నందమూరి అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న క్షణం వచ్చేసింది. దశాబ్దాలుగా కంటున్న కల నిజమయ్యింది. బాలకృష్ణకు ప్రతిష్టాత్మక పద్మభూషణ్ పురస్కారాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. బాలయ్య ఈ పురస్కారం అందుకోవడం ఫ్యాన్స్ కి చిరకాల జ్ఞాపకంగా నిలిచిపోనుంది. కళల విభాగంలో తెలుగు రాష్ట్రాల నుంచి పద్మభూషణ్ బాలకృష్ణ అందుకోనుండగా తమిళనాడు నుంచి అజిత్ కు అర్హత దక్కింది. ఇద్దరూ అగ్ర హీరోలే కావడం విశేషం.
తాతమ్మ కలతో తెరంగేట్రం చేసిన బాలకృష్ణ బాలనటుడిగా కొన్ని సినిమాల్లో నటించాక తండ్రి స్వర్గీయ ఎన్టీఆర్ దర్శకత్వంలో ఆయనతో పాటు తెరను పంచుకుని ఆరితేరారు. సోలో హీరోగా 1984 లో సాహసమే జీవితంతో కెరీర్ మొదలుపెట్టారు. తొలి ఇండస్ట్రీ బ్రేక్ మంగమ్మ గారి మనవడుతో అందుకున్నాక వెనక్కు తిరిగి చూడాల్సిన అవసరం లేకపోయింది.
ముద్దుల మావయ్యతో మహిళా ప్రేక్షకుల ఆదరణ సొంతం చేసుకున్నాక లారీ డ్రైవర్, రౌడీ ఇన్స్ పెక్టర్ లాంటి చిత్రాలు మాస్ లో బలమైన ఫాలోయింగ్ పెంచాయి. స్టార్ హీరోగా పీక్స్ చూస్తున్న టైంలోనే టాలీవుడ్ తొలి సైన్స్ ఫిక్షన్ ఆదిత్య 369 చేసిన ఘనత బాలకృష్ణకే దక్కింది.
ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో సమరసింహారెడ్డి చేసి పరిశ్రమకో కొత్త జానర్ ను పరిచయం చేసిన బాలయ్య వందకు పైగా సినిమాలతో ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు. ఫ్లాపులు పలకరిస్తున్న టైంలో సింహతో కంబ్యాక్ ఇచ్చి రికార్డుల వేట మొదలుపెట్టడం ఎవరూ మర్చిపోలేరు. తాజాగా డాకు మహారాజ్ తో వరసగా నాలుగు బ్లాక్ బస్టర్స్ తో ఆరు పదుల వయసులోనూ దూకుడు మీదున్న బాలకృష్ణ హిందుపూర్ ఎమ్మెల్యేగా మూడు పర్యాయాలు ఎంపికై అభివృద్ధిలో తనదైన ముద్ర వేశారు.
బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా వేలాది రోగులకు జీవదానం చేస్తూ బుల్లితెరపై అన్ స్టాపబుల్ గా దూసుకుపోవడం ఆయనకే చెల్లింది. కళాకారులు ఆభరణంగా భావించే పద్మభూషణ్ బాలకృష్ణ కిరీటంలో చేరడం సినీ ప్రియులను ఆనందంలో ముంచెత్తుతోంది.
This post was last modified on January 25, 2025 9:58 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…