టాలీవుడ్ ను కుదిపేసిన ఆదాయపన్ను శాఖ దాడులు ఇప్పుడప్పుడే ముగిసేలా లేవు. తెలంగాణ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా కొనసాగుతున్న బడా నిర్మాత దిల్ రాజు టార్గెట్ గా రోజుల తరబడి ఐటీ శాఖ సోదాలు చేసిన సంగతి తెలిసిందే. ఈ సోదాల్లో రాజు గారి ఇల్లు, కార్యాలయాలతో పాటుగా రాజు సోదరుడు శిరీష్, కుమార్తె హన్షితల ఇల్లు, కార్యాలయాలనూ ఐటీ అధికారులు జల్లెగ పట్టారు. ఈ సోదాలు ముగిసినట్లుగా ప్రకటించిన ఐటీ అధికారులు… రాజు కార్యాలాయాల నుంచి పెద్ద మొత్తంలో కీలక పత్రాలను స్వాధీనం చేసుకుని… రాజును వెంటబెట్టుకుని మరీ వెళ్లిపోయారు.
ఆ తర్వాత రాజును విచారించి అదికారులు ఆయనను వదిలేశారు.ఈ సందర్భంగా నిర్ణిత గడువు తర్వాత మరోమారు విచారణకు రాజుకు వారు చెప్పినట్లు తెలిసింది. ఈ క్రమంలో మంగళవారం రాజు పెద్ద మొత్తంలో పత్రాలను చేతబట్టుకుని ఐటీ కార్యాలయానికి వెళ్లారు. రాజువెళ్లిన తీరు చూస్తుంటే… ఈ దఫా విచారణ సుదీర్ఘంగానే సాగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఐటీ సోదాలను నాడు రాజు చాలా లైట్ గా తీసుకున్నట్లు ఆయన వ్యాఖ్యలు చెప్పాయి. అందరి మాదిరే తనపైనా ఐటీ రెయిడ్స్ జరుగుతున్నాయని, ఇందులో పెద్దగా ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదని ఆయన వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే… దిల్ రాజు ఇళ్లలో సోదాలు చేసిన సందర్భంగా ఐటీ అధికారురులు ఆయన సతీమణిని వెంటబెట్టుకుని బ్యాంకులకు తీసుకుని వెళ్లి మరీ లాకర్లను పరిశీలించిన వైనం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ సంక్రాంతికి విడుదలై మంచి వసూళ్లు రాబట్టిన మూడు సినిమాల్లో దిల్ రాజు కీలక పాత్ర ఉన్న సంగతి తెలిసిందే. వీటిలో రెండు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించిన రాజు.. ఓ సినిమాకు డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించారు. వీటి ద్వారా భారీ ఎత్తునే రాజు ఆర్జించారని, అయితే ఆ మేరకు ఆయన పన్ను చెల్లింపులు లేవన్న బావనతోనే ఐటీ సోదాలు జరిగాయన్న వాదనలు వినిపించాయి. మరి ఈ సోదాల నుంచి రాజు ఎప్పుడు బయటపడతారో చూడాలి.
This post was last modified on February 4, 2025 1:31 pm
వరస బ్లాక్ బస్టర్లతో విజయాలను వదలని విక్రమార్కుడిలా దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి నెక్స్ట్ వెంకటేష్ - కళ్యాణ్ రామ్…
ఏపీలో కీలక ఘట్టానికి కూటమి ప్రభుత్వం తెరదీయనుంది. `గూగుల్ డేటా` కేంద్రానికి కొబ్బరికాయ కొట్టేందుకు సిద్ధమైంది. గత ఏడాది ఈ…
రంగబలి తర్వాత నాగశౌర్య తెరమీద కనిపించి రెండేళ్లు దాటిపోయింది. వరస డిజాస్టర్లతో మార్కెట్ డ్యామేజ్ అయిన టైంలో సరైన కంబ్యాక్…
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను గెలిపించుకున్న పిఠాపురం ప్రజలు... ఇప్పుడు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని దాదాపుగా అన్ని…
టాలీవుడ్లో పెద్ద కుటుంబాల నుంచి వచ్చిన యువ కథానాయకుల్లో అత్యంత ఆడంబరంగా జరిగిన అరంగేట్రం అక్కినేని నాగచైతన్యదే అని చెప్పొచ్చు. టాలీవుడ్లో నంబర్…
తమిళనాడులోని:సాతాంకుళం లాకప్ డెత్ కేసులో మదురైలోని ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2020లో…