ఏదైనా పెద్ద సినిమాకు సంగీత దర్శకుడిని ఎంచుకునే పని స్టార్ హీరోల దర్శకులకు పెద్ద సవాల్ గా మారుతున్న తరుణంలో ఇప్పుడు భీమ్స్ ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారాడు. పండగ బ్లాక్ బస్టర్ సంక్రాంతికి వస్తున్నాంకి అతను ఇచ్చింది మూడు పాటలే.
వాటిలో గోదారి గట్టు మీద చందమామవే ఏకంగా ఓపెనింగ్స్ లో సింహ భాగం పోషించే రేంజ్ లో ఛార్ట్ బస్టర్ అయ్యింది. తమన్ కంపోజ్ చేసిన గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ పాటల కన్నా వేగంగా వంద మిలియన్ల క్లబ్బులో చేరింది భీమ్స్ సాంగ్సే. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పరంగానూ ఇతని మీద ప్రశంసల వర్షం కురుస్తోంది. కొన్ని లక్షల రీల్స్ ఈ పాటల మీద వచ్చాయి.
మాములుగా ఆడియో కంపెనీలు ఏదైనా బడా మూవీ హక్కులు కొనేటప్పుడు ఎన్ని పాటలు ఉన్నాయనేది ముందు చూసుకుంటారు. దాన్ని బట్టే రేట్ ఉంటుంది. ఎన్ని ఎక్కువ ఉంటే అన్ని వ్యూస్ పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి. కానీ అనిల్ రావిపూడి దానికి కట్టుబడకుండా కేవలం కథ డిమాండ్ కు అనుగుణంగా మూడుతోనే సరిపుచ్చాడు.
కాకపోతే అవి బెస్ట్ కావాలని భీమ్స్ తో కో ఆర్డినేట్ చేసుకుని 2025 బెస్ట్ ఆల్బమ్ అయ్యే రేంజ్ లో వర్క్ చేయించుకున్నాడు. దాని ఫలితమే ఫ్యామిలీ ఆడియన్స్ లో ఎక్కడ లేని క్రేజ్ తీసుకొచ్చింది. పాటలు బాగున్నాయి కాబట్టి సినిమా బాగుంటుందనే ఫీలింగ్ రిలీజ్ కు ముందే వచ్చేసింది.
మ్యూజిక్ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో చెప్పేందుకు ఇంతకన్నా ఉదాహరణ అక్కర్లేదు. వందల కోట్ల బడ్జెట్ పెట్టినా కొన్నిసార్లు కేవలం పాటల వల్లే బజ్ హెచ్చుతగ్గులకు గురైన సందర్భాలు ఎన్నో. తమన్, దేవిశ్రీప్రసాద్ ఎందుకో తమ మేజిక్ ని పూర్తి స్థాయిలో ఆవిష్కరించుకోలేకపోతున్న టైంలో భీమ్స్ ఇలా దూసుకురావడం శుభ పరిణామం.
చిరంజీవి అనిల్ రావిపూడి సినిమాకు కూడా ఇతన్నే తీసుకున్నారనే లీక్ ఆల్రెడీ చక్కర్లు కొడుతోంది. ఇది నిజమైతే మెగా జాక్ పాట్ తగిలినట్టే. పోకిరిలో మహేష్ స్టైల్ లో చెప్పాలంటే పాటలు ఎన్ని ఇచ్చామనేది కాదు, ఇచ్చినవి అదిరిపోయాయా లేదా. సంక్రాంతికి వస్తున్నాంకు జరిగింది ఇదే.
This post was last modified on January 18, 2025 10:35 am
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…