అల్లు అర్జున్ ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా దగ్గరవడంలో త్రివిక్రమ్ పాత్ర చాలా వుంది. అంతకుముందు యూత్ ఫాలోయింగ్ మాత్రమే వున్న అల్లు అర్జున్కి ‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’ చిత్రాలతో త్రివిక్రమ్ ఫ్యామిలీ ఆడియన్స్ని జత చేసాడు. మాస్లో ఎన్టీఆర్, చరణ్, ప్రభాస్ లాంటి రీచ్ లేకపోయినా కానీ ఈ రెండు సెక్షన్స్ వల్ల అల్లు అర్జున్ సినిమాల రేంజ్ పెరుగుతోంది.
యూత్ ప్లస్ ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ వుంటే ఒక సినిమా ఎంత పెద్ద హిట్టవుతుందనేది ‘అల వైకుంఠపురములో’ విషయంలో స్పష్టమయింది. త్రివిక్రమ్తో తన కాంబినేషన్ భేషుగ్గా వర్కవుట్ అవడంతో మరోసారి త్రివిక్రమ్ సినిమాను లైన్లో పెట్టాలని అల్లు అర్జున్ ఉవ్విళ్లూరుతున్నాడు. పుష్ప తర్వాత కొరటాల శివ సినిమా చేయబోతున్న అల్లు అర్జున్ ఆ వెంటనే త్రివిక్రమ్ సినిమా చేయాలని చూస్తున్నాడు.
త్రివిక్రమ్కి తారక్, మహేష్, చరణ్తో కమిట్మెంట్స్ వున్నాయి. అలాగే చిరంజీవి, వెంకటేష్తో కూడా చెరో ఒక సినిమా చేస్తానని మాటిచ్చాడు. మరి వీటన్నిటి మధ్య మళ్లీ అల్లు అర్జున్ సినిమాకు ఎక్కడ స్పేస్ ఇస్తాడనేది తెలియదు. కాకపోతే అల్లు అర్జున్ తీసుకునే ఎక్స్ట్రా కేర్ ప్లస్ తన పర్సనల్ టీమ్ సలహాలు, సంప్రదింపుల వల్ల త్రివిక్రమ్ పని ఈజీ అయిపోతూ వుంటుంది కనుక త్రివిక్రమ్కి అతనితో పని చేయడం ఎప్పుడూ హ్యాపీనే.
This post was last modified on October 11, 2020 4:33 pm
రేపు విడుదల కాబోతున్న టాక్సిక్ మీద అభిమానుల అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఆశ్చర్యకరంగా హిందీ వెర్షన్ అమ్మకాలు…
మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టుతో లిక్కర్ కుంభకోణం మళ్ళీ తెరపైకి వచ్చింది. వైసీపీ ప్రభుత్వంలో నాశిరకం మద్యం వ్యాపారాన్ని…
``కాంగ్రెస్ పార్టీలో నేనైనా ఆమె అయినా ఒక్కటే. పార్టీ క్రమశిక్షణ విషయంలో అందరూ సమానమే. ఎవరు ఏం చేశారన్నది పార్టీ…
ఒక పార్టీలో ఇబ్బందులు రావొచ్చు.. నాయకులు అసంతృప్తి వ్యక్తం చేయొచ్చు. కానీ.. అడుగు పెట్టిన ప్రతిపార్టీలోనూ ఇబ్బందులు వస్తే.. ప్రతిపార్టీపైనా…
‘ఎల్లమ్మ’ గురించి ఇప్పటివరకు ఎక్కువగా మాట్లాడుకున్నది వేణు యెల్దండి కథ, గ్రామీణ నేపథ్యం, డీఎస్పీ లుక్ గురించే. ‘బలగం’ తర్వాత…
వారం రోజుల క్రితం తిరుపతిలో వెంకటేశ్వర స్వామి సాక్షిగా రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి…