తెలుగులో సంక్రాంతి పండక్కి సినిమాల సందడి ఎలా ఉంటుందో చెప్పేదేముంది? టాలీవుడ్కు సంబంధించి ఇదే బిగ్గెస్ట్ షార్ట్ సీజన్. ఈ టైంలో టాక్ బాగుంటే మామూలు రోజుల్లో కంటే ఎక్కువ వసూళ్లు వస్తాయి. అదే సమయంలో పోటీ ఎక్కువ ఉండడం వల్ల టాక్ బాలేని సినిమాలకు గట్టి దెబ్బ కూడా పడుతుంటుంది. ఈసారి ఆ దెబ్బ గేమ్ చేంజర్ మీద పడింది. సంక్రాంతి రేసులో ముందుగా వచ్చిన ఈ సినిమాకు యావరేజ్ టాక్ వచ్చింది. ఓపెనింగ్స్ వరకు పర్వాలేదనిపించినా.. తర్వాత సినిమా తడబడుతూ సాగుతోంది. ఆక్యుపెన్సీలు అంతంతమాత్రంగా ఉన్నాయి. ఈ సినిమా మీద భారీ పెట్టుబడులు పెట్టిన నిర్మాత, బయ్యర్లకు ఇబ్బందులు తప్పలేదు. కానీ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేసిన దిల్ రాజే.. సంక్రాంతికి వస్తున్నాంను కూడా ప్రొడ్యూస్ చేశారు. తన రెగ్యులర్ బయ్యర్లకే ఈ సినిమాను కూడా అందించారు. దీంతో గేమ్ చేంజర్తో పడ్డ డెంట్ను సంక్రాంతికి వస్తున్నాం కవర్ చేస్తోంది.
యుఎస్ లాంటి చోట్ల మాత్రమే గేమ్ చేంజర్కు మరీ ఎక్కువ నష్టాలు వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో అయితే ఈ సినిమాతో వస్తున్న నష్టాలను సంక్రాంతికి వస్తున్నాం ద్వారా వస్తున్న లాభాలు చాలా వరకు భర్తీ చేసేస్తున్నాయి. రెండు సినిమాలకు వేర్వేరు బయ్యర్లు ఉన్న చోట దిల్ రాజు నష్టాల భర్తీ చేసే ఆలోచనలో ఉన్నారు. కాబట్టి ఇబ్బంది లేదు. మరోవైపు డాకు మహారాజ్ సినిమా నిర్మాత, బయ్యర్లకు మంచి లాభాలను అందిస్తోంది. ఈ చిత్రాన్ని కూడా దిల్ రాజే నైజాం ఏరియాలో డిస్ట్రబ్యూట్ చేసిన సంగతి తెలిసిందే. కాబట్టి ఈ మూవీ ద్వారా కూడా ఆయనకు మంచి లాభాలు రానున్నాయి. కాబట్టి గేమ్ చేంజర్ నష్టాల భర్తీకి ఇది కూడా ఉపయోగపడుతుంది.
కాబట్టి ఓవరాల్గా ఆయన బ్యాలెన్స్ షీట్ చాలా బెటర్గానే ఉంటుంది. ఓవరాల్గా చూస్తే గేమ్ చేంజర్ ఫలితం విషయంలో హీరో, డైరెక్టర్ ఫీలవ్వాలి కానీ.. దాని మీద డబ్బులు పెట్టిన నిర్మాత మాత్రం సేఫే. ఇక మిగతా రెండు సంక్రాంతి చిత్రాల్లో భాగమైన అందరూ ఫుల్ ఖుషీ అన్నట్లే. కాబట్టి ఓవరాల్గా 2025 సంక్రాంతికి ఆల్ హ్యాపీస్ అన్నట్లే.
This post was last modified on January 18, 2025 12:04 pm
గత ఏడాది డిసెంబర్ దురంధర్ విడుదలతో మొదలుపెట్టి మార్చిలో రిలీజైన దురంధర్ ది రివెంజ్ దాకా పాకిస్థాన్ జనాలు, మీడియా…
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…
గత పది రోజులుగా తమిళనాడు రాజకీయాలు దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…
ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…
నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలకు కేరళలో తీవ్రనిరసన సెగ తగులుతోంది. రాహుల్-ప్రియాంక.. కేరళ మిమ్మల్ని క్షమించదు.…