Movie News

షాక్ ఇస్తున్న సిరిమల్లె చెట్టు బుకింగ్స్

ఈ శుక్రవారం రీ రిలీజ్ కాబోతున్న సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టుకి రాంగ్ టైమింగ్ ఎంచుకున్నారని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు కానీ బుకింగ్స్ పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఇటీవలే ఇంటర్ పరీక్షలు మొదలుకావడంతో పాటు ఇతర తరగతుల అన్యువల్ ఎగ్జామ్స్ ఇదే నెలలో ఉన్నాయి. వీటి వల్ల వసూళ్లు భారీగా ఉండవేమోనని మహేష్ బాబు, వెంకటేష్ అభిమానులు భావించారు. కానీ వాళ్ళ అంచనాలకు భిన్నంగా బుక్ మై షోలో సగటున రోజుకు 15 వేల నుంచి 20 వేల దాకా అడ్వాన్స్ టికెట్లు అమ్ముడుపోతున్నాయి. ఇది కేవలం ఒక యాప్ నుంచి నమోదైన డేటా. డిస్ట్రిక్ట్ ఇతరత్రా ప్లాట్ ఫార్మ్స్ లెక్కలు వేరు.

నాలుగు రోజులు ముందుగానే ఇంత ట్రెండింగ్ లో రావడం విశేషమే. విచిత్రం ఏంటంటే మార్చి 7 రిలీజ్ కాబోతున్న మరో ఏడెనిమిది కొత్త సినిమాలు దేనికీ ఇంత బుకింగ్స్ లేవు. ఛావా తెలుగు డబ్బింగ్ మీద సిరిమల్లె చెట్టు ప్రభావం గట్టిగా ఉండబోతోంది. ముఖ్యంగా మెయిన్ థియేటర్స్ ని ఫ్యాన్స్ ఎగబడి బుక్ చేస్తున్నారు. ఉదాహరణకు హైదరాబాద్ సుదర్శన్, విశ్వనాథ్ లాంటి సింగల్ స్క్రీన్లలో మొదటి రోజు నాలుగు ఆటలు సోల్డ్ అవుట్ పెట్టేశారు. మల్టీప్లెక్సుల్లో సైతం అమ్మకాలు శరవేగంగా ఉన్నాయి. గత ఏడాది మురారి తర్వాత తిరిగి అంత స్థాయి స్పందన దీనికే వచ్చేలా ఉందని డిస్ట్రిబ్యూటర్స్ టాక్.

చూస్తుంటే ప్రేక్షకులు ఈ సినిమాకు గట్టిగానే వెళ్లేలా ఉన్నారు. ఎలాగూ బాక్సాఫీస్ వద్ద సరైన పోటీ లేదు. కౌంట్ సంగతి పక్కనపెడితే మొదటి రోజే చూడాలనే ఉత్సుకతను కొత్త రిలీజులు కలిగించలేక పోతున్నాయి. టాక్, రివ్యూలు వస్తే తప్ప జనం వెళ్ళరు. కానీ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టుకి అలాంటి సమస్య లేదు. ఎప్పుడో పదిహేనేళ్ల క్రితం చూసిన మూవీ మళ్ళీ థియేటర్లో వచ్చే అవకాశం వస్తే వదులుతారా. ఇప్పట్లో మహేష్ ని స్క్రీన్ మీద చూసే అవకాశం లేకపోవడం, సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బస్టర్ ఎంజాయ్ చేస్తున్న వెంకీ ఫ్యాన్స్ ఆనందం రెండూ కలగలసి మార్చి 7 థియేటర్లలో ఓ రేంజ్ సందడి చేయడం ఖాయమే.

This post was last modified on March 4, 2025 12:14 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

28 minutes ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

2 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

2 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

3 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

4 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

4 hours ago