సంక్రాంతికి ప్రతిసారీ మూడు నాలుగు సినిమాలు రిలీజ్ కావడం మామూలే. కానీ వాటిలో ఒకటి రెండు మంచి టాక్ తెచ్చుకుని దూసుకెళ్తాయి. మిగతావి బోల్తా కొడుతుంటాయి. సంక్రాంతికి 100 పర్సంట్ సక్సెస్ రేట్ చాలా అరుదుగా కనిపిస్తుంటుంది. 2017లో ఆ అరుదైన దృశ్యమే చూశాం. ఖైదీ నంబర్ 150, గౌతమీపుత్ర శాతకర్ణి, శతమానం భవతి చిత్రాలు మూడూ పాజిటివ్ టాక్ తెచ్చుకుని మంచి వసూళ్లు సాధించాయి.
దానికి ముందు, తర్వాత ఎప్పుడూ సంక్రాంతికి 100 పర్సంట్ సక్సెస్ చూడలేదు. ఐతే ఈ ఏడాది రిలీజైన మూడు సినిమాల్లో ఏదీ పూర్తి నెగెటివ్ టాక్ తెచ్చుకోకపోవడం విశేషం. మూడు చిత్రాలకూ ఓపెనింగ్స్కు ఢోకా లేదు. సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బస్టర్ దిశగా దూసుకెళ్తుండగా.. ‘డాకు మహారాజ్’ సూపర్ హిట్ దిశగా అడుగులు వేస్తోంది. యావరేజ్ టాక్తో మొదలైన ‘గేమ్ చేంజర్’ పడుతూ లేస్తూ సాగుతోంది.
ఆ చిత్రానికి నష్టాలు తప్పవు కానీ.. ఫ్లాప్ అనే పరిస్థితి అయితే లేనట్లే కనిపిస్తోంది. ఇప్పటిదాకా సంక్రాంతికి ఎన్నడూ జరగని ఓ ఘనత ఈసారి సాధ్యమవుతుండడం విశేషం. తెలుగు నుంచి రిలీజైన మూడు చిత్రాలూ వంద కోట్ల గ్రాస్ కలెక్షన్ల క్లబ్బులోకి అడుగు పెడుతున్నాయి. ‘గేమ్ చేంజర్’ తొలి రోజే ఈ మార్కుకు చేరువగా వెళ్లింది. ప్రస్తుతం కలెక్షన్లు రూ.200 కోట్ల మార్కుకు చేరువగా ఉన్నాయి.
‘డాకు మహారాజ్’ విడుదలైన నాలుగో రోజు వంద కోట్ల క్లబ్బులోకి అడుగు పెట్టింది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ తొలి రోజే రూ.45 కోట్లు కొల్లగొట్టింది. రెండో రోజుకు వసూళ్లు రూ.80 కోట్లకు చేరుకున్నాయి. ఈ రోజు ఈ చిత్రం వంద కోట్ల క్లబ్బులోకి అడుగు పెట్టడం లాంఛనమే.
దేని టాక్ ఎలా ఉంది, అంతిమంగా ఎలాంటి ఫలితాన్ని అందుకోబోతున్నాయి అన్నది పక్కన పెడితే.. తెలుగులో ఈ పండక్కి రిలీజైన ప్రతి సినిమా వంద కోట్ల క్లబ్బులోకి అడుగు పెట్టడం టాలీవుడ్ బాక్సాఫీస్ స్టామినాను ప్రపంచానికి చాటి చెప్పేదే. మొత్తంగా ఈ సంక్రాంతికి టాలీవుడ్ బాక్సాఫీస్ రూ.500 కోట్లకు పైగా బిజినెస్ చేసేలా కనిపిస్తుండడం విశేషం.
This post was last modified on January 17, 2025 8:17 am
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…