకు రెడీ అవుతోంది. ఈ చిత్రం దీపావళికి విడుదలవుతోంది. ఓటీటీ రిలీజ్ టార్గెట్‌తోనే ఈ సినిమా తెరకెక్కింది. నయన్ వెబ్ సిరీస్ చేయకపోయినా.. సినిమా ద్వారానే డిజిటల్ డెబ్యూకు రెడీ అవుతోంది. పైన చెప్పుకున్న నలుగురు సీనియర్ స్టార్ హీరోయిన్లూ వచ్చే రెండు నెలల్లోనే డిజిటల్ డెబ్యూ చేయబోతుండటం విశేషం. ఇంకా లైమ్ లైట్లో ఉన్న నిన్నటి తరం స్టార్ హీరోయిన్లలో అనుష్క, త్రిష మాత్రమే డిజిటల్ ఎంట్రీ ఇవ్వలేదు. త్వరలోనే వాళ్లు కూడా అటు వైపు చూస్తే ఆశ్చర్యం లేదు.

Satya

Recent Posts

గుర్తుకొస్తున్నాయి…: పవన్ ఇంట్రెస్టింగ్ ట్వీట్

పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్‌తో పాటు కనిపిస్తున్నది…

53 minutes ago

షో క్యాన్సిల్ చేసినందుకు కొరడా దెబ్బ

సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…

56 minutes ago

సిట్ అదుపులో CI నాగరాజు

ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…

2 hours ago

వెంటిలేటర్ పై ఉన్న పద్మనాభం గుర్తు లేరా జగన్?

వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…

2 hours ago

ఓడిన చోటే గెలిచి చూపించింది

శాకుంతలం విడుదలై డిజాస్టరైనప్పుడు దాని ఫలితానికి బాధ్యుడు దర్శకుడు గుణశేఖర్ అయినప్పటికీ టైటిల్ రోల్ పోషించిన సమంత కూడా విమర్శలను…

3 hours ago

చిరు లీక్ చేశాడు… నందిని కన్ఫమ్ చేసింది

మెగాస్టార్ చిరంజీవి సినిమా రహస్యాలను లీక్ చేయడంలో ఫేమస్ అన్న సంగతి తెలిసిందే. ‘ఆచార్య’ సినిమా టైటిల్‌ను అనుకోకుండా రివీల్…

4 hours ago