బుట్టబొమ్మ పూజా హెగ్డే తెరమీద కనిపించి రెండేళ్లకు దగ్గరవుతోంది. బాలీవుడ్ కిసీకా భాయ్ కిసీకా జాన్ డిజాస్టర్ తర్వాత మళ్ళీ కనిపించలేదు. వరస ఫ్లాపులతో తెలుగు తమిళ అవకాశాలు తగ్గిపోయాక దృష్టంతా హిందీ మీద పెట్టేసింది. ఒక బలమైన హిట్టు పడితే మళ్ళీ పుంజుకుంటుందనే నమ్మకంతో ఎదురు చూస్తోంది.
అసలైన పరీక్ష ఇవాళ మొదలుకానుంది. షాహిద్ కపూర్ తో నటించిన దేవా థియేటర్లకు వస్తోంది. ఎంతకైనా తెగించే ఒక పోలీస్ ఆఫీసర్ కథతో రూపొందిన దేవాలో పూజా హెగ్డే ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ గా పెర్ఫార్మన్స్ ఉన్న పాత్ర దక్కించుకుందట. ఫలితం మీద చాలా నమ్మకం పెట్టుకుంది.
మలయాళ దర్శకుడు రోషన్ ఆండ్రూస్ దేవాకు డైరెక్టర్. పన్నెండేళ్ల క్రితం ఈయన తీసిన ముంబై పోలీస్ ఒక సెన్సేషన్. దాన్నే సుధీర్ బాబుతో తెలుగులో హంట్ గా రీమేక్ చేస్తే తేడా కొట్టడం వేరే సంగతి. ఈ స్టోరీకె కొన్ని కీలక మార్పులు చేసి దేవాగా తీశారనే ప్రచారం ముంబై వర్గాల్లో ఉంది కానీ యూనిట్ మాత్రం వాటిని కొట్టిపారేస్తోంది.
ఇది పూర్తిగా వేరే కథని, ట్రైలర్ చూస్తే మీకు అర్థమవుతుందని డిఫెండ్ చేస్తోంది. షాహిద్ సైతం హిట్టు కోసం మొహం వాచిపోయి ఉన్నాడు. కబీర్ సింగ్ తర్వాత మళ్ళీ అంత పెద్ద సక్సెస్ దొరకలేదు. దేవా కనక ఆడితే మార్కెట్ తిరిగి బలపడుతుందని ఆశపడుతున్నాడు.
పూజా హెగ్డేకు మాత్రం ఈ ఏడాది అత్యంత కీలకం. దేవా తర్వాత మేలో సూర్యతో నటించిన రెట్రో వస్తుంది. గ్యాంగ్ స్టార్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాలో పూజా లుక్స్ డిఫరెంట్ గా ఉన్నాయి. తలపతి విజయ్ తో నటించిన జన నాయగన్ విడుదల తేదీ ఇంకా ఖరారు చేయలేదు. ఈ సంవత్సరమే రిలీజ్ చేస్తారా లేక 2026 సంక్రాంతికి వెళ్తారా అనేది తేలాల్సి ఉంది.
ఈ మూడు సినిమాలు పూజా హెగ్డే కెరీర్ ని నిర్ణయించబోతున్నాయి. ఇవి కాకుండా హే జవానీ హైతో ఇష్క్ హోనా హీ తా అనే మరో చిత్రం నిర్మాణంలో ఉంది కానీ ప్రాధాన్య పరంగా పైన చెప్పినవే చాలా కీలకం కాబోతున్నాయి. చూడాలి ఎలాంటి బ్రేక్ వస్తుందో.
This post was last modified on January 31, 2025 9:47 am
వచ్చే వారం ది కేరళ స్టోరీ 2 విడుదల కానుంది. మూడేళ్ళ క్రితం వచ్చిన మొదటి భాగం ఎంత సంచలనం…
రాజకీయ పార్టీలు ఓట్ల కోసం కురిపిస్తున్న ఉచితాల ఆఫర్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం…
ఒకప్పుడు శంకర్తో సినిమా చేయడానికి వివిధ ఇండస్ట్రీల టాప్ స్టార్లు, అగ్ర నిర్మాతలు లైన్లో ఉండేవారు. మెగాస్టార్ చిరంజీవి అంతటి…
ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు ఎగ్గొట్టిన మాజీ సీఎం జగన్…తాపీగా ఈ రోజు మీడియా ముందుకు వచ్చారు. బడ్జెట్ లో…
ఫంకీ ఫలితం త్వరగా తేలిపోవడంతో హీరో విశ్వక్ సేన్, నిర్మాణ సంస్థ సితార హఠాత్తుగా సైలెంటైపోయాయి. ఊరికే లేనిపోని హడావిడి…
వైసీపీ మాజీ ఎంపీ, ఆ పార్టీ మాజీ నేత రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ వ్యవహారం జగన్ హయాంలో దేశవ్యాప్తంగా సంచలనం…