బుట్టబొమ్మ పూజా హెగ్డే తెరమీద కనిపించి రెండేళ్లకు దగ్గరవుతోంది. బాలీవుడ్ కిసీకా భాయ్ కిసీకా జాన్ డిజాస్టర్ తర్వాత మళ్ళీ కనిపించలేదు. వరస ఫ్లాపులతో తెలుగు తమిళ అవకాశాలు తగ్గిపోయాక దృష్టంతా హిందీ మీద పెట్టేసింది. ఒక బలమైన హిట్టు పడితే మళ్ళీ పుంజుకుంటుందనే నమ్మకంతో ఎదురు చూస్తోంది.
అసలైన పరీక్ష ఇవాళ మొదలుకానుంది. షాహిద్ కపూర్ తో నటించిన దేవా థియేటర్లకు వస్తోంది. ఎంతకైనా తెగించే ఒక పోలీస్ ఆఫీసర్ కథతో రూపొందిన దేవాలో పూజా హెగ్డే ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ గా పెర్ఫార్మన్స్ ఉన్న పాత్ర దక్కించుకుందట. ఫలితం మీద చాలా నమ్మకం పెట్టుకుంది.
మలయాళ దర్శకుడు రోషన్ ఆండ్రూస్ దేవాకు డైరెక్టర్. పన్నెండేళ్ల క్రితం ఈయన తీసిన ముంబై పోలీస్ ఒక సెన్సేషన్. దాన్నే సుధీర్ బాబుతో తెలుగులో హంట్ గా రీమేక్ చేస్తే తేడా కొట్టడం వేరే సంగతి. ఈ స్టోరీకె కొన్ని కీలక మార్పులు చేసి దేవాగా తీశారనే ప్రచారం ముంబై వర్గాల్లో ఉంది కానీ యూనిట్ మాత్రం వాటిని కొట్టిపారేస్తోంది.
ఇది పూర్తిగా వేరే కథని, ట్రైలర్ చూస్తే మీకు అర్థమవుతుందని డిఫెండ్ చేస్తోంది. షాహిద్ సైతం హిట్టు కోసం మొహం వాచిపోయి ఉన్నాడు. కబీర్ సింగ్ తర్వాత మళ్ళీ అంత పెద్ద సక్సెస్ దొరకలేదు. దేవా కనక ఆడితే మార్కెట్ తిరిగి బలపడుతుందని ఆశపడుతున్నాడు.
పూజా హెగ్డేకు మాత్రం ఈ ఏడాది అత్యంత కీలకం. దేవా తర్వాత మేలో సూర్యతో నటించిన రెట్రో వస్తుంది. గ్యాంగ్ స్టార్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాలో పూజా లుక్స్ డిఫరెంట్ గా ఉన్నాయి. తలపతి విజయ్ తో నటించిన జన నాయగన్ విడుదల తేదీ ఇంకా ఖరారు చేయలేదు. ఈ సంవత్సరమే రిలీజ్ చేస్తారా లేక 2026 సంక్రాంతికి వెళ్తారా అనేది తేలాల్సి ఉంది.
ఈ మూడు సినిమాలు పూజా హెగ్డే కెరీర్ ని నిర్ణయించబోతున్నాయి. ఇవి కాకుండా హే జవానీ హైతో ఇష్క్ హోనా హీ తా అనే మరో చిత్రం నిర్మాణంలో ఉంది కానీ ప్రాధాన్య పరంగా పైన చెప్పినవే చాలా కీలకం కాబోతున్నాయి. చూడాలి ఎలాంటి బ్రేక్ వస్తుందో.
This post was last modified on January 31, 2025 9:47 am
ప్రతిపక్ష హోదానే ప్రామాణికమా? ఇదీ.. కొన్నాళ్లుగా రాష్ట్రంలో జరుగుతున్న చర్చ. తాజాగా మరోసారి రచ్చకెక్కింది. ప్రతిపక్ష హోదా కోరుతూ.. అసెంబ్లీలో…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు క్రమశిక్షణకు ఎంత ప్రాధాన్యం ఇస్తారో అందరికీ తెలిసిందే. ఈ విషయంలో పార్టీ…
సినిమా చూపిస్త మావ, నేను లోకల్, హలో గురూ ప్రేమ కోసమే, ధమాకా చిత్రాలతో వరుస హిట్లు కొట్టిన దర్శకుడు…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో ఆ పార్టీ కీలక నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా సోమవారం…
సోషల్ మీడియా వేదికగా బ్రాండ్ ప్రమోషన్లో ప్రభంజనంలా పెరిగిన ఇన్ఫ్లూయెన్సర్ మార్కెటింగ్ ఇప్పుడు నెమ్మదిగా నమ్మకాన్ని కోల్పోతుంది. ఒకప్పుడు నిజమైన…
ఏపీ అసెంబ్లీలో వైసీపీకి ప్రతిపక్ష హోదా కావాలని నినాదాలు చేస్తూ నేటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో వైసీపీ సభ్యులు గందరగోళం…