Movie News

అనుష్క, త్రిష మాత్రమే మిగిలారు

ఇప్పుడంతా ఓటీటీల రాజ్యం నడుస్తోంది. ఐతే అవి కేవలం సినిమాలను నమ్ముకోవట్లేదు. సొంతంగా ఒరిజినల్స్ పెద్ద ఎత్తున ప్రొడ్యూస్ చేస్తున్నాయి. దీంతో వెబ్ సిరీస్‌లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఏ ఓటీటీ అయినా ఎన్ని సినిమాలు కొని రిలీజ్ చేసినా.. సబ్‌స్క్రైబర్లను నిలబెట్టుకోవడానికి, వాళ్లను నిరంతరం ఎంగేజ్ చేస్తూ ఉండటానికి తమదంటూ ఒరిజినల్ కంటెంట్ ఇవ్వాల్సిందే. పెద్ద ఎత్తున వెబ్ సిరీస్‌లు ప్రొడ్యూస్ చేయాల్సిందే.

నెట్ ఫ్లిక్స్ నుంచి ఆహా వరకు అన్నీ అదే పని చేస్తున్నాయి. ఇందుకోసం భారీగా బడ్జెట్లు పెడుతున్నాయి. దీంతో ఇంతకుముందు వెబ్ సిరీస్‌లను తక్కువగా చూసిన వాళ్లు కూడా ఇప్పుడు ఆలోచన మార్చుకుంటున్నారు. దక్షిణాదిన స్టార్ హీరోయిన్లు ఒకరి తర్వాత ఒకరు డిజిటల్ డెబ్యూకు రెడీ అయిపోతుండటం విశేషం.

ఇప్పటికే సమంత ‘ఫ్యామిలీ మ్యాన్-2’తో వెబ్ సిరీస్‌ అరంగేట్రం చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో ఆమెది టెర్రరిస్టు పాత్ర అంటున్నారు. ‘ఫ్యామిలీ మ్యాన్-2’పై ముందు నుంచే మంచి అంచనాలుండగా, సమంత రాకతో ఆ అంచనాలు ఇంకా పెరిగాయి. మరోవైపు కాజల్, తమన్నా ఒకేసారి డిజిటల్ డెబ్యూకు రెడీ అయిపోయారు. వీళ్లిద్దరూ హాట్ స్టార్ కోసం వేర్వేరుగా సిరీస్‌లు చేస్తున్నారు.

ఇక సామ్, కాజల్, తమ్మూల తరానికి చెందిన మిగతా స్టార్ హీరోయిన్లలో నయనతార తన కొత్త చిత్రం ‘మూకుత్తి అమ్మన్’ ద్వారా డిజిటల్ డెబ్యూకు రెడీ అవుతోంది. ఈ చిత్రం దీపావళికి విడుదలవుతోంది. ఓటీటీ రిలీజ్ టార్గెట్‌తోనే ఈ సినిమా తెరకెక్కింది. నయన్ వెబ్ సిరీస్ చేయకపోయినా.. సినిమా ద్వారానే డిజిటల్ డెబ్యూకు రెడీ అవుతోంది. పైన చెప్పుకున్న నలుగురు సీనియర్ స్టార్ హీరోయిన్లూ వచ్చే రెండు నెలల్లోనే డిజిటల్ డెబ్యూ చేయబోతుండటం విశేషం. ఇంకా లైమ్ లైట్లో ఉన్న నిన్నటి తరం స్టార్ హీరోయిన్లలో అనుష్క, త్రిష మాత్రమే డిజిటల్ ఎంట్రీ ఇవ్వలేదు. త్వరలోనే వాళ్లు కూడా అటు వైపు చూస్తే ఆశ్చర్యం లేదు.

This post was last modified on October 26, 2020 7:08 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మలయాళంలో రేవంత్ సినిమా ఎలా నడుస్తోంది?

అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…

57 minutes ago

ఆ సీక్వెల్… నా వల్ల కాదు బాబోయ్

అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…

3 hours ago

నాడూ మూడే!… నేడూ మూడే!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…

6 hours ago

మోడీ ముందు జ‌గ‌న్ మ‌రింత‌ ప‌లుచ‌న‌!

ప్ర‌స్తుతం ఎవ‌రు ఔన‌న్నా.. కాద‌న్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజ‌కీయాల‌కు కూడా ప్ర‌ధాని మోడీ పెద్ద‌దిక్కుగా మారారన్నది వాస్త‌వం. ఆయ‌న‌ను…

7 hours ago

రాముడి పాత్ర వద్దన్న రణబీర్

ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్‌లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…

8 hours ago

దళిత క్రైస్తవుల విషయంలో జగన్ కన్నా షర్మిలే బెటర్?

వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్‌పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…

8 hours ago