నందమూరి బాలకృష్ణ కొత్త సినిమా ‘డాకు మహారాజ్’ విడుదలకు ముందు అందులోంచి రిలీజ్ చేసిన ‘దబిడి దిబిడి’ పాట విషయంలో సోషల్ మీడియా వేదికగా ఎంత ట్రోలింగ్ జరిగిందో తెలిసిందే. ఆ పాటలో నర్తించిన ఊర్వశి రౌటెలా జఘన భాగంలో కొడుతూ బాలయ్య వేసిన స్టెప్స్ చాలామందికి అభ్యంతరకరంగా అనిపించాయి. ఆ పాట రిలీజ్ చేయడం ఆలస్యం.. సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి.
బాలయ్యతో పాటు డ్యాన్స్ మాస్టర్ శేఖర్ మాస్టర్ను చాలామంది ట్రోల్ చేశారు. ఈ ట్రోల్ మెసేజ్లన స్వయంగా ఊర్వశి రౌటెలానే సోషల్ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయడం చర్చనీయాంశం అయింది. అది ట్రోలింగ్ అని తెలియక ఆమె షేర్ చేసినట్లుగా టీం తర్వాత ఏదో కవర్ చేసింది. ఆ విషయం పక్కన పెడితే.. ఇప్పుడు ఊర్వశి నేరుగా ఆ ట్రోలింగ్ గురించి స్పందించింది.
‘దబిడి దిబిడి’ పాట చిత్రీకరిస్తున్నపుడు కానీ, రిహార్సల్స్ చేస్తున్నపుడు కూడా ఆ స్టెప్స్లో తమకు అసభ్యకరంగా ఏమీ అనిపించలేదని ఊర్వశి తెలిపింది. సోషల్ మీడియాలో ఈ పాటపై ట్రోల్స్ రావడం పట్ల ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ‘‘ఈ పాట కోసం ముందే రిహార్సల్స్ చేశాం. అది ప్రశాంతంగా సాగింది. అన్ని పాటలకు కొరియోగ్రఫీ ఎలా ఉంటుందో దానికీ అలాగే చేశాం. శేఖర్ మాస్టర్తో అంతకుముందే మూడు పాటలకు పని చేశాను.
ఆయన స్టెప్స్ గురించి చెప్పినపుడు నాకు ఏమాత్రం ఇబ్బందికరంగా అనిపించలేదు. మామూలు స్టెప్స్లాగే భావించా. కానీ పాట రిలీజయ్యాక సోషల్ మీడియా వచ్చిన ట్రోల్స్ చూసి షాకయ్యా. కొరియోగ్రఫీని ప్రేక్షకులు తప్పుబట్టడానికి కారణమేంటో అంచనా వేయడానికి కూడా టైం లేకపోయింది. రిహార్సల్స్ టైంలో మేం ఇలాంటి విమర్శలు వస్తాయని అస్సలు ఊహించలేదు. మేం దానికి సంబంధించిన క్లిప్స్ రిలీజ్ చేసినపుడు మాత్రం ఎవ్వరూ ఏమీ మాట్లాడలేదు’’ అని ఊర్వశి తెలిపింది.
This post was last modified on February 12, 2025 5:03 pm
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…