విజయ్ దేవరకొండ-పూరి జగన్నాథ్ల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన ‘లైగర్’ సినిమాపై విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో తెలిసిందే. కానీ ఆ చిత్రం ఆ అంచనాలను అందుకోవడంలో ఘోరంగా విఫలమైంది. తెలుగు సినిమా చరిత్రలోనే అతి పెద్ద డిజాస్టర్లలో నిలిచింది. ఈ సినిమాతో చాలామంది కెరీర్లకు గట్టి దెబ్బ తగిలింది. ఈ మూవీతోనే దక్షిణాదిన అడుగుపెట్టిన కథానాయికగా వెలిగిపోవాలని అనుకున్న బాలీవుడ్ భామ అనన్య పాండేకు పెద్ద షాక్ తగిలింది.
ఓవైపు సినిమా డిజాస్టర్ అయితే.. ఇంకోవైపు తన పాత్ర, పెర్ఫామెన్స్ విషయంలోనూ తీవ్ర విమర్శలు తప్పలేదు. ఐతే తన పాత్ర గురించి చెప్పినపుడే ఈ సినిమాలో చేయాలా వద్దా అని సంశయించిందట అనన్య. ఈ విషయాన్ని తండ్రి దగ్గర కూడా చెప్పిందట. కానీ తనే ఆమెను బలవంతంగా ఒప్పించి ఈ సినిమా చేయించినట్లు ‘లైగర్’లో అనన్య తండ్రి చుంకీ పాండే వెల్లడించాడు. ‘లైగర్’లో చుంకీ కూడా నటించిన సంగతి తెలిసిందే.
‘‘అనన్యకు లైగర్ సినిమాలో అవకాశం వచ్చినపుడు తనెంతో అసౌకర్యంగా ఫీలైంది. గందరగోళానికి గురైంది. తాను అందులో హీరోయిన్ పాత్రకు సెట్ కానని, చిన్న పిల్లలా కనిపిస్తానని తను అనుకుంది. నా దగ్గరికి వచ్చి.. ఈ సినిమాకు తాను సెట్ కాననిపిస్తోందని, ఏం చేయమంటావని అడిగింది. కానీ అలా ఆలోచించవద్దని, అది పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి, సక్సెస్ అయితే బాగా పేరొస్తుందని చెప్పి నేనే ఆ సినిమాకు ఒప్పించా. కానీ లైగర్ రిలీజయ్యాక వచ్చిన రివ్యూలు చూసి ఆమె చెప్పిందే నిజమని అనిపించింది.
నిజంగానే ఆ సినిమాలో అనన్య చేసిన పాత్రకు సూట్ కాలేదు. చిన్నమ్మాయిలా అనిపించింది. ఆ సినిమా తర్వాత నేనెప్పుడూ తనకు సలహాలు ఇవ్వలేదు. తన సినిమాల విషయంలో నిర్ణయాలు తనకే వదిలేశాను. ప్రస్తుతం అనన్యకు నచ్చే, నప్పే సినిమాలు ఎంచుకుంటూ కెరీర్లో ముందుకు సాగుతోంది’’ అని చుంకీ పాండే తెలిపాడు. ‘లైగర్’లో చుంకీ పాండే.. అన్య తండ్రి పాత్రనే పోషించిన సంగతి తెలిసిందే.
టాలీవుడ్ అగ్రశ్రేణి డ్యాన్స్ మాస్టర్లు ఇద్దరి మధ్య వివాదం రాజుకుంది. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ మధ్య ఘర్షణ చోటు…
మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…
ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…
ఏపీలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ప్రముఖులపై అసభ్యకరమైన రీతిలో వ్యాఖ్యలు చేసిన కారణంగా ప్రశ్న రావణ్ సహా పలువురు…
టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…
పశ్చిమాసియాలో నెలకొన్న శాంతియుత పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారిపోయాయి. ఇరాన్ ను లక్ష్యంగా చేసుకుని అమెరికా భీకర దాడులకు దిగింది.…