విజయ్ దేవరకొండ, నిర్మాత దిల్ రాజుల కాంబో ది ఫ్యామిలీ స్టార్ రూపంలో ఆశించిన ఫలితం ఇవ్వలేకపోయిన సంగతి తెలిసిందే. దీని మీద ఇద్దరు పెట్టుకున్న గంపెడాశలు బాక్సాఫీస్ సాక్షిగా నీరుగారిపోయాయి. దర్శకుడు పరశురామ్ మళ్ళీ గీత గోవిందం మేజిక్ ని రీ క్రియేట్ చేయలేకపోయాడు. ఇదిలా ఉంచితే దిల్ రాజు గత ఏడాది రౌడీ హీరోగా ఇంకో సినిమా అధికారికంగా ప్రకటించడం గుర్తే. రాజావారు రాణిగారు ఫేమ్ రవికిరణ్ కోలా దర్శకత్వంలో ఈ వేసవి నుంచి ప్రారంభం కాబోతోంది. గత ఏడాది లీకైన ‘రౌడీ జనార్ధనా’ టైటిల్ ని ఇవాళ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ప్రెస్ మీట్ లో రాజుగారు అఫీషియల్ చేశారు.
కత్తి నాదే, నెత్తురు నాదే, యుద్ధం నాదే క్యాప్షన్ తో గతంలో రిలీజ్ చేసిన ప్రీ లుక్ పోస్టర్ అభిమానుల్లో అంచనా పెంచింది. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో మంచి వయొలెన్స్ కూడిన యాక్షన్ డ్రామాగా దీని గురించి లీకులు ఉన్నాయి కానీ అంతకు మించి ఎక్కువ డీటెయిల్స్ బయటికి రాలేదు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ కింగ్ డమ్ పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు. ఇది అయ్యాక రౌడీ జనార్ధన సెట్స్ పైకి వెళ్లేలా ఉంది. వీటితో పాటు శ్యామ్ సింగ రాయ్ ఫేమ్ రాహుల్ సంక్రుత్యాన్ తో ప్లాన్ చేసుకున్న ప్యాన్ ఇండియా మూవీకి ప్రీ ప్రొడక్షన్ జరుగుతోంది. ఈ రెండు ఒకేసారి సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ లేకపోలేదు.
గమనించాల్సిన విషయం ఏంటంటే ఫ్యామిలీ స్టార్ లో విజయ్ దేవరకొండ పేరు జనార్దనే. తిరిగి దాన్నే మళ్ళీ వాడుకోబోతున్నారు. అయితే తండ్రి పేరు ఇదే కాబట్టి సెంటిమెంట్ గా భావించి ఉండొచ్చు. వరస ఫ్లాపులు చవి చూస్తున్న రౌడీ హీరోకు సాలిడ్ బ్లాక్ బస్టర్ అవసరం చాలా ఉంది. మార్కెట్, బిజినెస్ లెక్కలు పట్టించుకోకుండా కంటెంట్ డిమాండ్ చేస్తే తన మీద ఎంత ఖర్చు పెట్టడానికైనా నిర్మాతలు వెనుకాడటం లేదు. ఇప్పుడు ప్రొడక్షన్లో ఉన్నవన్నీ ప్యాన్ ఇండియా సినిమాలే. ఒకదానికొకటి సంబంధం లేని జానర్లే. మూడింటి మీద పెడుతున్న బడ్జెట్ మూడు వందల కోట్ల పైమాటేనని ఇన్ సైడ్ టాక్.
This post was last modified on March 5, 2025 1:19 pm
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…