జవాన్ తో బాలీవుడ్ లో పెద్ద జెండా పాతేసిన దర్శకుడు అట్లీ నెక్స్ట్ ఎవరితో చేస్తాడనే సస్పెన్స్ ఇప్పటిదాకా కొనసాగుతూనే వచ్చింది. ప్రముఖంగా వినిపించిన పేర్లు రెండు. ఒకటి సల్మాన్ ఖాన్. రెండు అల్లు అర్జున్. చివరికి ఐకాన్ స్టార్ దే ఓకే అయ్యేలా ఉందని ముంబై రిపోర్ట్. దీని వెనుక చాలా మ్యాటరే నడిచిందట. అదేంటో చూద్దాం.
అట్లీ ముందు సల్మాన్ ని దృష్టిలో పెట్టుకునే ఒక పవర్ ఫుల్ కథని రాసుకున్నాడు. కానీ బడ్జెట్ 400 కోట్లకు పైగా కేవలం ప్రొడక్షన్ కే ఖర్చవుతుందని చెప్పడంతో ముందు చూద్దామన్న జియో స్టూడియోస్ వెనుకడుగు వేసిందట. అంత మొత్తం సల్మాన్ మీద వర్కౌట్ కాదనే ఉద్దేశంతో.
ఇదే ప్రతిపాదన సన్ పిక్చర్స్ దగ్గరికి తీసుకెళ్లినప్పుడు కూడా ఇదే సమాధానం వచ్చిందట. కండల వీరుడి మీద అంత రిస్క్ చేయలేమని చెప్పి పెండింగ్ లో ఉంచేశారు. ఒకవేళ అల్లు అర్జున్ అయితే కనక ఎంత బడ్జెట్ అయినా సరే రెడీ అనే సంకేతం ఇవ్వడంతో ఆ మేరకు ఐకాన్ స్టార్ తో జరిపిన చర్చలు సానుకూల ఫలితాలు ఇచ్చాయని అంటున్నారు.
ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్యాన్ ఇండియా మూవీ కోసం రెడీ అవుతున్న బన్నీ ఒకవేళ అది మరీ ఆలస్యమయ్యే పక్షంలో అట్లీకు ఎస్ చెప్పొచ్చు. లెక్కలు వేసుకోకుండా మరీ పెట్టుబడి పెట్టేందుకు సన్ సిద్ధపడిందంటే అదంతా పుష్ప మహాత్యమే.
ఇదంతా అధికారిక ముద్ర వేసుకునేందుకు కొంత టైం పట్టేలా ఉంది కానీ మొత్తానికి లాక్ అవ్వడం ఖరారేనని టాక్. దీన్ని బట్టి టాలీవుడ్ స్థాయి బాలీవుడ్ ని మించి ఎంత ఎత్తుకు ఎదిగిందో అర్థం చేసుకోవచ్చు. అలాని సల్మాన్ – అట్లీ కాంబో ఉండదని కాదు. వేరే స్టోరీతో అంత బడ్జెట్ డిమాండ్ చేయని విధంగా మరో ప్రాజెక్టు ప్లాన్ చేస్తున్నారట.
అయితే ఏది ముందు ఏది వెనక్కు అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఎదురు చూడాలి. బన్నీ అభిమానులు మాత్రం ఎప్పుడెప్పుడు కొత్త సినిమా మొదలవుతుందాని ఎదురు చూస్తున్నారు. పుష్ప 2 ది రూల్ రిలీజై ఇప్పటికే రెండు నెలలు దాటిపోయింది. ఇంకా కొత్త ప్రకటనైతే రాలేదు.
This post was last modified on February 12, 2025 12:36 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…