ఇటీవలే బాలీవుడ్ కల్ట్ క్లాసిక్ సత్య రీ రిలీజయ్యింది. 1998లో మొదటిసారి విడుదలైనప్పుడు ఇదో మాస్టర్ పీస్ లా నిలిచిపోయింది. అప్పటిదాకా హిందీలో పెద్దగా గుర్తింపు లేని జెడి చక్రవర్తికి ఇమేజ్ తేవడంతో పాటు మనోజ్ బాజ్ పాయ్ ని ఓవర్ నైట్ స్టార్ గా మార్చింది.
ఒక గ్యాంగ్ స్టర్ డ్రామాని చాలా ఇంటెన్స్ తో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీర్చిదిద్దిన విధానం ఎందరికో స్ఫూర్తినిచ్చింది. సత్యని ఇన్స్ పిరేషన్ గా తీసుకుని ఎన్ని సినిమాలు తీశారో లెక్కబెట్టడం కష్టం. అంతకు ముందు గాడ్ ఫాదర్, నాయకుడు లాంటి చిత్రాల గురించి చెప్పుకునేవారు సత్య పేరుని వాటి సరసన జోడించారు.
అందుకే ఇన్ని సంవత్సరాల తర్వాత సత్య మళ్ళీ థియేటర్లలో చూసే అవకాశం దక్కడం పట్ల మూవీ లవర్స్ సంతోషం వ్యక్తం చేశారు. రీ మాస్టర్ చేసిన కొత్త ప్రింట్ తో గతంలో చూడని అనుభూతిని పొందారు. ఇది స్వయానా రామ్ గోపాల్ వర్మనే కదిలించింది.
ఈ సినిమా తీసే టైంలో ఉన్న నిజాయితీ ఇప్పుడు కొరవడిందని, షో చూసి ఇంటికొచ్చాక ఒకరకమైన శూన్యం, కన్నీళ్లు తనను ఆవహించాయని, ఇకపై మేల్కొని తనలో రియల్ ఫిలిం మేకర్ ని బయటికి తీసుకొస్తానని సుదీర్ఘమైన పోస్టుని సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. అంటే సత్య జ్ఞానోదయం రామ్ గోపాల్ వర్మ మీద బలంగా పని చేసిందన్న మాట.
సినీ ప్రియులు కోరుకుంటున్నది ఇదే. ఒకప్పుడు శివ, క్షణక్షణం, రంగీలా, కంపెనీ, భూత్ లాంటి లైబ్రరి సినిమాలు తీసిన వర్మ మొన్నటి ఎన్నికల వరకు ఒక రాజకీయ పార్టీకి కొమ్ము కాస్తూ ఏదేదో సినిమాలు తీయడం ఫ్యాన్స్ ని బాధ పెట్టింది. అవసరం లేని వివాదాల మీద చిత్రాలు తీసి సొమ్ము చేసుకోవాలనుకోవడం మిస్ ఫైర్ అయ్యింది.
మరీ సత్య రేంజ్ లో కాకపోయినా కనీసం ఇది చూడొచ్చు అని అందరూ అనుకునేలా ఏదైనా తీయాలని అభిమానుల కోరిక. అయినా వర్మని గెస్ చేయలేం. ఇప్పుడు చూపించిన జ్ఞానోదయం నిజమైతే సంతోషమే కానీ ఓ రెండు రోజులయ్యాక తూచ్ అన్నా ఆశ్చర్యపోవడానికి ఏమి లేదు.
This post was last modified on January 20, 2025 12:10 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…