తెలుగులో సంక్రాంతి పండక్కి సినిమాల సందడి ఎలా ఉంటుందో చెప్పేదేముంది? టాలీవుడ్కు సంబంధించి ఇదే బిగ్గెస్ట్ షార్ట్ సీజన్. ఈ టైంలో టాక్ బాగుంటే మామూలు రోజుల్లో కంటే ఎక్కువ వసూళ్లు వస్తాయి. అదే సమయంలో పోటీ ఎక్కువ ఉండడం వల్ల టాక్ బాలేని సినిమాలకు గట్టి దెబ్బ కూడా పడుతుంటుంది. ఈసారి ఆ దెబ్బ గేమ్ చేంజర్ మీద పడింది. సంక్రాంతి రేసులో ముందుగా వచ్చిన ఈ సినిమాకు యావరేజ్ టాక్ వచ్చింది. ఓపెనింగ్స్ వరకు పర్వాలేదనిపించినా.. తర్వాత సినిమా తడబడుతూ సాగుతోంది. ఆక్యుపెన్సీలు అంతంతమాత్రంగా ఉన్నాయి. ఈ సినిమా మీద భారీ పెట్టుబడులు పెట్టిన నిర్మాత, బయ్యర్లకు ఇబ్బందులు తప్పలేదు. కానీ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేసిన దిల్ రాజే.. సంక్రాంతికి వస్తున్నాంను కూడా ప్రొడ్యూస్ చేశారు. తన రెగ్యులర్ బయ్యర్లకే ఈ సినిమాను కూడా అందించారు. దీంతో గేమ్ చేంజర్తో పడ్డ డెంట్ను సంక్రాంతికి వస్తున్నాం కవర్ చేస్తోంది.
యుఎస్ లాంటి చోట్ల మాత్రమే గేమ్ చేంజర్కు మరీ ఎక్కువ నష్టాలు వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో అయితే ఈ సినిమాతో వస్తున్న నష్టాలను సంక్రాంతికి వస్తున్నాం ద్వారా వస్తున్న లాభాలు చాలా వరకు భర్తీ చేసేస్తున్నాయి. రెండు సినిమాలకు వేర్వేరు బయ్యర్లు ఉన్న చోట దిల్ రాజు నష్టాల భర్తీ చేసే ఆలోచనలో ఉన్నారు. కాబట్టి ఇబ్బంది లేదు. మరోవైపు డాకు మహారాజ్ సినిమా నిర్మాత, బయ్యర్లకు మంచి లాభాలను అందిస్తోంది. ఈ చిత్రాన్ని కూడా దిల్ రాజే నైజాం ఏరియాలో డిస్ట్రబ్యూట్ చేసిన సంగతి తెలిసిందే. కాబట్టి ఈ మూవీ ద్వారా కూడా ఆయనకు మంచి లాభాలు రానున్నాయి. కాబట్టి గేమ్ చేంజర్ నష్టాల భర్తీకి ఇది కూడా ఉపయోగపడుతుంది.
కాబట్టి ఓవరాల్గా ఆయన బ్యాలెన్స్ షీట్ చాలా బెటర్గానే ఉంటుంది. ఓవరాల్గా చూస్తే గేమ్ చేంజర్ ఫలితం విషయంలో హీరో, డైరెక్టర్ ఫీలవ్వాలి కానీ.. దాని మీద డబ్బులు పెట్టిన నిర్మాత మాత్రం సేఫే. ఇక మిగతా రెండు సంక్రాంతి చిత్రాల్లో భాగమైన అందరూ ఫుల్ ఖుషీ అన్నట్లే. కాబట్టి ఓవరాల్గా 2025 సంక్రాంతికి ఆల్ హ్యాపీస్ అన్నట్లే.
This post was last modified on January 18, 2025 12:04 pm
ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లు.. మూడు రోజుల సంక్రాంతి పండుగను పురస్కరించుకుని వారి సొంత ఊరు వెళ్లేందుకు…
రాష్ట్రంలో అభివృద్ది చేసే విషయంలో ఎవరు ఎన్ని విధాల అడ్డు పడినా.. తాము ముందుకు సాగుతామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్…
2026 బడ్జెట్ ద్వారా నిర్మలా సీతారామన్ టీమ్ ఒక పెద్ద సవాలును ఎదుర్కోబోతోంది. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన…
భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్లో టీమ్ ఇండియాకు ఊహించని మార్పు చోటుచేసుకుంది. గాయంతో దూరమైన ఆల్ రౌండర్…
ప్రజల కోసం తాను ఒక్కరోజు కూడా సెలవుతీసుకోకుండా.. అవిశ్రాంతంగా పనిచేస్తున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ…
సమస్య చిన్నదయినా, పెద్దదయినా తన దృష్టికి వస్తే పరిష్కారం కావాల్సిందేనని నిత్యం నిరూపిస్తూనే ఉన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్…