ఏదైనా పెద్ద సినిమాకు సంగీత దర్శకుడిని ఎంచుకునే పని స్టార్ హీరోల దర్శకులకు పెద్ద సవాల్ గా మారుతున్న తరుణంలో ఇప్పుడు భీమ్స్ ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారాడు. పండగ బ్లాక్ బస్టర్ సంక్రాంతికి వస్తున్నాంకి అతను ఇచ్చింది మూడు పాటలే.
వాటిలో గోదారి గట్టు మీద చందమామవే ఏకంగా ఓపెనింగ్స్ లో సింహ భాగం పోషించే రేంజ్ లో ఛార్ట్ బస్టర్ అయ్యింది. తమన్ కంపోజ్ చేసిన గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ పాటల కన్నా వేగంగా వంద మిలియన్ల క్లబ్బులో చేరింది భీమ్స్ సాంగ్సే. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పరంగానూ ఇతని మీద ప్రశంసల వర్షం కురుస్తోంది. కొన్ని లక్షల రీల్స్ ఈ పాటల మీద వచ్చాయి.
మాములుగా ఆడియో కంపెనీలు ఏదైనా బడా మూవీ హక్కులు కొనేటప్పుడు ఎన్ని పాటలు ఉన్నాయనేది ముందు చూసుకుంటారు. దాన్ని బట్టే రేట్ ఉంటుంది. ఎన్ని ఎక్కువ ఉంటే అన్ని వ్యూస్ పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి. కానీ అనిల్ రావిపూడి దానికి కట్టుబడకుండా కేవలం కథ డిమాండ్ కు అనుగుణంగా మూడుతోనే సరిపుచ్చాడు.
కాకపోతే అవి బెస్ట్ కావాలని భీమ్స్ తో కో ఆర్డినేట్ చేసుకుని 2025 బెస్ట్ ఆల్బమ్ అయ్యే రేంజ్ లో వర్క్ చేయించుకున్నాడు. దాని ఫలితమే ఫ్యామిలీ ఆడియన్స్ లో ఎక్కడ లేని క్రేజ్ తీసుకొచ్చింది. పాటలు బాగున్నాయి కాబట్టి సినిమా బాగుంటుందనే ఫీలింగ్ రిలీజ్ కు ముందే వచ్చేసింది.
మ్యూజిక్ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో చెప్పేందుకు ఇంతకన్నా ఉదాహరణ అక్కర్లేదు. వందల కోట్ల బడ్జెట్ పెట్టినా కొన్నిసార్లు కేవలం పాటల వల్లే బజ్ హెచ్చుతగ్గులకు గురైన సందర్భాలు ఎన్నో. తమన్, దేవిశ్రీప్రసాద్ ఎందుకో తమ మేజిక్ ని పూర్తి స్థాయిలో ఆవిష్కరించుకోలేకపోతున్న టైంలో భీమ్స్ ఇలా దూసుకురావడం శుభ పరిణామం.
చిరంజీవి అనిల్ రావిపూడి సినిమాకు కూడా ఇతన్నే తీసుకున్నారనే లీక్ ఆల్రెడీ చక్కర్లు కొడుతోంది. ఇది నిజమైతే మెగా జాక్ పాట్ తగిలినట్టే. పోకిరిలో మహేష్ స్టైల్ లో చెప్పాలంటే పాటలు ఎన్ని ఇచ్చామనేది కాదు, ఇచ్చినవి అదిరిపోయాయా లేదా. సంక్రాంతికి వస్తున్నాంకు జరిగింది ఇదే.
This post was last modified on January 18, 2025 10:35 am
ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లు.. మూడు రోజుల సంక్రాంతి పండుగను పురస్కరించుకుని వారి సొంత ఊరు వెళ్లేందుకు…
రాష్ట్రంలో అభివృద్ది చేసే విషయంలో ఎవరు ఎన్ని విధాల అడ్డు పడినా.. తాము ముందుకు సాగుతామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్…
2026 బడ్జెట్ ద్వారా నిర్మలా సీతారామన్ టీమ్ ఒక పెద్ద సవాలును ఎదుర్కోబోతోంది. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన…
భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్లో టీమ్ ఇండియాకు ఊహించని మార్పు చోటుచేసుకుంది. గాయంతో దూరమైన ఆల్ రౌండర్…
ప్రజల కోసం తాను ఒక్కరోజు కూడా సెలవుతీసుకోకుండా.. అవిశ్రాంతంగా పనిచేస్తున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ…
సమస్య చిన్నదయినా, పెద్దదయినా తన దృష్టికి వస్తే పరిష్కారం కావాల్సిందేనని నిత్యం నిరూపిస్తూనే ఉన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్…