థియేటర్లో కొత్తగా రిలీజైన సినిమాలే పైరసీ నుంచి తప్పించుకోలేకపోతున్నాయి. అలాంటిది ఓటిటిలో హెచ్డి ప్రింట్లు వచ్చాక ఆగుతాయా. ఎంత సాంకేతికత వాడినా దీన్ని కట్టడి చేయడం సాధ్యం కాకపోవడంతో చాలా సందర్భాల్లో అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ లాంటి అంతర్జాతీయ సంస్థలు పలు చర్యలు తీసుకున్నా ఫలితం అందుకోలేకపోయాయి. కానీ పక్కా తెలుగు యాప్ ఈటీవీ విన్ దగ్గర ఏదైనా మంత్రం ఉందో ఏమో కానీ పైరసీ భూతాన్ని టెక్నాలజీ సాయంతో కంట్రోల్ చేయడంలో బాగానే విజయం సాధిస్తోంది. గత నెల దీపావళికి విడుదలైన ‘క’ నిన్న అర్ధరాత్రి నుంచి ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
ఆశ్చర్యకరంగా క’ ఎక్కడ పైరసీ బారిన పడకుండా సదరు ఓటిటిలో మాత్రమే అందుబాటులోకి రావడం విశేషం. కేవలం టీవీ, మొబైల్ ద్వారా చూసే వెసులుబాటు ఇవ్వడం ద్వారా కట్టడి చేయడానికి అవకాశం దొరికిందని టెకీ టాక్. డెస్క్ టాప్, లాప్ టాప్ ఆప్షన్ లేకుండా చేయడం వల్ల సాధ్యమయ్యిందని అంటున్నారు. ఇదే సమయానికి నెట్ ఫ్లిక్స్ లో వచ్చిన లక్కీ భాస్కర్ పైరసీ బ్యాచుకు దొరికిపోవడం ట్విస్టు. విన్ యాప్ లో గతంలో వచ్చిన వీరాంజనేయులు విహారయాత్రకు ఇదే తరహాలో పైరసీని ఆపగలిగారు. నటుడు నరేష్ పైరసీ చేసుకోమని ఛాలెంజ్ విసరడం హాట్ టాపిక్ అయ్యింది. 90స్ వెబ్ సిరీస్ ని అనఫీషియల్ గా చూసిన వాళ్లే ఎక్కువగా ఉండటం ఈటీవీ టీమ్ ని కొత్త పరిష్కారం వైపు నడిపించింది.
ఇప్పటికిప్పుడు కాకపోయినా ఇలా మెల్లగా పైరసీ నియంత్రణకు రకరకాల మార్గాలు వెతకడం ద్వారా థియేటర్ తో పాటు డిజిటల్ లోనూ సినిమాను బ్రతికించేందుకు అవకాశం దొరుకుతుంది.కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన క’ ఓటిటి హక్కులు థియేటర్ విడుదలకు ముందు అమ్ముడుపోలేదు. నిర్మాత ఆశించిన మొత్తానికి కంపెనీలు కోట్ చేసిన సొమ్ముకు వ్యత్యాసం ఉండటంతో నిర్ణయం తీసుకోలేదు. తీరా రిలీజయ్యాక బ్లాక్ బస్టర్ ఫలితం దక్కడంతో ఈటివి పోటీపడి హక్కులు సొంతం చేసుకుంది. పది కోట్ల దాకా ఆఫర్ చేశారనే టాక్ ఉంది కానీ నిర్ధారణగా ఎంత మొత్తమనేది అధికారికంగా బయటికి రాలేదు. ఓటిటిని విస్తరించుకునే పనిలో ఉన్న ఈటీవీ విన్ కి క’ ఒకరకంగా జాక్ పాట్ లాంటిది. ఈ సినిమా కోసమైనా చేరే చందాదారులు ఖచ్చితంగా ఉంటారు. ఆదాయం పెరిగేది కూడా వాళ్ళ వల్లే.
This post was last modified on November 28, 2024 1:00 pm
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…