ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవితకథ ఆధారంగా రూపొందిన చావా బాలీవుడ్ బాక్సాఫీస్ దుమ్ము దులుపుతోంది. స్త్రీ 2, పుష్ప 2 తర్వాత మళ్ళీ ఆ స్థాయిలో థియేటర్ల దగ్గర హౌస్ ఫుల్ బోర్డులు చూస్తున్న పంపిణీదారుల ఆనందం అంతా ఇంతా కాదు. కేవలం ఉత్తరాదిలోనే కాదు తెలుగు రాష్ట్రాల్లోనూ చావా వసూళ్లు గణనీయంగా పెరిగాయి. మొదటి వారం నాలుగైదు షోలు మాత్రమే ఇచ్చిన జిల్లా కేంద్రాలు వాటిని పదికి పెంచాయి. కొత్త రిలీజులు ఏమంత ఆసక్తికరంగా లేకపోవడంతో చావాకు తగినన్ని స్క్రీన్లు దొరికేందుకు మార్గం సుగమం అయ్యింది. ముఖ్యంగా ఈవెనింగ్, నైట్ షోలు మంచి ఆక్యుపెన్సీలు చూపిస్తున్నాయి.
పది రోజులకు చావా 300 కోట్ల క్లబ్బులో అడుగు పెట్టేసింది. నిన్న బుక్ మై షోలో సగటున గంటకు 50 వేల దాకా టికెట్లు అమ్ముడుపోవడం వీకెండ్ క్రేజ్ కి నిదర్శనం. ఈ ప్రభంజనం ఎప్పటిదాకా ఉంటుందంటే ఇంకో రెండు వారాలు కనిష్టంగా ఈ జోరు ఇలాగే కొనసాగడం ఖాయం. చూస్తుంటే అయిదు వందల కోట్ల మార్కు కష్టమేమి కాదు. సులభంగానే చేరుకుంటుంది. ఎలాగూ ఓటిటి రిలీజ్ మల్టీప్లెక్సుల నిబంధనల ప్రకారం యాభై రోజుల తర్వాతే కాబట్టి థియేటర్ రన్ కొచ్చిన ఇబ్బందేమీ లేదు. కాకపోతే గేమ్ ఛేంజర్, తండేల్ లాగే ఇది కూడా హెచ్డి పైరసీ బారిన పడటం కలెక్షన్ల మీద ప్రభావమైతే చూపిస్తోంది.
దీని పుణ్యమాని విక్కీ కౌశల్ ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. ఖాన్ల ద్వయం తర్వాత స్టార్లుగా అవతరిస్తున్న వాళ్లలో రన్బీర్ కపూర్ మొదటి పేరుగా కాగా ఇప్పుడీ టాప్ వన్ లీగ్ లోకి విక్కీ దాదాపు చేరిపోయినట్టే. ఎక్కడికి వెళ్లినా జనాలు నీరాజనాలు పడుతున్నారు. చావా ప్రభావం ఏ స్థాయిలో ఉందంటే పలు నగరాల్లో అక్బర్ బాబర్ అని మొఘల్ రాజుల పేర్లున్న వీధుల బోర్డులను జనాలు మార్చేస్తున్నారు. ఆ వీడియోలు వైరలవుతున్నాయి. రష్మిక మందన్న సైతం చావాతో హ్యాట్రిక్ హిట్లను పూర్తి చేసుకుని డిమాండ్ పెంచేసుకుంది. తెలుగుతో పాటు ఇతర బాషల డబ్బింగ్ సూచనలు దాదాపు కనుమరుగైనట్టే.
This post was last modified on February 23, 2025 12:27 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…