పదమూడు సంవత్సరాల క్రితం 2012లో వచ్చిన గజిని సూర్య కెరీర్ ని గొప్ప మలుపు తిప్పడమే కాక దర్శకుడు ఏఆర్ మురుగదాస్ పేరు జాతీయ స్థాయికి తీసుకెళ్లింది. అమీర్ ఖాన్ వెంటపడి మరీ ఆయనతోనే రీమేక్ చేసి వంద కోట్ల గ్రాసర్ సాధించాడంటే చిన్న విషయం కాదు. ఆ తర్వాత తుపాకీ, కత్తి మాత్రమే మురుగదాస్ స్థాయిలో కంటెంట్ ఉన్న సినిమాలు.
సర్కార్ నుంచి పూర్తి ట్రాక్ తప్పేశారు. స్పైడర్ దారుణంగా నిరాశపరచగా దర్బార్ రజనీకాంత్ రేంజులో ఆడలేకపోయింది. అయినా సరే కండల వీరుడు సల్మాన్ ఖాన్ కథను నమ్మి సికందర్ ఛాన్స్ ఇచ్చాడు. రంజాన్ విడుదల లక్ష్యంగా షూటింగ్ జరుపుకుంటోంది.
ఇదింకా థియేటర్లకు రాకుండా మురుగదాస్ శివ కార్తికేయన్ కలయికలో రూపొందుతున్న మదరాసి టీజర్ ఇవాళ వచ్చేసింది. విజువల్స్ చూస్తే తుపాకీ నాటి వింటేజ్ నెస్ కనిపిస్తోంది. యాక్షన్ బ్లాక్స్, టెర్రరిజం మాఫియా బ్యాక్ డ్రాప్ వగైరాలతో మరోసారి స్క్రీన్ ప్లే మేజిక్ చేసేలా కనిపిస్తున్నాడు.
ఎప్పటిలాగే అనిరుధ్ రవిచందర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాంచి ఎలివేషన్ ఇచ్చింది. నిజానికిది అమరన్ కన్నా ముందు కమిటైన సినిమా. మొదలుపెట్టాక సల్మాన్ నుంచి పిలుపు రావడంతో దాస్ అటువైపు వెళ్లారు. ఇప్పుడు మదరాసి మీద ఫోకస్ పెడుతున్నారు. చూస్తుంటే సీనియర్ దర్శకుడి మాములు స్పీడ్ గా లేదు.
ఇవి కనక హిట్ అయితే మురుగదాస్ పూర్తి ఫామ్ లోకి వచ్చేసినట్టే. తిరిగి స్టార్ హీరోలతో కాంబోలు కుదురుతాయి. కొన్నేళ్లుగా టయర్ 1 స్టార్ హీరోలు ఈయన్ని దూరంగా ఉంచుతున్నారు. పుష్ప టైంలోనే అల్లు అర్జున్ కలయికలో ఒక భారీ చిత్రం తీయాలని జ్ఞానవేల్ రాజా అనుకున్నారు కానీ సాధ్యపడలేదు.
తర్వాత తమిళ తెలుగు హీరోలను మురుగదాస్ కలిసినా లాభం లేకపోయింది. ఇప్పుడు సరైన టైం వచ్చింది. సికందర్, మదరాసి కనక వర్కౌట్ అయితే డిమాండ్ అమాంతం పెరుగుతుంది. కథలకు లోటు లేకుండా బోలెడు సిద్ధం చేసి పెట్టుకున్న దాస్ ఈ రెండు సినిమాల మీద మీద బోలెడు నమ్మకంతో ఉన్నారు.
దక్షిణాది గానకోకిలగా కోట్లాది మంది అభిమానుల ప్రేమను సొంతం చేసుకున్న ప్రముఖ గాయని ఎస్. జానకి (88) కన్నుమూశారు. ఆమె…
వైసీపీ అధినేత జగన్పై సీఎం చంద్రబాబు షాకింగ్ కామెంట్స్ చేశారు. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా షాబాద్లో ఓ వ్యక్తి ఆరుగురిని…
ఏపీలో ఆసక్తి రేకెత్తించిన జోసెఫ్ రావణ్ అలియాస్ ప్రశ్న రావణ్ వ్యవహారంపై కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. జనసేన అదినేత,…
అమెరికా అధ్యక్షుడి హోదాలో డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న విచిత్రమైన నిర్ణయాలతో ఆ దేశ ప్రజలతో పాటు ఆ దేశంలోని విదేశీయులు నానా ఇబ్బందులు పడుతున్నారు.…
విహార యాత్రల్లో ప్రమాదం జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాంటిదే ఇప్పుడు వియత్నాంలో జరిగింది. వియత్నాంలో…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు శనివారం శస్త్ర చికిత్స జరిగింది. ముంబైలో జరిగిన ఈ శస్త్ర…