ఇప్పుడంతా ఇంటర్ నెట్ ప్రపంచం. కొన్ని నిముషాలు మొబైల్ డేటా లేకపోయినా, ఇంట్లో వైఫై పనిచేయకపోయినా ఏదో భూమి బద్దలైపోయి శూన్యంలో ఉన్నామనే స్థాయిలో జనాలు టెక్నాలజీకి అలవాటు పడ్డారు. చిప్స్ ప్యాకెట్ నుంచి బిర్యానీ దాకా, సినిమా టికెట్ నుంచి లగ్జరి వస్తువుల దాకా అన్ని అరచేతికి వచ్చేస్తున్నాయి. ఇంత సుఖం అలవాటు పడ్డాక కష్టమంటే ఏంటో తెలుసుకోవడం తగ్గిపోయింది. దాన్ని సినిమాల్లో చూసేందుకు ఇష్టపడటం మొదలయ్యింది. అందుకే వయొలెన్స్ డామినేషన్ గత కొన్నేళ్లుగా బాగా పెరిగింది. ఇటీవలే విడుదలైన మార్కోకు దక్కుతున్న ఆదరణ కన్నా వేరే సాక్ష్యం అక్కర్లేదేమో.
తెలుగు వెర్షన్ ఆలస్యంగా రిలీజైనా మొదటి రోజే కోటి డెబ్భై అయిదు లక్షలకు పైగా గ్రాస్ సాధించడం చూస్తే సోషల్ మీడియా, రివ్యూల ప్రభావం మన జనాల మీద గట్టిగా ఉన్నట్టు కనిపిస్తోంది. మార్కోలో విపరీతమైన హింస ఉంది. కొన్ని జుగుప్సాకర సన్నివేశాలున్నాయి. కళ్ళు తిప్పుకోకుండా ప్రీ క్లైమాక్స్ చూడటం కష్టం. విలన్ చేసే మర్డర్లు అంత దారుణంగా ఉంటాయి. కానీ ఆడియన్స్ థియేటర్లలో చూస్తున్నారు. ఏ సర్టిఫికెట్ ఉన్నా సరే హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. గతంలో యానిమల్ లాంటి వాటిలోనూ హింస ఉంది కానీ ఇంత తీవ్ర స్థాయిలో కాదు కదా కనీసం సగం కూడా లేదు. అయినా సరే మార్కో సూపర్ హిట్ దాటేసింది.
ఇలాంటి సినిమాల ప్రభావం సంఘం మీద ఉంటుందా లేదా అని డిబేట్ పెడితే రోజులు తరబడి జరుగుతుంది తప్ప దానికి కంక్లూజన్ దొరకదు. తెరమీద చూసే మంచిని నిజ జీవితంలో ఆచరించరేమో కానీ చెడుని మాత్రం వెంటనే ఫాలో అయ్యే యూత్ ఈ మధ్య పెరుగుతున్నారు. వెబ్ సిరీస్, ఓటిటిలు ఇప్పటికే విపరీత పోకడతో సెన్సార్ పెట్టాల్సిందే అని ప్రేక్షకులు డిమాండ్ చేసే దాకా వెళ్లిపోయాయి. ఇప్పుడు మార్కో ఆడింది కదాని అందరూ ఇదే ట్రెండ్ పాటిస్తే మాత్రం తెరమీద విపరీత రక్తపాతాన్ని చూడాల్సి వస్తుంది. ఇది అలవాటై రియల్ లైఫ్ లో హత్యలు జరిగినా స్పందించడం మానేస్తామేమో.
పోలీసు స్టేషన్లకు వెళ్లి ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేకుండా.. ఇక నుంచి వాయిస్ మెసేజ్ల ద్వారా కూడా ఫిర్యాదులు చేసే…
ఏపీలో వైసీపీ అదికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోని పాత జిల్లాలతో పాటుగా వైసీపీ సర్కారే కొత్తగా ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల్లోనూ…
పవన్ కళ్యాణ్ భుజాల లోపల కలిగిన గాయం ఊహించిన దానికంటే తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్…
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును వేధింపులకు గురిచేసి.. కస్టడీలో టార్చర్ చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ సునీల్ కుమార్…
రాజకీయాలంటే చాలా మంది చెడిపోయాయని అనుకుంటారు. కానీ, రాజకీయాలు అంతగా ఏమీ చెడిపోలేదు. ఒక పార్టీ కారణంగానే ఈ పేరు…
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేసింది. నిజానికి…