లోకేష్ కనకరాజ్.. ఇప్పుడు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అత్యంత డిమాండ్ ఉన్న దర్శకుల్లో ఒకడు. ఖైదీ, విక్రమ్ చిత్రాలతో అతను ఎంత క్రేజ్ సంపాదించుకున్నాడో తెలిసిందే. ముఖ్యంగా తాను తీసిన ప్రతి సినిమాకూ ఒక లిక్ పెడుతూ అతను క్రియేట్ చేసిన లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ ఎంత పెద్ద ట్రెండ్గా మారిందో తెలిసిందే. ఐతే ఇప్పుడింత క్రేజ్ సంపాదించుకున్న లోకేష్.. తాను తీసిన తొలి చిత్రంలో మన యంగ్ హీరో సందీప్ కిషన్నే లీడ్ రోల్లో పెట్టాడు. ఆ చిత్రమే.. మానగరం. ఆ సినిమా సక్సెస్ అయింది.
ఐతే ‘మానగరం’ తర్వాత సందీప్.. లోకేష్తో కలిసి సినిమానే చేయలేదు. ఎల్సీయూలో భాగమైన మరే చిత్రంలోనూ కనిపించలేదు. సందీప్తో తొలి సినిమా చేసిన లోకేష్ ఇంత పెద్ద దర్శకుడు అయిపోవడం.. మళ్లీ తనతో సందీప్ జట్టు కట్టకపోవడం గురించి తన కొత్త చిత్రం ‘మజాకా’ సక్సెస్ మీట్లో విలేకరులు ప్రస్తావిస్తే.. సందీప్ కిషన్ దాని గురించి స్పందించాడు. లోకేష్తో తాను ఇప్పటికీ టచ్లో ఉన్నానని.. మళ్లీ తామిద్దరం కలిసి చేస్తే అది తనకు, అతడికి బెస్ట్ మూవీ అయ్యుండాలనే ఉద్దేశంతో మళ్లీ సినిమా చేయలేదన్నాడు. తాను లోకేష్తో మళ్లీ సినిమా చేయబోతున్నానని.. అది ఎల్సీయూలో భాగమా కాదా అని తాను చెప్పలేనని సందీప్ అన్నాడు.
మరోవైపు లోకేష్ డైరెక్ట్ చేస్తున్న కొత్త చిత్రం ‘కూలీ’ గురించి సందీప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ సినిమా సెట్స్కు తాను వెళ్లానని.. అంతే కాక దాదాపు ముప్పావు గంట సినిమా చూశానని.. ఈ సినిమా వెయ్యి కోట్ల వసూళ్లు సాధించడం గ్యారెంటీ అని సందీప్ చెప్పడం విశేషం. సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఉపేంద్ర సైతం ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఇందులో పూజా హెగ్డే ప్రత్యేక గీతంలో నటిస్తున్న విషయం తాజాగా వెల్లడైంది.
This post was last modified on February 28, 2025 10:33 am
గత వారం విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ఫుల్ పాజిటివ్ టాకేమీ తెచ్చుకోలేదు. ప్రిమియర్స్ నుంచే డివైడ్ టాక్ మొదలైంది.…
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విష్ణుమూర్తి అవతారంగా ప్రముఖ బాలివుడ్ నటుడు సుదేష్ బెర్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో…
బలమైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆశలన్నీ కొరియన్ కనకరాజు మీదే ఉన్నాయి. ఆగస్ట్…
బారత ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ... వరుసబెట్టి మూడు పర్యాయాలు దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. అంతేకాకుండా దేశానికి అత్యధిక…
కొత్త నెల వచ్చేసింది. సంక్రాంతి అయిపోయాక ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ దాకా జనాలు రాక థియేటర్లు అలో లక్ష్మణా అంటున్న…
జంతర్ మంతర్ ఆందోళనలో విద్యార్థులు తనను దుషించారని ప్రధాని మోదీ శుక్రవారం రాత్రి విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో…