విజయ్ దేవరకొండ-పూరి జగన్నాథ్ల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన ‘లైగర్’ సినిమాపై విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో తెలిసిందే. కానీ ఆ చిత్రం ఆ అంచనాలను అందుకోవడంలో ఘోరంగా విఫలమైంది. తెలుగు సినిమా చరిత్రలోనే అతి పెద్ద డిజాస్టర్లలో నిలిచింది. ఈ సినిమాతో చాలామంది కెరీర్లకు గట్టి దెబ్బ తగిలింది. ఈ మూవీతోనే దక్షిణాదిన అడుగుపెట్టిన కథానాయికగా వెలిగిపోవాలని అనుకున్న బాలీవుడ్ భామ అనన్య పాండేకు పెద్ద షాక్ తగిలింది.
ఓవైపు సినిమా డిజాస్టర్ అయితే.. ఇంకోవైపు తన పాత్ర, పెర్ఫామెన్స్ విషయంలోనూ తీవ్ర విమర్శలు తప్పలేదు. ఐతే తన పాత్ర గురించి చెప్పినపుడే ఈ సినిమాలో చేయాలా వద్దా అని సంశయించిందట అనన్య. ఈ విషయాన్ని తండ్రి దగ్గర కూడా చెప్పిందట. కానీ తనే ఆమెను బలవంతంగా ఒప్పించి ఈ సినిమా చేయించినట్లు ‘లైగర్’లో అనన్య తండ్రి చుంకీ పాండే వెల్లడించాడు. ‘లైగర్’లో చుంకీ కూడా నటించిన సంగతి తెలిసిందే.
‘‘అనన్యకు లైగర్ సినిమాలో అవకాశం వచ్చినపుడు తనెంతో అసౌకర్యంగా ఫీలైంది. గందరగోళానికి గురైంది. తాను అందులో హీరోయిన్ పాత్రకు సెట్ కానని, చిన్న పిల్లలా కనిపిస్తానని తను అనుకుంది. నా దగ్గరికి వచ్చి.. ఈ సినిమాకు తాను సెట్ కాననిపిస్తోందని, ఏం చేయమంటావని అడిగింది. కానీ అలా ఆలోచించవద్దని, అది పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి, సక్సెస్ అయితే బాగా పేరొస్తుందని చెప్పి నేనే ఆ సినిమాకు ఒప్పించా. కానీ లైగర్ రిలీజయ్యాక వచ్చిన రివ్యూలు చూసి ఆమె చెప్పిందే నిజమని అనిపించింది.
నిజంగానే ఆ సినిమాలో అనన్య చేసిన పాత్రకు సూట్ కాలేదు. చిన్నమ్మాయిలా అనిపించింది. ఆ సినిమా తర్వాత నేనెప్పుడూ తనకు సలహాలు ఇవ్వలేదు. తన సినిమాల విషయంలో నిర్ణయాలు తనకే వదిలేశాను. ప్రస్తుతం అనన్యకు నచ్చే, నప్పే సినిమాలు ఎంచుకుంటూ కెరీర్లో ముందుకు సాగుతోంది’’ అని చుంకీ పాండే తెలిపాడు. ‘లైగర్’లో చుంకీ పాండే.. అన్య తండ్రి పాత్రనే పోషించిన సంగతి తెలిసిందే.
This post was last modified on February 6, 2025 3:23 pm
యువ కథానాయకుడు రామ్ ఓ నిఖార్సయిన హిట్టు కొట్టి చాలా ఏళ్లయింది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత తన చిత్రాలన్నీ బోల్తా…
వరస ఫ్లాపులతో సతమతమవుతున్న విశ్వక్ సేన్ తిరిగి దర్శకత్వంలోకి వచ్చేశాడు. ఫలక్ నుమా దాస్, దాస్ కా ధమ్కీ తర్వాత…
కమల్ హాసన్, రజనీకాంత్ కాంబోలో అనౌన్స్ మెంట్ వీడియో చూశాక మూవీ లవర్స్ లో మాములు ఎగ్జైట్ మెంట్ కలగడం…
కామారెడ్డిలో కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ మాజీ సర్పంచ్ కారును బీజేపీ కార్యకర్తలు…
అయేషా మీరా. ఉమ్మడి ఏపీలో 2007లో ఓ వ్యక్తి కామ దాహానికి బలి అయిపోయిన బీఫార్మసీ విద్యార్థిని. ఈ కేసులో…
గత వారం విడుదలైన సినిమాల్లో మంచి టాక్, రివ్యూస్ తెచ్చుకుంది కపుల్ ఫ్రెండ్లీకి ఒకటే. అయితే ఆశించిన పెద్ద మొత్తంలో…