నందమూరి అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న క్షణం వచ్చేసింది. దశాబ్దాలుగా కంటున్న కల నిజమయ్యింది. బాలకృష్ణకు ప్రతిష్టాత్మక పద్మభూషణ్ పురస్కారాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. బాలయ్య ఈ పురస్కారం అందుకోవడం ఫ్యాన్స్ కి చిరకాల జ్ఞాపకంగా నిలిచిపోనుంది. కళల విభాగంలో తెలుగు రాష్ట్రాల నుంచి పద్మభూషణ్ బాలకృష్ణ అందుకోనుండగా తమిళనాడు నుంచి అజిత్ కు అర్హత దక్కింది. ఇద్దరూ అగ్ర హీరోలే కావడం విశేషం.
తాతమ్మ కలతో తెరంగేట్రం చేసిన బాలకృష్ణ బాలనటుడిగా కొన్ని సినిమాల్లో నటించాక తండ్రి స్వర్గీయ ఎన్టీఆర్ దర్శకత్వంలో ఆయనతో పాటు తెరను పంచుకుని ఆరితేరారు. సోలో హీరోగా 1984 లో సాహసమే జీవితంతో కెరీర్ మొదలుపెట్టారు. తొలి ఇండస్ట్రీ బ్రేక్ మంగమ్మ గారి మనవడుతో అందుకున్నాక వెనక్కు తిరిగి చూడాల్సిన అవసరం లేకపోయింది.
ముద్దుల మావయ్యతో మహిళా ప్రేక్షకుల ఆదరణ సొంతం చేసుకున్నాక లారీ డ్రైవర్, రౌడీ ఇన్స్ పెక్టర్ లాంటి చిత్రాలు మాస్ లో బలమైన ఫాలోయింగ్ పెంచాయి. స్టార్ హీరోగా పీక్స్ చూస్తున్న టైంలోనే టాలీవుడ్ తొలి సైన్స్ ఫిక్షన్ ఆదిత్య 369 చేసిన ఘనత బాలకృష్ణకే దక్కింది.
ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో సమరసింహారెడ్డి చేసి పరిశ్రమకో కొత్త జానర్ ను పరిచయం చేసిన బాలయ్య వందకు పైగా సినిమాలతో ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు. ఫ్లాపులు పలకరిస్తున్న టైంలో సింహతో కంబ్యాక్ ఇచ్చి రికార్డుల వేట మొదలుపెట్టడం ఎవరూ మర్చిపోలేరు. తాజాగా డాకు మహారాజ్ తో వరసగా నాలుగు బ్లాక్ బస్టర్స్ తో ఆరు పదుల వయసులోనూ దూకుడు మీదున్న బాలకృష్ణ హిందుపూర్ ఎమ్మెల్యేగా మూడు పర్యాయాలు ఎంపికై అభివృద్ధిలో తనదైన ముద్ర వేశారు.
బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా వేలాది రోగులకు జీవదానం చేస్తూ బుల్లితెరపై అన్ స్టాపబుల్ గా దూసుకుపోవడం ఆయనకే చెల్లింది. కళాకారులు ఆభరణంగా భావించే పద్మభూషణ్ బాలకృష్ణ కిరీటంలో చేరడం సినీ ప్రియులను ఆనందంలో ముంచెత్తుతోంది.
This post was last modified on January 25, 2025 9:58 pm
త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు కీలక కసరత్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…
ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…
తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…
చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్లో మంచి క్రేజ్తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…