టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ట్యాగ్ ని సంవత్సరాల తరబడి మోస్తున్న ప్రభాస్ పెళ్లి శుభవార్తని వినాలనే కొద్దీ ఆలస్యమవుతూనే ఉంది. పెదనాన్న కృష్ణంరాజు గారు ఉన్నప్పుడే ఈ శుభకార్యం చేయాలని చూశారు కానీ అమ్మాయి దొరక్క వాయిదా పడుతూ వెళ్ళింది. ఈలోగా ఆయన కాలం చేయడం దురదృష్టం. బాహుబలితో ప్యాన్ ఇండియా ఇమేజ్ వచ్చాక డార్లింగ్ ఇంకా బిజీ అయిపోయాడు. ఇతర హీరోలు ఆచితూచి అడుగులు వేస్తూ రెండేళ్లకు ఒక సినిమా చేయడమే గగనంగా ఫీలవుతుంటే తను మాత్రం ఏకంగా రెండు సెట్స్ మీద ఉంచి మరో మూడింటికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అంత వేగంగా పరుగులు పెడుతున్నాడు.
త్వరలోనే ప్రభాస్ ఇంటివాడు ఖాయమనే మాట బలంగా వినిపిస్తోంది. అన్ స్టాపబుల్ 4లో బాలకృష్ణ అడిగిన ప్రశ్నకు సమాధానంగా రామ్ చరణ్, ప్రభాస్ ల మధ్యలో జరిగిన ఫోన్ సంభాషణ ద్వారా ఈ శుభవార్త బయటికి వచ్చేసిందిట. ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా గణపవరంకు చెందిన అమ్మాయితో సంబంధం కుదిరిందని, త్వరలో ఈ కబురు అందరితో పంచుకుంటామని అన్నారట. అయితే పేరు, కుటుంబ వివరాలు ఏవీ చెప్పలేదు కానీ సస్పెన్స్ పూర్తిగా తీరలేదు. షోకు హాజరైన ప్రేక్షకుల ద్వారా ఈ లీక్ వచ్చింది కానీ ఎంతమేరకు నిజమో జనవరి 14 టెలికాస్ట్ అయ్యే రెండో ఎపిసోడ్ లో బయటపడుతుంది.
బాలయ్య, రామ్ చరణ్ ల మధ్య జరిగిన సరదా సంభాషణలు బాగా ఎంజాయ్ చేసిన ప్రేక్షకులు ఇప్పుడు రెండో భాగం కోసం ఎదురు చూస్తున్నారు. ట్రైలర్ లో చూపించిన అసలు కంటెంట్ ఇందులోనే ఉంది. ఒకవేళ ప్రభాస్ పెళ్లి కనక ఈ ఏడాదే ఉంటే సంబరం మాములుగా ఉండదు. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా సెలబ్రిటీలందరూ చేయబోయే సందడి చూసేందుకు రెండు కళ్ళు సరిపోవు. ఆతిధ్యానికి మారు పేరుగా చెప్పుకునే ప్రభాస్ ఇక తన పెళ్లికి ఎలాంటి విందు వినోదంతో ఉక్కిరిబిక్కిరి చేస్తాడో ఊహించుకోవడం కష్టం. ఆ శుభఘడియల కోసం ఫ్యాన్స్ తో పాటు సగటు ప్రేక్షకులూ వెయిటింగ్.
This post was last modified on January 11, 2025 6:14 pm
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…