అల్లు అర్జున్ ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా దగ్గరవడంలో త్రివిక్రమ్ పాత్ర చాలా వుంది. అంతకుముందు యూత్ ఫాలోయింగ్ మాత్రమే వున్న అల్లు అర్జున్కి ‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’ చిత్రాలతో త్రివిక్రమ్ ఫ్యామిలీ ఆడియన్స్ని జత చేసాడు. మాస్లో ఎన్టీఆర్, చరణ్, ప్రభాస్ లాంటి రీచ్ లేకపోయినా కానీ ఈ రెండు సెక్షన్స్ వల్ల అల్లు అర్జున్ సినిమాల రేంజ్ పెరుగుతోంది.
యూత్ ప్లస్ ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ వుంటే ఒక సినిమా ఎంత పెద్ద హిట్టవుతుందనేది ‘అల వైకుంఠపురములో’ విషయంలో స్పష్టమయింది. త్రివిక్రమ్తో తన కాంబినేషన్ భేషుగ్గా వర్కవుట్ అవడంతో మరోసారి త్రివిక్రమ్ సినిమాను లైన్లో పెట్టాలని అల్లు అర్జున్ ఉవ్విళ్లూరుతున్నాడు. పుష్ప తర్వాత కొరటాల శివ సినిమా చేయబోతున్న అల్లు అర్జున్ ఆ వెంటనే త్రివిక్రమ్ సినిమా చేయాలని చూస్తున్నాడు.
త్రివిక్రమ్కి తారక్, మహేష్, చరణ్తో కమిట్మెంట్స్ వున్నాయి. అలాగే చిరంజీవి, వెంకటేష్తో కూడా చెరో ఒక సినిమా చేస్తానని మాటిచ్చాడు. మరి వీటన్నిటి మధ్య మళ్లీ అల్లు అర్జున్ సినిమాకు ఎక్కడ స్పేస్ ఇస్తాడనేది తెలియదు. కాకపోతే అల్లు అర్జున్ తీసుకునే ఎక్స్ట్రా కేర్ ప్లస్ తన పర్సనల్ టీమ్ సలహాలు, సంప్రదింపుల వల్ల త్రివిక్రమ్ పని ఈజీ అయిపోతూ వుంటుంది కనుక త్రివిక్రమ్కి అతనితో పని చేయడం ఎప్పుడూ హ్యాపీనే.
ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ 'మై వాపస్ ఆవుంగా'కు తొలి రోజు రివ్యూలు ఏమంత ఆశాజనకంగా లేవు. పబ్లిక్ టాక్…
సాయిధరమ్ తేజ్ హీరోగా రెండేళ్ల ముందు మొదలైన సినిమా.. సంబరాల యేటిగట్టు. తన మార్కెట్ స్థాయికి మించి పెద్ద బడ్జెట్లో…
పెద్ది మొదటి రెండు వారాలు బాగా సందడి చేసి కలెక్షన్ల వర్షం కురిపించాక మళ్ళీ దాన్ని కొనసాగించే సినిమా ఏది…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’యే చివరి చిత్రం అవుతుందనే అంచనాలు కలిగాయి ఒక దశలో.…
తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు, యువ ఉద్యోగుల మరణ వార్తలు అమెరికా నుంచి వరుసగా వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. రోడ్డు…
వైసీపీ ఆధ్వర్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కోనసీమలో ఆదివారం నిర్వహించిన కాపుల సభలో మాజీ మంత్రి, ఉత్తరాంధ్రకు చెందిన బొత్స…