నందమూరి బాలకృష్ణ కొత్త సినిమా ‘డాకు మహారాజ్’ విడుదలకు ముందు అందులోంచి రిలీజ్ చేసిన ‘దబిడి దిబిడి’ పాట విషయంలో సోషల్ మీడియా వేదికగా ఎంత ట్రోలింగ్ జరిగిందో తెలిసిందే. ఆ పాటలో నర్తించిన ఊర్వశి రౌటెలా జఘన భాగంలో కొడుతూ బాలయ్య వేసిన స్టెప్స్ చాలామందికి అభ్యంతరకరంగా అనిపించాయి. ఆ పాట రిలీజ్ చేయడం ఆలస్యం.. సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి.
బాలయ్యతో పాటు డ్యాన్స్ మాస్టర్ శేఖర్ మాస్టర్ను చాలామంది ట్రోల్ చేశారు. ఈ ట్రోల్ మెసేజ్లన స్వయంగా ఊర్వశి రౌటెలానే సోషల్ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయడం చర్చనీయాంశం అయింది. అది ట్రోలింగ్ అని తెలియక ఆమె షేర్ చేసినట్లుగా టీం తర్వాత ఏదో కవర్ చేసింది. ఆ విషయం పక్కన పెడితే.. ఇప్పుడు ఊర్వశి నేరుగా ఆ ట్రోలింగ్ గురించి స్పందించింది.
‘దబిడి దిబిడి’ పాట చిత్రీకరిస్తున్నపుడు కానీ, రిహార్సల్స్ చేస్తున్నపుడు కూడా ఆ స్టెప్స్లో తమకు అసభ్యకరంగా ఏమీ అనిపించలేదని ఊర్వశి తెలిపింది. సోషల్ మీడియాలో ఈ పాటపై ట్రోల్స్ రావడం పట్ల ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ‘‘ఈ పాట కోసం ముందే రిహార్సల్స్ చేశాం. అది ప్రశాంతంగా సాగింది. అన్ని పాటలకు కొరియోగ్రఫీ ఎలా ఉంటుందో దానికీ అలాగే చేశాం. శేఖర్ మాస్టర్తో అంతకుముందే మూడు పాటలకు పని చేశాను.
ఆయన స్టెప్స్ గురించి చెప్పినపుడు నాకు ఏమాత్రం ఇబ్బందికరంగా అనిపించలేదు. మామూలు స్టెప్స్లాగే భావించా. కానీ పాట రిలీజయ్యాక సోషల్ మీడియా వచ్చిన ట్రోల్స్ చూసి షాకయ్యా. కొరియోగ్రఫీని ప్రేక్షకులు తప్పుబట్టడానికి కారణమేంటో అంచనా వేయడానికి కూడా టైం లేకపోయింది. రిహార్సల్స్ టైంలో మేం ఇలాంటి విమర్శలు వస్తాయని అస్సలు ఊహించలేదు. మేం దానికి సంబంధించిన క్లిప్స్ రిలీజ్ చేసినపుడు మాత్రం ఎవ్వరూ ఏమీ మాట్లాడలేదు’’ అని ఊర్వశి తెలిపింది.
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…