Movie News

‘కూలీ’ చూశా.. వెయ్యి కోట్లు గ్యారెంటీ

లోకేష్ కనకరాజ్.. ఇప్పుడు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అత్యంత డిమాండ్ ఉన్న దర్శకుల్లో ఒకడు. ఖైదీ, విక్రమ్ చిత్రాలతో అతను ఎంత క్రేజ్ సంపాదించుకున్నాడో తెలిసిందే. ముఖ్యంగా తాను తీసిన ప్రతి సినిమాకూ ఒక లిక్ పెడుతూ అతను క్రియేట్ చేసిన లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ ఎంత పెద్ద ట్రెండ్‌గా మారిందో తెలిసిందే. ఐతే ఇప్పుడింత క్రేజ్ సంపాదించుకున్న లోకేష్.. తాను తీసిన తొలి చిత్రంలో మన యంగ్ హీరో సందీప్ కిషన్‌నే లీడ్ రోల్‌లో పెట్టాడు. ఆ చిత్రమే.. మానగరం. ఆ సినిమా సక్సెస్ అయింది.

ఐతే ‘మానగరం’ తర్వాత సందీప్.. లోకేష్‌తో కలిసి సినిమానే చేయలేదు. ఎల్సీయూలో భాగమైన మరే చిత్రంలోనూ కనిపించలేదు. సందీప్‌తో తొలి సినిమా చేసిన లోకేష్ ఇంత పెద్ద దర్శకుడు అయిపోవడం.. మళ్లీ తనతో సందీప్ జట్టు కట్టకపోవడం గురించి తన కొత్త చిత్రం ‘మజాకా’ సక్సెస్ మీట్లో విలేకరులు ప్రస్తావిస్తే.. సందీప్ కిషన్ దాని గురించి స్పందించాడు. లోకేష్‌తో తాను ఇప్పటికీ టచ్‌లో ఉన్నానని.. మళ్లీ తామిద్దరం కలిసి చేస్తే అది తనకు, అతడికి బెస్ట్ మూవీ అయ్యుండాలనే ఉద్దేశంతో మళ్లీ సినిమా చేయలేదన్నాడు. తాను లోకేష్‌తో మళ్లీ సినిమా చేయబోతున్నానని.. అది ఎల్సీయూలో భాగమా కాదా అని తాను చెప్పలేనని సందీప్ అన్నాడు.

మరోవైపు లోకేష్ డైరెక్ట్ చేస్తున్న కొత్త చిత్రం ‘కూలీ’ గురించి సందీప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ సినిమా సెట్స్‌కు తాను వెళ్లానని.. అంతే కాక దాదాపు ముప్పావు గంట సినిమా చూశానని.. ఈ సినిమా వెయ్యి కోట్ల వసూళ్లు సాధించడం గ్యారెంటీ అని సందీప్ చెప్పడం విశేషం. సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఉపేంద్ర సైతం ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఇందులో పూజా హెగ్డే ప్రత్యేక గీతంలో నటిస్తున్న విషయం తాజాగా వెల్లడైంది.

This post was last modified on February 28, 2025 10:33 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

ప్రతిచోట చీపురు పట్టుకొని పవన్ ఊడవాలా?

పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…

35 minutes ago

విమర్శకులను పనితీరుతో కొడుతున్న లోకేష్..!

తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…

2 hours ago

రండి.. కూర్చుని మాట్లాడుకుందాం: ఏపీకి రేవంత్ రెడ్డి పిలుపు

ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…

2 hours ago

షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?

టీమ్ ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ ఇంటర్నేషనల్ కెరీర్ దాదాపు ముగింపు దశకు చేరుకున్నట్లే కనిపిస్తోంది. గతేడాది జరిగిన…

3 hours ago

‘వైసీపీ చేసిన పాపాలను కడుగుతున్నాం’

రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…

11 hours ago

ఎలుకల మందు ఆర్డర్.. డెలివరీ బాయ్ ఏం చేశాడు?

సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…

12 hours ago