మొన్నటిదాకా అసలెవరో తెలియని ఇమాన్వి ఇస్మాయిల్ ప్రభాస్ సరసన హీరోయిన్ గా ఎంపిక కాగానే ఒక్కసారిగా ఇతర బాషల నిర్మాతల దృష్టిలో పడిపోయింది. హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ప్రీ ఇండిపెండెన్స్ పీరియాడిక్ డ్రామా ఫౌజీ (ప్రచారంలో ఉన్న టైటిల్) లో డార్లింగ్ జోడిగా ఈ అమ్మడుకి డెబ్యూనే ఇంత పెద్ద బ్రేక్ దక్కడం పట్ల ఆల్రెడీ ఫిలిం నగర్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇదిలా ఉండగా తన మీద బాలీవుడ్ మేకర్స్ కన్ను పడింది. నిజమో కాదో కానీ ఫౌజీ అయ్యే దాకా వేరే సినిమాలు ఒప్పుకోకూడదని మైత్రి సంస్థ అగ్రిమెంట్ చేసుకుందని గతంలో వార్తలు వచ్చాయి.
కానీ ఇప్పుడు టి సిరీస్ అధినేతలు సంస్థ ఇమాన్వి కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారట. కార్తీక్ ఆర్యన్ హీరోగా అనురాగ్ బసు డైరెక్షన్ లో ఒక భారీ రొమాంటిక్ మూవీని ప్లాన్ చేశారు నిర్మాత భూషణ్ కుమార్. ఫౌజికి సైతం ఈయన నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు. సందీప్ వంగా – ప్రభాస్ స్పిరిట్ కి మెయిన్ ప్రొడ్యూసర్ కూడా. ఆదిపురుష్ కి ఎంత బడ్జెట్ పెట్టారో చూశాం. ఈ బాండింగ్ ని వాడుకుని ఇమాన్వి రెండో సినిమాని తమకు లాక్ చేయించేలా మాట్లాడుతున్నట్టు ముంబై రిపోర్ట్. ఈ ఏడాదిలోనే షూటింగ్ మొదలుపెట్టాలని ప్లాన్ చేసుకున్న అనురాగ్ బసు సినిమాకు హీరోయిన్ ఎంపికే పెద్ద టాస్క్ అయ్యిందని సమాచారం.
ఏదో సామెత చెప్పినట్టు ఇమాన్వి నక్క తోక తొక్కింది. లేకపోతే ఎలా కనిపిస్తుందో, ఎలా నటిస్తుందో తెలియకుండానే ఇంత డిమాండ్ రావడమంటే మాములు విషయం కాదు. సోషల్ మీడియాలో తన రీల్స్, డాన్స్ చూసినవాళ్లకు పెర్ఫార్మన్స్ గురించి డౌట్లు లేవు కానీ ఫౌజీ లాంటి ప్యాన్ ఇండియా మూవీలో ఎలా కనిపిస్తుందనేది ఆసక్తికరం. పారితోషికం కూడా భారీగానే ముట్టజెబుతున్నారట. రష్మిక మందన్న, శ్రీలీల ఇలా రెండు మూడు ఆప్షన్లతోనే నెట్టుకొస్తున్న టాలీవుడ్ స్టార్ హీరోలకు భవిష్యత్తులో ఇమాన్వి ఇస్మాయిల్ మరో ఛాయస్ అవుతుందేమో చూడాలి. ఫౌజీ విడుదల 2026కి ప్లాన్ చేస్తున్నారు.
This post was last modified on January 8, 2025 5:37 pm
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…