టాలీవుడ్ ను కుదిపేసిన ఆదాయపన్ను శాఖ దాడులు ఇప్పుడప్పుడే ముగిసేలా లేవు. తెలంగాణ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా కొనసాగుతున్న బడా నిర్మాత దిల్ రాజు టార్గెట్ గా రోజుల తరబడి ఐటీ శాఖ సోదాలు చేసిన సంగతి తెలిసిందే. ఈ సోదాల్లో రాజు గారి ఇల్లు, కార్యాలయాలతో పాటుగా రాజు సోదరుడు శిరీష్, కుమార్తె హన్షితల ఇల్లు, కార్యాలయాలనూ ఐటీ అధికారులు జల్లెగ పట్టారు. ఈ సోదాలు ముగిసినట్లుగా ప్రకటించిన ఐటీ అధికారులు… రాజు కార్యాలాయాల నుంచి పెద్ద మొత్తంలో కీలక పత్రాలను స్వాధీనం చేసుకుని… రాజును వెంటబెట్టుకుని మరీ వెళ్లిపోయారు.
ఆ తర్వాత రాజును విచారించి అదికారులు ఆయనను వదిలేశారు.ఈ సందర్భంగా నిర్ణిత గడువు తర్వాత మరోమారు విచారణకు రాజుకు వారు చెప్పినట్లు తెలిసింది. ఈ క్రమంలో మంగళవారం రాజు పెద్ద మొత్తంలో పత్రాలను చేతబట్టుకుని ఐటీ కార్యాలయానికి వెళ్లారు. రాజువెళ్లిన తీరు చూస్తుంటే… ఈ దఫా విచారణ సుదీర్ఘంగానే సాగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఐటీ సోదాలను నాడు రాజు చాలా లైట్ గా తీసుకున్నట్లు ఆయన వ్యాఖ్యలు చెప్పాయి. అందరి మాదిరే తనపైనా ఐటీ రెయిడ్స్ జరుగుతున్నాయని, ఇందులో పెద్దగా ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదని ఆయన వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే… దిల్ రాజు ఇళ్లలో సోదాలు చేసిన సందర్భంగా ఐటీ అధికారురులు ఆయన సతీమణిని వెంటబెట్టుకుని బ్యాంకులకు తీసుకుని వెళ్లి మరీ లాకర్లను పరిశీలించిన వైనం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ సంక్రాంతికి విడుదలై మంచి వసూళ్లు రాబట్టిన మూడు సినిమాల్లో దిల్ రాజు కీలక పాత్ర ఉన్న సంగతి తెలిసిందే. వీటిలో రెండు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించిన రాజు.. ఓ సినిమాకు డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించారు. వీటి ద్వారా భారీ ఎత్తునే రాజు ఆర్జించారని, అయితే ఆ మేరకు ఆయన పన్ను చెల్లింపులు లేవన్న బావనతోనే ఐటీ సోదాలు జరిగాయన్న వాదనలు వినిపించాయి. మరి ఈ సోదాల నుంచి రాజు ఎప్పుడు బయటపడతారో చూడాలి.
This post was last modified on February 4, 2025 1:31 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…