విజయ్ దేవరకొండ, నిర్మాత దిల్ రాజుల కాంబో ది ఫ్యామిలీ స్టార్ రూపంలో ఆశించిన ఫలితం ఇవ్వలేకపోయిన సంగతి తెలిసిందే. దీని మీద ఇద్దరు పెట్టుకున్న గంపెడాశలు బాక్సాఫీస్ సాక్షిగా నీరుగారిపోయాయి. దర్శకుడు పరశురామ్ మళ్ళీ గీత గోవిందం మేజిక్ ని రీ క్రియేట్ చేయలేకపోయాడు. ఇదిలా ఉంచితే దిల్ రాజు గత ఏడాది రౌడీ హీరోగా ఇంకో సినిమా అధికారికంగా ప్రకటించడం గుర్తే. రాజావారు రాణిగారు ఫేమ్ రవికిరణ్ కోలా దర్శకత్వంలో ఈ వేసవి నుంచి ప్రారంభం కాబోతోంది. గత ఏడాది లీకైన ‘రౌడీ జనార్ధనా’ టైటిల్ ని ఇవాళ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ప్రెస్ మీట్ లో రాజుగారు అఫీషియల్ చేశారు.
కత్తి నాదే, నెత్తురు నాదే, యుద్ధం నాదే క్యాప్షన్ తో గతంలో రిలీజ్ చేసిన ప్రీ లుక్ పోస్టర్ అభిమానుల్లో అంచనా పెంచింది. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో మంచి వయొలెన్స్ కూడిన యాక్షన్ డ్రామాగా దీని గురించి లీకులు ఉన్నాయి కానీ అంతకు మించి ఎక్కువ డీటెయిల్స్ బయటికి రాలేదు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ కింగ్ డమ్ పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు. ఇది అయ్యాక రౌడీ జనార్ధన సెట్స్ పైకి వెళ్లేలా ఉంది. వీటితో పాటు శ్యామ్ సింగ రాయ్ ఫేమ్ రాహుల్ సంక్రుత్యాన్ తో ప్లాన్ చేసుకున్న ప్యాన్ ఇండియా మూవీకి ప్రీ ప్రొడక్షన్ జరుగుతోంది. ఈ రెండు ఒకేసారి సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ లేకపోలేదు.
గమనించాల్సిన విషయం ఏంటంటే ఫ్యామిలీ స్టార్ లో విజయ్ దేవరకొండ పేరు జనార్దనే. తిరిగి దాన్నే మళ్ళీ వాడుకోబోతున్నారు. అయితే తండ్రి పేరు ఇదే కాబట్టి సెంటిమెంట్ గా భావించి ఉండొచ్చు. వరస ఫ్లాపులు చవి చూస్తున్న రౌడీ హీరోకు సాలిడ్ బ్లాక్ బస్టర్ అవసరం చాలా ఉంది. మార్కెట్, బిజినెస్ లెక్కలు పట్టించుకోకుండా కంటెంట్ డిమాండ్ చేస్తే తన మీద ఎంత ఖర్చు పెట్టడానికైనా నిర్మాతలు వెనుకాడటం లేదు. ఇప్పుడు ప్రొడక్షన్లో ఉన్నవన్నీ ప్యాన్ ఇండియా సినిమాలే. ఒకదానికొకటి సంబంధం లేని జానర్లే. మూడింటి మీద పెడుతున్న బడ్జెట్ మూడు వందల కోట్ల పైమాటేనని ఇన్ సైడ్ టాక్.
This post was last modified on March 5, 2025 1:19 pm
నెల రోజుల నుంచి వాయిదాల పర్వంలో ఉన్న విజయ్ జన నాయకుడు ఎట్టకేలకు రాజీ మార్గం పట్టొచ్చని చెన్నై వర్గాల…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు.. ఈ నెల 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో అందరి దృష్టీ సహజంగా…
సినీ నిర్మాత బండ్ల గణేష్ చేపట్టిన సంకల్పయాత్ర అలిపిరికి చేరుకుంది. మెట్ల మార్గంలో ఆయన శ్రీవారి సన్నిధికి బయలుదేరారు. జనవరి…
టీ20 వరల్డ్ కప్ 2026లో భారత్తో మ్యాచ్ ఆడబోమంటూ గత కొన్ని రోజులుగా పాకిస్థాన్ చేసిన హడావుడి ఎట్టకేలకు నవ్వులపాలై…
ప్రముఖ బాలీవుడ్ కమెడియన్ రాజ్పాల్ యాదవ్ కు ఊహించని షాక్ తగిలింది. దాదాపు 16 ఏళ్ల క్రితం మొదలైన ఒక…
తిరుమల శ్రీవారి పవిత్ర లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగం వ్యవహారంలో కీలక మలుపు చోటు చేసుకుంది. టీడీపీ నేతల…